Harish Rao : కండ్లకలక గురించి భయపడాల్సిన అవసరం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో కండ్లకలక కలకలం రేపుతోంది. రోజురోజుకీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. వర్షాలు, వరదలకు తోడు ఈ కండ్లకలకం ప్రజలను ఇబ్బంది పెడుతోంది. రెండు రాష్ట్రాల్లో కలిపి ఇప్పటికి వరకు 2500పైగా కేసులు నమోదయ్యాయి. ఒక్క మంచిర్యాల జిల్లా జైపూర్ హాస్టల్లోనే 400 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. అయితే కండ్లకలకపై మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కొన్ని జాగ్రత్తల ద్వారా కండ్లకలక (పింక్ ఐస్) కేసులను నయం చేయవచ్చని అన్నారు. “భయపడాల్సిన అవసరం లేదు, ఇది కొద్ది రోజుల్లోనే నయం అవుతుంది. ప్రజలు వైద్యులు సూచించిన కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే, వారు సులభంగా వ్యాధి బారిన పడకుండా తప్పించుకోవచ్చు, ”అని ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పింక్ ఐస్ వ్యాప్తిపై చర్చించేందుకు గత వారం అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, ఆరోగ్య అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరిస్థితిని ఎదుర్కొనేందుకు అవసరమైన మందులను సమకూర్చినట్లు ఆయన తెలిపారు.
Also Read : Harish Rao : హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల నాలుగు 1000 పడకల టిమ్స్ ఆస్పతులు
Also Read
ఇంతకీ వ్యాధి ఎలా సోకుతుంటే..
వర్షం పడినప్పుడు భూ ఉపరితలంలో ఉన్న వైరస్, బ్యాక్టీరియా పైకి లేచి గాల్లో కలిసిపోతుంది. అది కంటి దాకా చేరినప్పుడు ఇన్ఫెక్షన్ సోకుతుంది. ఫలితంగా పింక్ ఐ వస్తుంది. దీన్నే కండ్లకలక అంటాం. ఒక్కసారి ఒక్కరికి సోకితే వైరల్గా మారిపోతుంది. క్షణాలు, రోజుల్లో వందలాదిమందికీ వ్యాపిస్తుంది. కండ్లకలకలో కనిపించే ప్రధాన లక్షణాలు.. తెల్లగుడ్డు ఎరుపు/గులాబీ రంగులోకి మారడం, విపరీతమైన కళ్లు నొప్పులు, కళ్ల నుంచి అదేపనిగా పుసులు, చూపు మందగించడం, కాంతిని చూడలేకపోవడం, మంటలు, నీరుకారడం, కనురెప్పల వాపు, ముద్దగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
Also Read : CM KCR : జయశంకర్ సార్ తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్మరణీయులు
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!