Shimla Rains: షిమ్లాలో వర్ష బీభత్సం.. గాల్లో రైల్వే ట్రాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిమాచల్ ప్రదేశ్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే భారీ వర్షాల ధాటికి షిమ్లా సమ్మర్ హిల్లో ఒక చోట రైల్వే ట్రాక్ కింద ఉన్న భూభాగం వరదలకు కొట్టుకుపోయింది. దీంతో రైల్వే ట్రాక్ గాల్లో వేలాడుతూ ఉంది. ఇది సాధారణ రైల్వే ట్రాక్ కాదని.. పర్యాటకం కోసం యునెస్కో ఏర్పాటు చేశారని అధికారులు తెలిపారు. ఈ ట్రాక్ పై టాయ్ ట్రైన్ ప్రయాణిస్తుందని చెబుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ పర్యాటకంలో షిమ్లా సమ్మర్ హిల్ ఒక భాగం. ఇక్కడ టాయ్ ట్రైన్ ప్రయాణం చాలా మందికి బాల్య జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. అందుకోసం యునెస్కో ప్రత్యేకంగా నిర్మించారు. ఈ ట్రాక్ కక్ల నుండి షిమ్లా వైపుగా 96 కి.మీ. వరకు ఉంటుంది. ఈ ట్రాక్ పై ప్రయాణం ఐదు గంటల పాటు సాగుతుంది. ఈ ప్రయాణంలో హిమాచల్ ప్రదేశ్లోని అందమైన హిమాలయాల సొగసులు, ఆహ్లాదకరమైన ప్రకృతి అందాలు దర్శనమిస్తాయి.
KTR: మూసీపై కబ్జాలను తొలగించేందుకు ప్రత్యేక చర్యలు
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
హిమాచల్ ప్రదేశ్ లో ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ఈ ట్రాక్ కింద భూభాగం లేకపోవడంతో ట్రాక్ గాలిలో వేలాడుతోంది. ప్రస్తుతానికి ఈ మార్గంలో ప్రయాణించే టాయ్ ట్రైన్ రాకపోకలు నిలిచిపోయాయి. అయితే ఈ ట్రాక్ మరమ్మత్తులకు కనీసం రూ.15 కోట్లు వ్యయం అవుతుందని దాని కోసం సుమారు నెలరోజుల సమయం పడుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. మరోవైపు భారీ వర్షాలకు ఓ దేవాలయం కూడా కూలిపోయింది. ఆ సమయంలో భారీ సంఖ్యలో భక్తులు ఉన్నారు. దీంతో చాలామంది భక్తులు మృతి చెందారు. శిథిలాల్లో 13 మృతదేహాలను అధికారులు గుర్తించారు.
Bus Catches Fire: వీళ్లు నిజంగా అదృష్టవంతులే.. లేకపోతే ప్రాణాలు పోయేవే
హిమాచల్ ప్రదేశ్ లో కురుస్తున్న వానలకు జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై ఎక్కడికక్కడ వరద నీరు నిలిచిపోవడంతో.. నదులను తలపిస్తున్నాయి. మరోవైపు నదులు నీటిప్రవాహానికి పోటెత్తుతూ ఉన్నాయి. కొండ ప్రాంతాల్లో ఘాట్ రోడ్డు పొడవునా కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో కొందరు మృతి చెందగా.. పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఈ భారీ వర్షాల దాటికి అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
https://twitter.com/kalnemibasu/status/1691058690911350784
తాజావార్తలు
-
Petrol, Diesel Prices Hiked: మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. పదిరోజుల్లో మూడోసారి
-
Kohli vs Travis Head: ఉప్పల్ హై-డ్రామా.. మ్యాచ్ మధ్యలో ట్రావిస్ హెడ్ను రెచ్చగొట్టిన కోహ్లీ.. నో షేక్ హ్యాండ్!
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!