Gutta Sukhender Reddy: కేసీఆర్ సర్కార్ ను భ్రష్టు పట్టించేందుకే మోడీ పూనుకున్నారు..
ప్రతిపక్ష పార్టీలను, ప్రభుత్వాలను కూల దొస్తున్న ఘనత ప్రధాని మోడీకే దక్కుతుంది అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు రంగాల్లో 1, 2, 3 స్థానాల్లో ముందుంది అని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రభాగాన నిలబెట్టిన ఘనత సీఎం కేసీఆర్ కి దక్కుతుందన్నారు. ప్రధాని స్థాయి దిగజారి మా ముఖ్యమంత్రిని, ఆయన కుటుంబంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని గుత్తా మండిపడ్డారు. మోడీ తొమ్మిది సంవత్సరాల కాలంలో 12 లక్షల కోట్లకు పైగా ఆయనకు కావాల్సిన కొంత మంది పెద్దలకు సంబంధించిన రుణమాఫీ చేయించాడు అని ఆయన అన్నారు.
Read Also: Dil Raju: దిల్ రాజుకి ‘సలార్’ రెడ్ సిగ్నల్?
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
ఇండియన్ రూపాయి విలువ ఇంత ఘోరంగా ఎప్పుడు పతనం కాలేదు.. అదానీ చేసే కుంభకోణాలకు ప్రధాని హస్తం ఉందని దేశంలో అందరూ అంటున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. దేశంలో ఎన్నడు లేని విధంగా నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయి.. దేశంలో ఏ రాష్ట్రంలోని సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి.. అపవాదులు అసత్య ప్రచారాలు చేసేందుకే ఢిల్లీ నుంచి ఇక్కడికి మోడీ వచ్చాడు అని గుత్తా కామెంట్స్ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించడానికే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పూనుకున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో మతాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగానైనా అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తుందని ఆయన ఆరోపించారు. బీజేపీ కుట్రలను తెలంగాణలో పని చేయవని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు.
Read Also: Viral Video: స్పెయిన్లో వరద బీభత్సం.. కొట్టుకుపోతున్న కార్లు, వాటిపై జనాలు.. వీడియో వైరల్
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో