ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నాలుగు సంవత్సరాల తర్వాత స్వదేశంలో జరుగుతోంది. అయితే.. ఈ నేపథ్యంలో ప్రారంభ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. అయితే.. గుజరాత్ టైటాన్స్ జట్టుకు హార్దిక్ పాండ్యా సారథ్యం వహిస్తుండగా.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్గా ఉన్నారు. అయితే. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్కు దిగిన ధోనీ సేన.. 14 రన్స్ వద్ద తొలి వికెట్ చేజార్చుకుంది. డెవాన్ కాన్వే(1)ను షమీ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత సిక్స్లతో గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు రుతురాజ్ గైక్వాడ్. అతడి జోరు చూస్తుంటే సెంచరీ చేసేలా కనిపించాడు.
Also Read : Off The Record: జోగయ్య జోస్యం ఫలిస్తుందా?

కానీ, అల్జారీ జోసెఫ్ ఓవర్లో శుభ్మన్ గిల్ అద్భుత క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. ఈ యంగ్స్టర్ 50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్స్లతో 92 రన్స్ చేశాడు. మిగతా బ్యాటర్లు ధాటిగా ఆడలేకపోయారు. బెన్ స్టోక్స్ (7), రవీంద్ర జడేజా(1) తక్కువకే ఔటయ్యారు. ఆఖరి ఓవర్లో ధోనీ సిక్స్, ఫోర్ బాదడంతో సీఎస్కే 178 స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ టైటాన్స్.. 25 పరుగులు చేసిన సాహా.. రాజవర్ధన్ హంగర్గేకర్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి ఇంపాక్ట్ ప్లేయర్గా సాయి సుదర్శన్ క్రీజులోకి వచ్చాడు. ఆ తరువాత.. 17 బంతుల్లో 22 పరులుగు చేసిన సాయి సుదర్శన్.. హంగర్గేకర్ బోలింగ్లో ధోనీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 11 బంతుల్లో 8 పరుగులు చేసిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. రవీంద్ర జడేజా బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యి మూడో వికెట్గా వెనుదిరిగాడు. దీంతో 111 పరుగుల వద్ద గుజరాత్ మూడో వికెట్ కోల్పోయింది.