డయాలసిస్ చేయించుకోవాల్సిన నిరుపేద కిడ్నీ రోగులకు శుభవార్త. కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వారి సౌకర్యార్థం మరో రెండు డయాలసిస్ సెంటర్లు త్వరలో ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం ఉన్న డయాలసిస్ కేంద్రాలపై భారం పెరగడంతోపాటు తమ పేర్లు నమోదు చేసుకున్న పలువురు డయాలసిస్ రోగులు తమ వంతు కోసం ఎదురుచూస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు మూడు డయాలసిస్ కేంద్రాలను మంజూరు చేసి ఉచితంగా చికిత్స అందించింది. మణుగూరులోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మరియు యెల్లందులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో రెండు కొత్త డయాలసిస్ కేంద్రాలు స్థాపించబడ్డాయి. అయితే వీటిని బుధవారం ప్రారంభించనున్నారు. దీంతో ప్రస్తుత కేంద్రాలపై భారం తగ్గనుంది. ఈ నేపథ్యంలో మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. ‘ నాడు కిడ్నీ రోగం వస్తే నాడు ప్రాణాలు పోయినంతపని. వ్యయప్రయాసలు, తిండి తిప్పలు ఓర్చుకొని హైదరాబాద్ దాకా వెళ్లి డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి.
Also Read : Bhatti Vikramarka : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. నిరుద్యోగ భృతి 4 వేలు ఇస్తాం
కానీ నేడు స్వరాష్ట్రంలో అలాంటి పరిస్థితులకు చరమగీతం పాడారు సీఎం కేసీఆర్ గారు. గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటి 3 ఆసుపత్రులకు మాత్రమే పరిమితమైన డయాలసిస్ సేవలను ఏకంగా 102కు పెంచి సేవలు విస్తృతం చేశారు. పట్నం దాకా రావాల్సిన అవసరం లేకుండానే, పేద ప్రజల చెంతకే డయాలసిస్ సేవలను తీసుకువెళ్లారు. BRS Party ప్రభుత్వం ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాలు కిడ్నీ బాధితులకు వరంగా మారాయి. సిర్పూర్ కాగజ్ నగర్, ఏటూరునాగారం వంటి మారుమూల ప్రాంతాల్లో సైతం నేడు డయాలసిస్ సేవలు అందిస్తున్నాం అని సగర్వంగా చెప్తున్నాం. ఇన్ఫెక్షన్లు సోకకుండా దేశంలో తొలిసారి సింగిల్ యూజ్ డయలైజర్ పద్ధతి అనుసరిస్తుండగా, పేషెంట్లకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు ఆసరా పింఛన్, డయాలసిస్ కేంద్రానికి చెరుకునేందుకు వీలుగా ఉచిత బస్ పాస్ లను తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నది. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడింది కాబట్టి, సీఎంగా కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి సాధ్యమైందన్నది అక్షర సత్యం.’ అని మంత్రి హరీష్ రావు ట్విట్ చేశారు.
Also Read : Karnataka CM : కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థిపై కొనసాగుతున్న ఉత్కంఠ