Gudivada Amarnath: మంత్రి లోకేష్ రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు
- వందకు వంద శాతం టీడీపీ సభ్యత్వం నమోదు అనేది పచ్చి అబద్ధం..
- మంత్రి నారా లోకేష్ రాజకీయ లబ్ధి కోసం ఇలా చేస్తున్నాడు.
- మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gudivada Amarnath: ముచ్చెర్ల గ్రామంలో వందకు వంద శాతం టీడీపీ సభ్యత్వం నమోదు అనేది పచ్చి అబద్ధమని వైఎస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. టీడీపీ నేత, మంత్రి నారా లోకేష్ గ్రామంలో తమ పార్టీకి పూర్తి మద్దతు ఉందని ప్రచారం చేయడం రాజకీయ లబ్ధి కోసం అని ఆయన ఆరోపించారు. ముచ్చెర్ల గ్రామంలో వైఎస్ఆర్సీపీ బలంగా ఉందని, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయాలు సాధించిందని వారు పేర్కొన్నారు. అలాగే, గత ఎన్నికల్లో టీడీపీకి 1350 ఓట్లు రాగా, వైఎస్ఆర్సీపీకి 150 ఓట్ల తేడా మాత్రమే ఉందని ఆయన గుర్తు చేశారు.
Also Read: Britain PM vs Elon Musk: బ్రిటన్ ప్రధానిపై ఎలాన్ మస్క్ తీవ్ర ఆరోపణలు.. కీర్ స్టార్మర్ కౌంటర్..
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
సభ్యత్వం నమోదు కోసం టీడీపీ నేతలు ప్రజల ఆధార్ కార్డులను తీసుకుని వారిని మోసం చేస్తున్నారని, పక్క రాష్ట్రాల వారికి కూడా టీడీపీ సభ్యత్వం కల్పించారని గుడివాడ అమర్నాథ్ ఆరోపిస్తున్నారు. కొన్ని చోట్ల ప్రజలను బెదిరించి సభ్యత్వం నమోదు చేస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన విమర్శించారు. ముచ్చెర్ల గ్రామంలో 600 ఎకరాల భూమిని టీడీపీ నాయకులు ఆక్రమించేందుకు సభ్యత్వంపై తప్పుడు లెక్కలు చెబుతున్నారని, ఈ వ్యవహారానికి సంబంధించి టీడీపీ నాయకులపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేసారు.
Also Read: Kakani Govardhan Reddy: అధికారంలోకి వచ్చిన తర్వాత లెక్కలు సరిచేస్తామంటున్న మాజీ మంత్రి
ఏపీ రాష్ట్ర హోం మంత్రి అనితపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. టీటీడీ లేఖను అమ్మే స్థాయికి చేరుకున్న అనిత పేషీ, సనాతన ధర్మంపై మాట్లాడే అర్హత లేదని ఆయన అన్నారు. టీటీడీ లడ్డు వివాదంపై పెద్ద ఎత్తున మాట్లాడిన నేతలు ఇప్పుడు సమాధానం చెప్పాల్సి ఉందని గుడివాడ అమర్నాథ్ అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజల్లో విశ్వాసం పెంచాయని, భీమిలి నియోజకవర్గంలో పార్టీకి బలమైన క్యాడర్ ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!