Harish Rao : మూసీ బాధితులకు సీఎం రేవంత్ ఏం న్యాయం చేశారు
- మూసీ ప్రక్షాళనలో పేదలకు అన్యాయం జరిగితే చావడానికైనా సిద్ధం
- నన్ను.. కేటీఆర్ను బుల్డోజర్తో తొక్కిస్తా అంటున్నాడు
- ఆయన బెదిరింపులకు బీఆర్ఎస్ నేతలు భయపడరు
- మా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు
- పోలీస్ ఆఫీసర్లకు ఒకటి చెబుతున్నా
- ఈ ప్రభుత్వ ఎల్లకాలం ఉండదు : హరీష్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిగ్గులేకుండా మల్లన్నసాగర్ నిర్వాసితులకు కేసీఆర్ అన్యాయం చేశారని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారని, మూసీ బాధితులకు సీఎం రేవంత్ ఏం న్యాయం చేశారన్నారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2013 భూ సేకరణ చట్టం కాంగ్రెస్ పార్టీ తెచ్చిందని, కాంగ్రెస్ తెచ్చిన భూ చట్టం కంటే మెరుగైన సహాయం మేము చేశామన్నారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు ఒక్క ఇల్లు అయిన కట్టించారా అని సీఎం రేవంత్ మాట్లాడుతున్నారని, ఒక్క గజ్వేల్ లొనే 3 వేలకు పైగా ఇల్లు కట్టి మేము నిర్వాసితులకు ఇచ్చామన్నారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నిర్వాసితులపై కాంగ్రెస్ నేతలు కపట ప్రేమ చూపిస్తున్నారని, మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్, 25 వేల రూపాయలు ఖర్చుకు ఇస్తున్నామని సీఎం రేవంత్ గొప్పలు చెబుతున్నారన్నారు హరీష్ రావు. మల్లన్న సాగర్ భూ సేకరణ చేసినప్పుడు పాత ఇంటికి రెండింతలు నష్ట పరిహారం ఇచ్చామని, దీని కోసం 694 కోట్ల రూపాయలు ఇచ్చామన్నారు. ఇంటి యజమాని, భార్యకు 7 లక్షల 50 వేలు ఉపాధి కోసం ఇచ్చామని, ఇంట్లో 18 ఏళ్ళు దాటిన పెళ్లికాని వారికి ఉపాధి కోసం 5 లక్షల రూపాయలు ఇచ్చామన్నారు హరీష్ రావు. అందరికి ఇల్లు కట్టి ఇచ్చాము…పెళ్లి కాని వారికి కూడా 250 గజాల స్థలం ఇచ్చామని, ఖర్చులకు 30 వేల నుంచి 50 వేల రూపాయలు ఇచ్చామన్నారు. గజ్వేల్ నడిబొడ్డున డబుల్ రూమ్ ఇల్లు కట్టి ఇచ్చామని, మూసీ బాధితులకు కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు రేవంత్ ఇచ్చి గొప్పలు చెబుతున్నారన్నారు.
Team India: న్యూజిలాండ్తో జరిగే రెండు, మూడో టెస్టు మ్యాచ్లకు భారత జట్టు ఇదే..
Also Read
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
- Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
- Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
అంతేకాకుండా..’నీకు దమ్ముంటే గజ్వేల్ లో కేసీఆర్ ఇండ్లు కట్టిచ్చినట్టు కట్టివ్వాలి. గచ్చిబౌలిలో 50ప్ ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. గచ్చిబౌలిలో మూసి బాధితులకు 250 గజాల ఇల్లు కట్టి ఇవ్వాలి రేవంత్. ముంపు గ్రామాలకు 2 వేల కోట్లు ఇచ్చారు కేసీఆర్.. ఇంకో 200 కోట్ల రూపాయలు బాకీ ఉండొచ్చు.. మేము 90 శాతం చేసినం నువ్వు మిగిలిన 10 శాతం చెయ్యి మరి.. మీరు ఇంకొన్ని కలిపి ముంపు బాధితులకు ఇవ్వండి మేము వద్దన్నమా..? మీరు సహాయం చేస్తే నేనె వచ్చి మీకు సన్మానం చేస్తా.. కాంగ్రెస్ వచ్చి ఏడాది అయ్యింది… మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ నిర్వాసితులకు ఒక్క రూపాయి అయినా ఇచ్చారా..? మోసం, దగా, గోబెల్స్ ప్రచారాలు కాంగ్రెస్ పార్టీవి.. ప్రజలు మమ్మల్ని కాదని మీకు అవకాశం ఇచ్చారు..మీరు బాగా పని చేయండి.. ఆ రోజు మల్లన్నసాగర్ ప్రాజెక్టును అడ్డుకున్నారు.. ఈ రోజు మల్లన్నసాగర్ నిర్వాసితులపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు.. మీ సొల్లు వాగుడు బంద్ చేయండి..’ అని హరీష్ రావు అన్నారు.
Bihar: సన్యాసిగా భారత్లో నివసిస్తున్న బంగ్లాదేశీ.. బీహార్ ఎయిర్పోర్టులో అరెస్ట్..
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!