Anurag Thakur: “గాజా గురించి మాట్లాడే రాహుల్ గాంధీ బంగ్లా హిందువులపై మౌనం ఎందుకు.?”
- గాజాపై మాట్లాడి..బంగ్లా హిందువులపై మౌనం ఎందుకు..?
- కాంగ్రెస్-రాహుల్ గాంధీని ప్రశ్నించిన బీజేపీ ఎంపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anurag Thakur: బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. పాలస్తీనా, గాజా పట్ల ఆందోళన చెందే కాంగ్రెస్ పార్టీ, బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలపై ఎందుకు మౌనంగా ఉంటుందని ప్రశ్నించారు. శుక్రవారం లోక్సభలో మట్లాడుతూ..బంగ్లాదేశ్లోని హిందువులు మరియు మతపరమైన మైనారిటీల శాంతి, భద్రత మరియు అభివృద్ధికి హామీ ఇవ్వాల్సిన అవసరాన్ని ప్రధాని నరేంద్ర మోడీ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతికి గుర్తు చేశారని అన్నారు.
Read Also: Scrub Typhus: “స్క్రబ్ టైఫస్” కారణంగా హిమాచల్లో మొదటి మరణం..
Also Read
- Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
- ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
మన పొరుగు దేశం బంగ్లాదేశ్లో ఇటీవల సంఘటనల గురించి మనమంతా ఆందోళన చెందుతున్నామని, ప్రధాని మంత్రి మోడీ ఆ దేశంలో హిందువుల భద్రతకు హామీ ఇవ్వాలని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేతకు నొక్కి చెప్పారని అన్నారు. అయితే బంగ్లాదేశ్లోని మైనారిటీలు, బంగ్లాదేశ్లోని హిందువుల భద్రత గురించి ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రస్తావించకపోవడం దురదృష్టకరమని అనురాగ్ ఠాకూర్ అన్నారు. గాజా గురించి పెద్ద పెద్ద వ్యాఖ్యలు చేసే కాంగ్రెస్ పార్టీ పొరుగుదేశంలో హిందువుల పరిస్థితిపై ఎందుకు సైలెంట్గా ఉంటుందని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ మౌనంగా ఉండటానికి కారణం ఏమిటి..? అని అడిగారు.
గురువారం బంగ్లాదేశ్ ప్రభుత్వాధినేతగా ప్రమాణస్వీకారం చేసిన ముహమ్మద్ యూనస్కి ప్రధాని నరేంద్రమోడీ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘హిందువులు మరియు అన్ని ఇతర మైనారిటీ వర్గాల భద్రత మరియు రక్షణకు భరోసానిస్తూ, సాధారణ స్థితికి త్వరగా తిరిగి రావాలని మేము ఆశిస్తున్నాము. దేశాల ప్రజల ఆకాంక్షలు, శాంతి, భద్రత, అభివృద్ధి కోసం బంగ్లాదేశ్తో కలిసి పనిచేయడానికి భారతదేశం కట్టుబడి ఉంది’’ అని ఆయన ఎక్స్లో ట్వీట్ చేశారు.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!