GT vs PBKS: నేడు అహ్మదాబాద్ లో పరుగుల వరద పారేనా..?!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు ఐపీఎల్ 2024 17వ మ్యాచ్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది. ఐపీఎల్ 2024 ప్రస్తుత సెషన్లో ఇరు జట్లకు ఇది నాల్గవ మ్యాచ్. మ్యాచ్ నేడు సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభం కానుంది. గుజరాత్ టైటాన్స్ మూడు మ్యాచ్ లలో 4 పాయింట్లతో -0.738 రన్ రేట్ తో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. మరోవైపు, పంజాబ్ కింగ్స్ నాలుగు మ్యాచ్ లలో రెండు పాయింట్లతో -0.337 రన్ రేట్ తో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది.
Also read: Operation Garuda: డ్రోన్ లతో పెట్రోలింగ్ ప్రారంభించిన పోలీస్ బాసులు.. “ఆపరేషన్ గరుడ..” అంటూ..!
Also Read
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు ఇప్పటి వరకు మొత్తం 3 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడాయి. ఇందులో పంజాబ్ పై రెండు మ్యాచ్ లు గుజరాత్ గెలవగా., పంజాబ్ 1 మ్యాచ్ ను కైవసం చేసుకోవడంతో పంజాబ్పై గుజరాత్ పైచేయి సాధించింది. ఇప్పటివరకు పంజాబ్ కింగ్స్ పై గుజరాత్ టైటాన్స్ అత్యధిక స్కోరు 190 కాగా, గుజరాత్ టైటాన్స్ పై పంజాబ్ అత్యధిక స్కోరు 189. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం. GT మార్చి 24న తమ మొదటి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై 6 పరుగుల తేడాతో గెలిచింది. మార్చి 26న చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 63 పరుగుల తేడాతో ఓడిపోయింది, ఆపై మూడో మ్యాచ్ లో సన్రైజర్స్ హైదరాబాద్ పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక పంజాబ్.. మార్చి 23న ఢిల్లీ క్యాపిటల్స్ ని 4 వికెట్ల తేడాతో ఓడించింది. ఇక రెండో మ్యాచ్ లో మార్చి 25న బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మూడో మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ తో 21 పరుగుల తేడాతో ఓడిపోయింది.
Also read: Sreeleela : రెడ్ డ్రెస్సులో హాట్ లుక్ లో శ్రీలీలా స్టన్నింగ్ పోజులు..
ఇక ఇరుజట్ల ఆటగాళ్ల వివరాలు చూస్తే.. గుజరాత్ టైటాన్స్ జట్టులో డేవిడ్ మిల్లర్, శుభ్మన్ గిల్, మాథ్యూ వేడ్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, అభినవ్ మనోహర్, బి సాయి సుదర్శన్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, రాహుల్ తెవాటియా, సందీప్ వారియర్, నూర్ అహ్మద్, ఆర్ సాయి ఖాన్షోర్, ., జోష్ లిటిల్, మోహిత్ శర్మ, అజ్మతుల్లా ఒమర్జాయ్, ఉమేష్ యాదవ్, షారుఖ్ ఖాన్, సుశాంత్ మిశ్రా, కార్తీక్ త్యాగి, మానవ్ సుతార్, స్పెన్సర్ జాన్సన్, రాబిన్ మింజ్ లు ఉన్నారు.
ఐకమరోవైపు పంజాబ్ కింగ్స్ జట్టులో శిఖర్ ధావన్, జితేష్ శర్మ, జానీ బెయిర్స్టో, ప్రభ్సిమ్రాన్ సింగ్, లియామ్ లివింగ్స్టోన్, మాథ్యూ షార్ట్, హర్ప్రీత్ భాటియా, అథర్వ తైడే, రిషి ధావన్, సామ్ కర్రాన్, సికందర్ రజా, శివమ్ సింగ్, హర్ప్రీత్ బ్రార్, అర్ష్దీప్ సింగ్, కాగితన్ ఎల్లిస్, రాహుల్ చాహర్, గుర్నూర్ బ్రార్, విద్వాత్ కావరప్ప, హర్షల్ పటేల్, క్రిస్ వోక్స్, అశుతోష్ శర్మ, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, శశాంక్ సింగ్, తనయ్ త్యాగరాజన్, ప్రిన్స్ చౌదరి, రిలీ రోసౌవ్లు ఉన్నారు.
తాజావార్తలు
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
-
Nithya Menen: మెగాఫోన్ పట్టనున్న నిత్యా మీనన్?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!