Harish Rao : బడ్జెట్లో అబద్దాల వెల్లువ.. పింఛన్లపై భ్రమలు..
- బడ్జెట్లో అబద్దాల వెల్లువ
- రేషన్ కార్డుల విషయంలో అసత్య ప్రచారం
- మహాలక్ష్మి పథకం – వాస్తవ పరిస్థితి
- పింఛన్లపై భ్రమలు – రుణమాఫీ హామీ
- ఆర్థిక పరిస్థితి – మద్యం ఆదాయం పై సెటైర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao : మాజీమంత్రి హరీష్ రావు తెలంగాణ బడ్జెట్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలకు మేలు చేసేలా కాకుండా, పూర్తిగా అబద్దాలతో నిండిన బడ్జెట్గా ఆయన అభివర్ణించారు. అసెంబ్లీలో భట్టి విక్రమార్క ప్రసంగాన్ని విమర్శిస్తూ, అది బడ్జెట్ ప్రసంగంలా కాకుండా రాజకీయ ప్రసంగంలా మారిపోయిందని అన్నారు. హరీష్ రావు ప్రకారం, బడ్జెట్లో పేర్కొన్న అనేక విషయాలు నిజాలకు విరుద్ధంగా ఉన్నాయని అన్నారు. ముఖ్యంగా, వడ్డీ లేని రుణాల విషయాన్ని ప్రస్తావిస్తూ, కోటి మంది మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామన్నది పూర్తిగా అబద్ధమని, అసలు వాస్తవం ఏమిటంటే 5 లక్షల రూపాయల వరకు మాత్రమే వడ్డీ లేని రుణం అందుబాటులో ఉందని తెలిపారు.
అలానే, స్టిచింగ్ చార్జీల విషయంలో కూడా ప్రజలను మభ్యపెట్టే విధంగా ప్రకటించారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.75 మాత్రమే చెల్లిస్తోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదన్న విమర్శను ఖండించిన హరీష్ రావు, తమ హయాంలో 20 లక్షల మందికి రేషన్ కార్డులు మంజూరు చేశామని, ఇది ప్రభుత్వ రికార్డుల ద్వారా స్పష్టమవుతోందన్నారు.
Also Read
- Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
- OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
హరీష్ రావు మహాలక్ష్మి పథకాన్ని ప్రస్తావిస్తూ, బడ్జెట్లో మహిళలకు రూ.2,500 ఇవ్వబోతున్నామని చెప్పినా, అసలు దీనిపై ఎలాంటి స్పష్టత లేదని అన్నారు. అంతేగాక, ఈ బడ్జెట్లో అందాల పోటీల కోసం రూ.250 కోట్లు కేటాయించారని ఎద్దేవా చేశారు. పింఛన్లను రూ.4,000 చేయలేదని, అలాగే లక్ష మంది లబ్ధిదారులను తొలగించారని హరీష్ రావు ఆరోపించారు. అదేవిధంగా, ప్రభుత్వం రైతులకు పూర్తిగా రుణమాఫీ చేశామని చెప్పినా, వాస్తవానికి ఎక్కడా అమలు చేయలేదని తెలిపారు.
హరీష్ రావు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రస్తావిస్తూ, రాష్ట్ర స్థూల ఉత్పత్తి తగ్గిపోయిందని, ప్రభుత్వం దివాళా తీసినట్టుగా ఉందని విమర్శించారు. మద్యం ఆదాయం ద్వారా రాష్ట్రానికి రూ.50,000 కోట్లు వస్తున్నాయని చెప్పిన హరీష్ రావు, ‘‘తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చేస్తారా?’’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Chahal – Dhanashree: చాహల్-ధనశ్రీ విడాకులపై రేపు తీర్పు.. భరణం ఎన్ని కోట్ల రూపాయలో తెలుసా..
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!