Rape : నెలల పాపపై అత్యాచారం.. కఠినంగా శిక్షించాలని డిమాండ్
విజయనగరం జిల్లాలో నెలల పాపపై తాతయ్య అత్యాచారం కలకలం రేపింది. ఘోర ఘటనపై ప్రతి స్పందిస్తూ ఆ కామాధుడుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. అత్యాచారానికి పాల్పడిన కామాంధుడుని అరెస్టు చేశారు పోలీసులు. విజయనగరం జిల్లా రామభద్రపురం జీలికి వలస గ్రామంలో ఏడు నెలల పసికందు పై కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బిడ్డకు రక్తస్రావం కావడంతో ఆసుపత్రి కి బాడంగి సిహెచ్సీకి తీసుకు వచ్చారు తల్లిదండ్రులు. ప్రాధమిక చికిత్స అందించి వైద్యులు విజయనగరంలోని ఘోషాసుపత్రికి తరలించారు. పైడిరాజులకు జనవరి నెలలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పసికందుకు 7 నెలలు. గ్రామానికి నిత్యవసర అమ్మడానికి వ్యాపారులు రావడం జరిగింది. పైడ్రాజు నిత్యవసర సరుకులు కొనడానికి వెళ్లింది. అదే సమయంలో ఇంటి పక్కన ఉన్న నేరెళ్ల వలస గ్రామానికి చెందిన ఎరకయ్య చుట్టరకానికి వచ్చాడు. నిద్రిస్తున్న పసికందు పై అత్యాచారం చేస్తుండగా పసికందు అక్క చూసి తల్లి పైడ్రాజుకు సమాచారం ఇచ్చింది. హుటాహుటిగా ఉయ్యాల దగ్గరికి తల్లి వచ్చి చూసేసరికి రక్తస్రావం కావడంతో పసికందును తీసుకొని రామభద్రపురం ఆసుపత్రి వచ్చారు తల్లిదండ్రులు. ప్రాధమిక చికిత్స చేసిన తరువాత విజయనగతంలోని ఘోషాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రి లో చికిత్స పొందుతోంది.
విషయం తెలుసుకున్న మంత్రి కొండపల్లి శ్రీనువాస్ తో పాటు విజయనగరం ఎమ్మెల్యే అధితి గజపతి ఆసుపత్రికి వచ్చి పరామర్శించారు. ఘటన అమానుషమని.. ప్రశాంతమైన విజయనగరం జిల్లాలో ఇలాంటి ఘటనలు హేయమన్నారు మంత్రి కొండపల్లి. నిందితున్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది, అతనికి కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు. పాప కండిషన్ నిలకడగా ఉందని.. డాక్టర్ ల పర్యవేక్షణలో పాప కి వైద్యం అందుతుందన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రతి తల్లి కూడా బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వ పరంగా ఇలాంటి ఘటనల పై జరగకుండా నిర్ణయాలు ఉంటాయి.
Also Read
- Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
- Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
- GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
- Riyan parag: బీసీసీఐ జరిమానా విధించిన మరుసటి రోజే.. విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్..
వాయిస్: జిలిక వలస ఆరు నెలల పసికందు అత్యాచారంపై స్పందించిన మహిళా శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సాధ్యారాణి స్పందించారు.ఇది దారుణమని.. సభ్య సమాజం తలదించుకునే రోజని అన్నారు. మానవ మృగం చేసిన పని అత్యంత హేయమైన ఆటవిక చర్యని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
ఇలాంటి వారికి ఉరిశిక్ష సరైనదని భావిస్తున్నానని అన్నారు. ఇలాంటి పనులు చేసిన వారికి నడి రోడ్డుపై ఉరితియ్యాలి. ఇలాంటి వారికి బెయిల్ రాకుండా కఠినమైన శిక్షలు పడాలన్నారు. ఇదిలా ఉండాగా, అత్యాచారానికి పాల్పడ్డ ఎరకయ్యను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. నేరాన్ని అంగీకరించడం తో ఎరకయ్యను అరెస్టు చేసారు.
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!