Harish Rao : సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఘాటు విమర్శలు
- గజ్వేల్ అభివృద్ధికి కేసీఆర్ కృషి
- కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత
- రేవంత్ పాలనపై తీవ్ర విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao : బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గజ్వేల్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన హరీష్ రావు, రేవంత్ రెడ్డిని చిల్లర రాజకీయాలు, దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్న నేతగా పేర్కొన్నారు.
హరీష్ రావు మాట్లాడుతూ, కేసీఆర్కు గజ్వేల్ అంటే తల్లీ-పిల్లల బంధంలా ఉందని, ఆయన అభ్యాసంతోనే గజ్వేల్ అభివృద్ధిలో దూసుకెళ్లిందని తెలిపారు. ఒకప్పుడు గజ్వేల్ హింసాత్మక సంఘటనలు, కుట్రలు, పోలీస్ కేసులతో నిండిన ప్రాంతంగా ఉండేదని, కానీ కేసీఆర్ అధికారం చేపట్టిన తర్వాత గజ్వేల్ అభివృద్ధి, ప్రేమ, అభిమానాలకు కేంద్రంగా మారిందని పేర్కొన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి మంచినీటిని అందజేసిన ఘనత కూడా కేసీఆర్దేనని హరీష్ రావు చెప్పారు.
Also Read
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
- Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
- EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..
- Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మిషన్ భగీరథ ప్రాజెక్టుపై కోత విధించిందని హరీష్ రావు మండిపడ్డారు. ఒకప్పుడు మొదటి అంతస్తులకు సైతం నీరు అందుతుండగా, ఇప్పుడు కనీస నీరుకూడా అందకుండా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. రైతుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరు అందించారని, గోదావరి జలాలతో గజ్వేల్ లో రైతులు సస్యశ్యామలం అవుతున్నారని తెలిపారు. కానీ రేవంత్ రెడ్డి పాలనలో భూముల ధరలు పడిపోతున్నాయని, ప్రజలు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆరోపించారు.
గజ్వేల్ను విద్యా హబ్గా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్కు దక్కుతుందని, పాఠశాలల స్థితిగతులను మెరుగుపరిచారని హరీష్ రావు వివరించారు. కేసీఆర్ మంజూరు చేసిన రూ.181 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను రేవంత్ రెడ్డి రద్దు చేయడం బాధాకరమని, ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పటికీ గజ్వేల్ అభివృద్ధికి ఏమాత్రం దోహదం చేయడం లేదని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గజ్వేల్ గురించి ఏడ్చిన రేవంత్, సీఎం అయిన తరువాత కూడా అదే ఏడుపు కొనసాగించడం దారుణమని వ్యాఖ్యానించారు.
హరీష్ రావు మాట్లాడుతూ, కేసీఆర్ ప్రాజెక్టుల వల్లే మల్లన్నసాగర్ గేట్లు తెరుచుకున్నాయని, కానీ రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ చేసిన కృషిని ప్రజలు మరవలేరని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందుకు పూర్తిగా విరుద్ధంగా వ్యవహరిస్తోందని హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Women Playing Poker: పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డ ఆరుగురు మహిళలు..
- Tags
- BRS
- congress
- gajwel
- harish rao
- kcr
తాజావార్తలు
-
The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
-
AMB, AAAల తర్వాత ఇక ‘మెగా సినిమాస్’.. ప్రపంచ స్థాయి స్క్రీన్తో బాస్ ఎంట్రీ?
-
Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
-
Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
-
EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!