Harish Rao : సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఘాటు విమర్శలు
- గజ్వేల్ అభివృద్ధికి కేసీఆర్ కృషి
- కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత
- రేవంత్ పాలనపై తీవ్ర విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao : బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గజ్వేల్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన హరీష్ రావు, రేవంత్ రెడ్డిని చిల్లర రాజకీయాలు, దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్న నేతగా పేర్కొన్నారు.
హరీష్ రావు మాట్లాడుతూ, కేసీఆర్కు గజ్వేల్ అంటే తల్లీ-పిల్లల బంధంలా ఉందని, ఆయన అభ్యాసంతోనే గజ్వేల్ అభివృద్ధిలో దూసుకెళ్లిందని తెలిపారు. ఒకప్పుడు గజ్వేల్ హింసాత్మక సంఘటనలు, కుట్రలు, పోలీస్ కేసులతో నిండిన ప్రాంతంగా ఉండేదని, కానీ కేసీఆర్ అధికారం చేపట్టిన తర్వాత గజ్వేల్ అభివృద్ధి, ప్రేమ, అభిమానాలకు కేంద్రంగా మారిందని పేర్కొన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి మంచినీటిని అందజేసిన ఘనత కూడా కేసీఆర్దేనని హరీష్ రావు చెప్పారు.
Also Read
- CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
- Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
- Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
- Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మిషన్ భగీరథ ప్రాజెక్టుపై కోత విధించిందని హరీష్ రావు మండిపడ్డారు. ఒకప్పుడు మొదటి అంతస్తులకు సైతం నీరు అందుతుండగా, ఇప్పుడు కనీస నీరుకూడా అందకుండా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. రైతుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరు అందించారని, గోదావరి జలాలతో గజ్వేల్ లో రైతులు సస్యశ్యామలం అవుతున్నారని తెలిపారు. కానీ రేవంత్ రెడ్డి పాలనలో భూముల ధరలు పడిపోతున్నాయని, ప్రజలు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆరోపించారు.
గజ్వేల్ను విద్యా హబ్గా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్కు దక్కుతుందని, పాఠశాలల స్థితిగతులను మెరుగుపరిచారని హరీష్ రావు వివరించారు. కేసీఆర్ మంజూరు చేసిన రూ.181 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను రేవంత్ రెడ్డి రద్దు చేయడం బాధాకరమని, ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పటికీ గజ్వేల్ అభివృద్ధికి ఏమాత్రం దోహదం చేయడం లేదని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గజ్వేల్ గురించి ఏడ్చిన రేవంత్, సీఎం అయిన తరువాత కూడా అదే ఏడుపు కొనసాగించడం దారుణమని వ్యాఖ్యానించారు.
హరీష్ రావు మాట్లాడుతూ, కేసీఆర్ ప్రాజెక్టుల వల్లే మల్లన్నసాగర్ గేట్లు తెరుచుకున్నాయని, కానీ రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ చేసిన కృషిని ప్రజలు మరవలేరని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందుకు పూర్తిగా విరుద్ధంగా వ్యవహరిస్తోందని హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Women Playing Poker: పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డ ఆరుగురు మహిళలు..
- Tags
- BRS
- congress
- gajwel
- harish rao
- kcr
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!