Harish Rao : సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఘాటు విమర్శలు
- గజ్వేల్ అభివృద్ధికి కేసీఆర్ కృషి
- కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత
- రేవంత్ పాలనపై తీవ్ర విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao : బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గజ్వేల్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన హరీష్ రావు, రేవంత్ రెడ్డిని చిల్లర రాజకీయాలు, దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్న నేతగా పేర్కొన్నారు.
హరీష్ రావు మాట్లాడుతూ, కేసీఆర్కు గజ్వేల్ అంటే తల్లీ-పిల్లల బంధంలా ఉందని, ఆయన అభ్యాసంతోనే గజ్వేల్ అభివృద్ధిలో దూసుకెళ్లిందని తెలిపారు. ఒకప్పుడు గజ్వేల్ హింసాత్మక సంఘటనలు, కుట్రలు, పోలీస్ కేసులతో నిండిన ప్రాంతంగా ఉండేదని, కానీ కేసీఆర్ అధికారం చేపట్టిన తర్వాత గజ్వేల్ అభివృద్ధి, ప్రేమ, అభిమానాలకు కేంద్రంగా మారిందని పేర్కొన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి మంచినీటిని అందజేసిన ఘనత కూడా కేసీఆర్దేనని హరీష్ రావు చెప్పారు.
Also Read
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మిషన్ భగీరథ ప్రాజెక్టుపై కోత విధించిందని హరీష్ రావు మండిపడ్డారు. ఒకప్పుడు మొదటి అంతస్తులకు సైతం నీరు అందుతుండగా, ఇప్పుడు కనీస నీరుకూడా అందకుండా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. రైతుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరు అందించారని, గోదావరి జలాలతో గజ్వేల్ లో రైతులు సస్యశ్యామలం అవుతున్నారని తెలిపారు. కానీ రేవంత్ రెడ్డి పాలనలో భూముల ధరలు పడిపోతున్నాయని, ప్రజలు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆరోపించారు.
గజ్వేల్ను విద్యా హబ్గా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్కు దక్కుతుందని, పాఠశాలల స్థితిగతులను మెరుగుపరిచారని హరీష్ రావు వివరించారు. కేసీఆర్ మంజూరు చేసిన రూ.181 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను రేవంత్ రెడ్డి రద్దు చేయడం బాధాకరమని, ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పటికీ గజ్వేల్ అభివృద్ధికి ఏమాత్రం దోహదం చేయడం లేదని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గజ్వేల్ గురించి ఏడ్చిన రేవంత్, సీఎం అయిన తరువాత కూడా అదే ఏడుపు కొనసాగించడం దారుణమని వ్యాఖ్యానించారు.
హరీష్ రావు మాట్లాడుతూ, కేసీఆర్ ప్రాజెక్టుల వల్లే మల్లన్నసాగర్ గేట్లు తెరుచుకున్నాయని, కానీ రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ చేసిన కృషిని ప్రజలు మరవలేరని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందుకు పూర్తిగా విరుద్ధంగా వ్యవహరిస్తోందని హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Women Playing Poker: పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డ ఆరుగురు మహిళలు..
- Tags
- BRS
- congress
- gajwel
- harish rao
- kcr
తాజావార్తలు
-
Dharman : రజనీకాంత్ – రామ్ పోతినేని ‘ధర్మన్’ సంక్రాంతి రిలీజ్?
-
Xiaomi 18 Fold: షియోమి 18 ఫోల్డ్.. 6,000mAh బ్యాటరీ.. 7.6 ఇంచెస్ డిస్ప్లే, 67W ఫాస్ట్ ఛార్జింగ్
-
Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!