Harish Rao : సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఘాటు విమర్శలు
- గజ్వేల్ అభివృద్ధికి కేసీఆర్ కృషి
- కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత
- రేవంత్ పాలనపై తీవ్ర విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao : బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గజ్వేల్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన హరీష్ రావు, రేవంత్ రెడ్డిని చిల్లర రాజకీయాలు, దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్న నేతగా పేర్కొన్నారు.
హరీష్ రావు మాట్లాడుతూ, కేసీఆర్కు గజ్వేల్ అంటే తల్లీ-పిల్లల బంధంలా ఉందని, ఆయన అభ్యాసంతోనే గజ్వేల్ అభివృద్ధిలో దూసుకెళ్లిందని తెలిపారు. ఒకప్పుడు గజ్వేల్ హింసాత్మక సంఘటనలు, కుట్రలు, పోలీస్ కేసులతో నిండిన ప్రాంతంగా ఉండేదని, కానీ కేసీఆర్ అధికారం చేపట్టిన తర్వాత గజ్వేల్ అభివృద్ధి, ప్రేమ, అభిమానాలకు కేంద్రంగా మారిందని పేర్కొన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి మంచినీటిని అందజేసిన ఘనత కూడా కేసీఆర్దేనని హరీష్ రావు చెప్పారు.
Also Read
- Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆదేశాలతో.. మన్యం జిల్లాకు రెండు కుంకీ ఏనుగులు..
- Rahul Gandhi: ప్రధాని ఇంటి ముందు ధర్నాకు రావాలి.. దేశ ప్రజలకు రాహుల్ గాంధీ విజ్ఞప్తి
- Ambati Rambabu: నా దిష్టిబొమ్మ తగలబెడితే గడ్డి కాలడం తప్ప నాకేం కాదు: అంబటి రాంబాబు
- AAP: ప్రధాని నివాసం ముందు ధర్నా.. కాంగ్రెస్పై ఆప్ ఎదురుదాడి
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మిషన్ భగీరథ ప్రాజెక్టుపై కోత విధించిందని హరీష్ రావు మండిపడ్డారు. ఒకప్పుడు మొదటి అంతస్తులకు సైతం నీరు అందుతుండగా, ఇప్పుడు కనీస నీరుకూడా అందకుండా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. రైతుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరు అందించారని, గోదావరి జలాలతో గజ్వేల్ లో రైతులు సస్యశ్యామలం అవుతున్నారని తెలిపారు. కానీ రేవంత్ రెడ్డి పాలనలో భూముల ధరలు పడిపోతున్నాయని, ప్రజలు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆరోపించారు.
గజ్వేల్ను విద్యా హబ్గా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్కు దక్కుతుందని, పాఠశాలల స్థితిగతులను మెరుగుపరిచారని హరీష్ రావు వివరించారు. కేసీఆర్ మంజూరు చేసిన రూ.181 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను రేవంత్ రెడ్డి రద్దు చేయడం బాధాకరమని, ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పటికీ గజ్వేల్ అభివృద్ధికి ఏమాత్రం దోహదం చేయడం లేదని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గజ్వేల్ గురించి ఏడ్చిన రేవంత్, సీఎం అయిన తరువాత కూడా అదే ఏడుపు కొనసాగించడం దారుణమని వ్యాఖ్యానించారు.
హరీష్ రావు మాట్లాడుతూ, కేసీఆర్ ప్రాజెక్టుల వల్లే మల్లన్నసాగర్ గేట్లు తెరుచుకున్నాయని, కానీ రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ చేసిన కృషిని ప్రజలు మరవలేరని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందుకు పూర్తిగా విరుద్ధంగా వ్యవహరిస్తోందని హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Women Playing Poker: పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డ ఆరుగురు మహిళలు..
- Tags
- BRS
- congress
- gajwel
- harish rao
- kcr
తాజావార్తలు
-
Ajay Bhupathi: ఆర్జీవీ మేకింగ్ స్టైల్కు ప్రత్యేక బ్రాండ్ ఉంది
-
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆదేశాలతో.. మన్యం జిల్లాకు రెండు కుంకీ ఏనుగులు..
-
Rahul Gandhi: ప్రధాని ఇంటి ముందు ధర్నాకు రావాలి.. దేశ ప్రజలకు రాహుల్ గాంధీ విజ్ఞప్తి
-
El Nino : ఎల్నీనో ఎఫెక్ట్.. తెలంగాణలో డ్రౌట్ అలర్ట్.!
-
Ambati Rambabu: నా దిష్టిబొమ్మ తగలబెడితే గడ్డి కాలడం తప్ప నాకేం కాదు: అంబటి రాంబాబు
ట్రెండింగ్
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!