Harish Rao : మూసీ బాధితులకు సీఎం రేవంత్ ఏం న్యాయం చేశారు
- మూసీ ప్రక్షాళనలో పేదలకు అన్యాయం జరిగితే చావడానికైనా సిద్ధం
- నన్ను.. కేటీఆర్ను బుల్డోజర్తో తొక్కిస్తా అంటున్నాడు
- ఆయన బెదిరింపులకు బీఆర్ఎస్ నేతలు భయపడరు
- మా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు
- పోలీస్ ఆఫీసర్లకు ఒకటి చెబుతున్నా
- ఈ ప్రభుత్వ ఎల్లకాలం ఉండదు : హరీష్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిగ్గులేకుండా మల్లన్నసాగర్ నిర్వాసితులకు కేసీఆర్ అన్యాయం చేశారని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారని, మూసీ బాధితులకు సీఎం రేవంత్ ఏం న్యాయం చేశారన్నారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2013 భూ సేకరణ చట్టం కాంగ్రెస్ పార్టీ తెచ్చిందని, కాంగ్రెస్ తెచ్చిన భూ చట్టం కంటే మెరుగైన సహాయం మేము చేశామన్నారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు ఒక్క ఇల్లు అయిన కట్టించారా అని సీఎం రేవంత్ మాట్లాడుతున్నారని, ఒక్క గజ్వేల్ లొనే 3 వేలకు పైగా ఇల్లు కట్టి మేము నిర్వాసితులకు ఇచ్చామన్నారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నిర్వాసితులపై కాంగ్రెస్ నేతలు కపట ప్రేమ చూపిస్తున్నారని, మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్, 25 వేల రూపాయలు ఖర్చుకు ఇస్తున్నామని సీఎం రేవంత్ గొప్పలు చెబుతున్నారన్నారు హరీష్ రావు. మల్లన్న సాగర్ భూ సేకరణ చేసినప్పుడు పాత ఇంటికి రెండింతలు నష్ట పరిహారం ఇచ్చామని, దీని కోసం 694 కోట్ల రూపాయలు ఇచ్చామన్నారు. ఇంటి యజమాని, భార్యకు 7 లక్షల 50 వేలు ఉపాధి కోసం ఇచ్చామని, ఇంట్లో 18 ఏళ్ళు దాటిన పెళ్లికాని వారికి ఉపాధి కోసం 5 లక్షల రూపాయలు ఇచ్చామన్నారు హరీష్ రావు. అందరికి ఇల్లు కట్టి ఇచ్చాము…పెళ్లి కాని వారికి కూడా 250 గజాల స్థలం ఇచ్చామని, ఖర్చులకు 30 వేల నుంచి 50 వేల రూపాయలు ఇచ్చామన్నారు. గజ్వేల్ నడిబొడ్డున డబుల్ రూమ్ ఇల్లు కట్టి ఇచ్చామని, మూసీ బాధితులకు కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు రేవంత్ ఇచ్చి గొప్పలు చెబుతున్నారన్నారు.
Team India: న్యూజిలాండ్తో జరిగే రెండు, మూడో టెస్టు మ్యాచ్లకు భారత జట్టు ఇదే..
Also Read
- Yogurt Facial for Glowing Skin: ఖర్చు లేకుండా కాంతివంతమైన చర్మం.. పెరుగు ఫేషియల్ రహస్యం
- T20 World Cup: మహిళా ప్రపంచకప్లో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. రికార్డులు బద్దలు..
- India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
అంతేకాకుండా..’నీకు దమ్ముంటే గజ్వేల్ లో కేసీఆర్ ఇండ్లు కట్టిచ్చినట్టు కట్టివ్వాలి. గచ్చిబౌలిలో 50ప్ ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. గచ్చిబౌలిలో మూసి బాధితులకు 250 గజాల ఇల్లు కట్టి ఇవ్వాలి రేవంత్. ముంపు గ్రామాలకు 2 వేల కోట్లు ఇచ్చారు కేసీఆర్.. ఇంకో 200 కోట్ల రూపాయలు బాకీ ఉండొచ్చు.. మేము 90 శాతం చేసినం నువ్వు మిగిలిన 10 శాతం చెయ్యి మరి.. మీరు ఇంకొన్ని కలిపి ముంపు బాధితులకు ఇవ్వండి మేము వద్దన్నమా..? మీరు సహాయం చేస్తే నేనె వచ్చి మీకు సన్మానం చేస్తా.. కాంగ్రెస్ వచ్చి ఏడాది అయ్యింది… మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ నిర్వాసితులకు ఒక్క రూపాయి అయినా ఇచ్చారా..? మోసం, దగా, గోబెల్స్ ప్రచారాలు కాంగ్రెస్ పార్టీవి.. ప్రజలు మమ్మల్ని కాదని మీకు అవకాశం ఇచ్చారు..మీరు బాగా పని చేయండి.. ఆ రోజు మల్లన్నసాగర్ ప్రాజెక్టును అడ్డుకున్నారు.. ఈ రోజు మల్లన్నసాగర్ నిర్వాసితులపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు.. మీ సొల్లు వాగుడు బంద్ చేయండి..’ అని హరీష్ రావు అన్నారు.
Bihar: సన్యాసిగా భారత్లో నివసిస్తున్న బంగ్లాదేశీ.. బీహార్ ఎయిర్పోర్టులో అరెస్ట్..
తాజావార్తలు
-
Yogurt Facial for Glowing Skin: ఖర్చు లేకుండా కాంతివంతమైన చర్మం.. పెరుగు ఫేషియల్ రహస్యం
-
T20 World Cup: మహిళా ప్రపంచకప్లో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. రికార్డులు బద్దలు..
-
India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
-
Anantha Sriram : రివ్యూస్ రాసేవాళ్ళకు ఏం అర్హత ఉంది?
-
India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!