IND vs SL: శ్రీలంక పర్యటన.. భారత జట్టుకు ఇద్దరు కెప్టెన్స్!
- జులై 26 నుంచి టీ20 సిరీస్
- టీ20 జట్టు కెప్టెన్ ఎవరు
- రోహిత్ స్థానంలో హార్దిక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hardik Pandya Likely To a India T20 Captain: టీ20 ప్రపంచకప్ 2024 గెలిచి జోష్లో ఉన్న భారత్.. జింబాబ్వేపై 4-1తో టీ20 సిరీస్ను గెలిచింది. ఇక శ్రీలంక పర్యటనకు సిద్దమవుతోంది. లంకతో భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. జులై 26 నుంచి టీ20 సిరీస్.. ఆగస్టు 1 నుంచి వన్డే సిరీస్ ఆరంభం కానున్నాయి. అయితే ఈ టూర్లో భారత టీ20 జట్టుకు కెప్టెన్గా ఎవరు వ్యవహరిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యానే కెప్టెన్ అని చాలా మంది అంటున్నారు.
టీ20 ప్రపంచకప్ 2024 అనంతరం రోహిత్ శర్మ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా తీసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. టీ20 ప్రపంచకప్లో హార్దిక్ భారత జట్టుకు వైస్ కెప్టెన్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అద్భుత ప్రదర్శనతో జట్టును ఛాంపియన్గా నిలిపాడు. గతంలో కూడా టీమిండియాకు అతడు సారథ్యం వహించాడు. కెప్టెన్సీ రేసులో హార్దిక్ ముందున్నప్పటికీ.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్దే తుది నిర్ణయం అని తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లో ఈ విషయంపై క్లారిటీ రానుంది.
Also Read
- Telangana Heatwave: మండిపోతున్న ఎండలు.. వడదెబ్బతో ఆ జిల్లాలో ఒకే రోజు ముగ్గురు మృతి..
- Polavaram Tiger: పోలవరం జిల్లాలో పులి సంచారం కలకలం.. గండి పోశమ్మ మార్గంలో అప్రమత్తం!
- Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. భుజంగరావుకు 14 రోజుల రిమాండ్
- రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
Also Read: Rishabh Pant-IPL 2025: రికీ పాంటింగ్ ఔట్.. నెక్స్ట్ టార్గెట్ రిషబ్ పంత్!
మరోవైపు శ్రీలంక టూర్లోని వన్డే సిరీస్లో రోహిత్ శర్మ ఆడే అవకాశాలు తక్కువ. తీరిక లేని క్రికెట్ ఆడుతున్న రోహిత్.. విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది. దాంతో వన్డేలకు కెప్టెన్గా ఎవరుంటారనేది ఆసక్తికరంగా మారింది. కేఎల్ రాహుల్ రేసులో ఉన్నా.. బీసీసీఐ ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఓ క్రీడా ఛానెల్ నివేదిక ప్రకారం.. శ్రేయాస్ అయ్యర్ కూడా వన్డే జట్టులోకి తిరిగి వచ్చే అవకాశం ఉందని, అతడే సారథిగా ఉంటాడని పేర్కొంది. ఐపీఎల్ 2024లో కోల్కతా నైట్ రైడర్స్ను అయ్యర్ ఛాంపియన్గా నిలిపాడు. ఈ జట్టుకు గౌతమ్ గంభీర్ మెంటార్. దాంతో అయ్యర్ను వన్డే కెప్టెన్గా చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
తాజావార్తలు
-
Janhvi Kapoor: ‘పెద్ది’ అంటే అచ్చియమ్మకు ఇంత ప్రేమా? మెగా సక్సెస్ కోసం ఏడు కొండలు ఎక్కిన జాన్వీ కపూర్! వీడియో వైరల్
-
Lumio Vision 9 (2026): లూమియో నుంచి కొత్త 55-అంగుళాల స్మార్ట్ టీవీలు.. విజన్ 9 (2026), విజన్ 7 (2026) విడుదల
-
Telangana Heatwave: మండిపోతున్న ఎండలు.. వడదెబ్బతో ఆ జిల్లాలో ఒకే రోజు ముగ్గురు మృతి..
-
Air Conditioner: ఏసీని ఈ ఉష్ణోగ్రతలో పెడితే కరెంట్ బిల్లు తగ్గుతుందా? చాలామందికి తెలియని నిజాలు
-
Polavaram Tiger: పోలవరం జిల్లాలో పులి సంచారం కలకలం.. గండి పోశమ్మ మార్గంలో అప్రమత్తం!
ట్రెండింగ్
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!