Gujarat: సమసిన వివాదం.. ఒకే స్టేజీపై రాహుల్ గాంధీ, హార్థిక్ పటేల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరుస పరాజయాలతో ఢీలా పడ్డ కాంగ్రెస్ పార్టీకి విజయం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరం. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చాలా దారుణ పరాజయాలను మూటకట్టుకుంది. చివరకు తాము అధికారంలో ఉన్న పంజాబ్ రాష్ట్రాన్ని కూడా అంతర్గత కలహాలతో ఆమ్ ఆద్మీ పార్టీకి అప్పచెప్పింది. ఇక ఉత్తర్ ప్రదేశ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ పెర్ఫామెన్స్ గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. అంత ఘోరంగా పార్టీ అపజయాలను మూటకట్టుకుంది.
కాగా… ఈ ఏడాది చివర్లో గుజరాత్ ఎన్నికలు ఉండబోతున్నాయి. కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఇప్పటికే గుజరాత్ లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మంగళవారం గుజరాత్ లో పర్యటించారు రాహుల్ గాంధీ. అయితే అన్ని రాష్ట్రాల్లో మాదిరిగానే గుజరాత్ కాంగ్రెస్ లో కూడా లుకలుకలు కనిపిస్తున్నాయి. పాటిదార్ ఉద్యమ నాయకుడిగా హార్ధిక్ పటేల్ కు పేరుంది. 2019లో కాంగ్రెస్ పార్టీలో చేరిన హార్ధిక్ పటేల్ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నారనే వార్తలు వచ్చాయి. అయితే వీటన్నింటికి ఫుల్ స్టాప్ పెడుతూ రాహుల్ గాంధీ కార్యక్రమంలో హార్థిక్ పటేల్ పాల్గొన్నారు. ఒకే వేదికను పంచుకున్నారు.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
ఇటీవల తన ట్విట్టర్ బయో నుంచి హార్ధిక్ పటేల్ కాంగ్రెస్ జెండా, పేరును తొలగించడంతో ఒక్కసారిగా హార్ధిక్ పటేల్ పార్టీ మారుతున్నారనే వార్తలు వచ్చాయి. బీజేపీలో చేరుతారని చర్చ జరిగింది. గతంలో కొన్ని సందర్భాల్లో బీజేపీ పార్టీని హార్ధిక్ పటేల్ పొగడటం కూడా ఈ అనుమానాలకు తావిచ్చాయి. మరో వైపు ఢిల్లీలో పాటు ఇటీవల పంజాబ్ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన ఆప్ గుజరాత్ లో పాగా వేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో హార్ధిక్ పటేల్ ఆప్ లో చేరుతారంటూ వాదనలు వినిపించాయి.
ఇన్ని అనుమానాల మధ్య ఓ క్లారిటీ అయితే వచ్చింది. ప్రస్తుతం హార్ధిక్ పటేల్ కాంగ్రెస్లోనే కొనసాగుతున్నారనేది స్పష్టం అయింది. అయితే పలు సందర్భాల్లో… రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతో తనకు ఎలాంటి సమస్యలు లేవని… కానీ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం తీరుతోనే విసిగిపోతున్నా అంటూ హార్ధిక్ పటేల్ విమర్శించారు. ఎన్నికలు మరికొన్ని నెలలు మాత్రమే ఉన్నాయని ఈసందర్భంలో సమర్థవంతమైన నాయకత్వాన్ని పనిచేసేలా చూడాలని కోరుతున్నారు. 1998 నుంచి వరసగా గుజరాత్ లో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. ఈ సారి హార్ధిక్ పటేల్, జిగ్నేష్ మేవాని వంటి వారు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త సుమీ!
-
FIFA World Cup 2026: హోరాహోరీ పోరులో.. ఫ్రాన్స్పై 6-4తో ఇంగ్లండ్ ఘన విజయం.. కాంస్య పతకం కైవసం
-
Ramayana: ఇలాంటి పాత్ర చేయడం పూర్వ జన్మ సుకృతం… ‘రామాయణం’ వేదికపై సాయి పల్లవి ఎమోషనల్
-
Two US Soldiers Killed: ఇరాన్ దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మృతి.. “మరచిపోలేని గుణపాఠం చెబుతాం” అంటూ ఖమేనీ హెచ్చరిక
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!