PM Modi Degree Case: మోడీ విద్యార్హతపై పరువు నష్టం కేసు.. తిరస్కరించిన గుజరాత్ హైకోర్టు
Gujarat High Court: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత సంజయ్ సింగ్లకు గుజరాత్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాని మోడీ విద్యార్హతపై ప్రశ్నలు లేవనెత్తిన అరవింద్ కేజ్రీవాల్, సంజయ్ సింగ్లకు కోర్టు నుంచి ఊరట లభించలేదు. క్రిమినల్, పరువు నష్టం కేసులో ఇరువురు నేతలపై జారీ చేసిన సమన్లను రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది.
Read Also: Gangula Kamalakar: బీసీ గణన ఎలా చేస్తారు? క్లారిటీ ఇవ్వండి..
Also Read
- Rava Paratha Recipe: రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టిందా..? 10 నిమిషాల్లో మెత్తటి రవ్వ పరాఠాలు ఇలా తయారు చేయండి
- KING 100 : దాదాపు 20 ఏళ్ల తర్వాత నాగ్ సరసన టబు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి
- Divya Sathyaraj: పెళ్లి లేకుండానే తల్లిని అవుతా.. కట్టప్ప కూతురు సెన్సేషనల్ కామెంట్స్!
- YSRCP Protest: డీజిల్, పెట్రోల్ కొరత.. ఆందోళనలకు వైసీపీ పిలుపు..
ఇక, కేజ్రీవాల్, సంజయ్ సింగ్ దరఖాస్తులను తిరస్కరించిన జస్టిస్ హస్ముఖ్ సుతార్, ట్రయల్ కోర్టు ముందు తమ సమర్పణలు చేయాలని ఇద్దరు ఆప్ నేతలను ఆదేశించింది. కాగా, ప్రధానమంత్రి మోడీ డిగ్రీకి సంబంధించి అవమానకరమైన ప్రకటనలపై గుజరాత్ యూనివర్సిటీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో మెట్రోపాలిటన్ కోర్టు గత ఏడాది ఏప్రిల్ 15 న కేజ్రీవాల్, సంజయ్ సింగ్లకు సమన్లు జారీ చేసింది. ఆ తర్వాత ఇద్దరు నేతలు సమన్లను సవాల్ చేస్తూ సెషన్స్ కోర్టులో రివిజన్ పిటిషన్ వేశారు. అయితే, సెషన్స్ కోర్టు సమన్లను సమర్థించింది.. ఆ తర్వాత వారు మధ్యంతర స్టే కోసం గుజరాత్ హైకోర్టును ఆశ్రయించగా దాన్ని న్యాయస్థానం తిరస్కరించింది.
Read Also: Mahesh -Rajamouli : మహేష్ -రాజమౌళి సినిమా టైటిల్ ఇదేనా?
అయితే, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సంజయ్ సింగ్ లు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించగా.. అక్కడ కూడా వారి అభ్యర్థనలను స్వీకరించడానికి కోర్టు నిరాకరించింది. కాగా, ప్రధాని మోడీ విద్యార్హతకు సంబంధించిన కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ఉత్తర్వులను హైకోర్టు గత ఏడాది మార్చిలో పక్కన పెట్టిన తర్వాత జీయూ రిజిస్ట్రార్ పీయూష్ పటేల్ కేజ్రీవాల్, సంజయ్ సింగ్లపై పరువు నష్టం కేసు దాఖలు చేసింది. కేజ్రీవాల్కు రూ. 25,000 వేల జరిమానా విధించడంతో పాటు ఆ ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి కూడా ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. మోడీ డిగ్రీపై గుజరాత్ యూనివర్సిటీని లక్ష్యంగా చేసుకుని కేజ్రీవాల్, సంజయ్ సింగ్ మీడియా సమావేశాలు, సోషల్ మీడియాలో పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేశారని జీయూ తన ఫిర్యాదులో పేర్కొనింది.
తాజావార్తలు
-
Rava Paratha Recipe: రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టిందా..? 10 నిమిషాల్లో మెత్తటి రవ్వ పరాఠాలు ఇలా తయారు చేయండి
-
KING 100 : దాదాపు 20 ఏళ్ల తర్వాత నాగ్ సరసన టబు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి
-
Divya Sathyaraj: పెళ్లి లేకుండానే తల్లిని అవుతా.. కట్టప్ప కూతురు సెన్సేషనల్ కామెంట్స్!
-
YSRCP Protest: డీజిల్, పెట్రోల్ కొరత.. ఆందోళనలకు వైసీపీ పిలుపు..
-
Nandamuri Balakrishna : బాలయ్య నీ స్పీడ్ ఏంటయ్యా.. ఒకేసారి రెండు సినిమాలు
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!