Aaditya Thackeray: మరో 2 నెలల్లో ద్రోహుల ప్రభుత్వం కూలిపోతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aaditya Thackeray: ఒకప్పుడు దూకుడుగా ఉండే మట్టిపుత్రులు గల తమ పార్టీలో సమూలమైన మార్పు వచ్చిందని శివసేన(ఉద్ధవ్ బాల్థాక్రే) నాయకుడు ఆదిత్య థాక్రే అన్నారు. థానేలో తన తండ్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గం నిర్వహించిన జాబ్ మేళాలో మహారాష్ట్ర మాజీ మంత్రి మాట్లాడారు. నేల పుత్రుల హక్కుల కోసం ఉద్యమాలు చేసే శివసేనలో సమూల మార్పు వచ్చింది.. ఇప్పుడు నేలపుత్రుల సమస్యలు, ముఖ్యంగా యువత సమస్యల పరిష్కారానికి జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని వర్లీలో ఎమ్మెల్యే ఆదిత్య థాక్రే అన్నారు.
యువకులు పార్టీలో భాగమవుతున్నందున బలమైన శివసేన తయారవుతోందని ఆదిత్య థాక్రే పేర్కొన్నారు. బీజేపీ, ఏక్నాథ్ షిండేల నేతృత్వంలోని బాలాసాహెబ్ శివసేన సంకీర్ణ ప్రభుత్వం ప్రజలను విభజించడం తప్ప మహారాష్ట్రకు చేసిందేమీ లేదని ఆదిత్య థాకరే విమర్శించారు. ఈ ద్రోహుల ప్రభుత్వం మరో రెండు నెలల్లో కూలిపోతుందని ఆయన పేర్కొన్నారు. 2022 జూన్లో ఏక్నాథ్ షిండే తిరుగుబాటు.. ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం పతనానికి దారితీసింది. తర్వాత ఏక్నాథ్ షిండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీతో జతకట్టారు. 55 మంది శివసేన ఎమ్మెల్యేలలో 40 మంది షిండే శిబిరంలో ఉండగా.. పార్టీకి చెందిన 18 మంది ఎంపీలలో 12 మంది ఉద్ధవ్ ఠాక్రే వర్గాన్ని విడిచిపెట్టారు. ఈ నేపథ్యంలో తమను విడిచిపెట్టిన వారు ద్రోహులని.. తమతో మిగిలిపోయిన వారు నిజమైన శివసైనికులు అని ఆదిత్య థాక్రే అన్నారు.
Also Read
- IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
- కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
Nitin Gadkari: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయానికి బెదిరింపు కాల్స్
నిరుద్యోగం, పరిశ్రమలు రాష్ట్రం నుంచి బయటకు వెళ్లడంపై దృష్టి సారించే బదులు.. మహారాష్ట్రలో పౌరసంఘాల ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం సాహసం చేసి రాజకీయంగా తేల్చే పనిలో నిమగ్నమై ఉందన్నారు. వేదాంత-ఫాక్స్కాన్, టాటా-ఎయిర్బస్ అనే రెండు మెగా పారిశ్రామిక ప్రాజెక్టులను మహారాష్ట్ర కోల్పోయిందని ప్రతిపక్షం షిండే ప్రభుత్వాన్ని నిందించింది. రెండు శాసనసభ సమావేశాలు ముగిసినా షిండే కేబినెట్లో ఒక్క మహిళను కూడా చేర్చుకోలేదని ఆదిత్య ఠాక్రే అన్నారు. 2024లో జరిగే లోక్సభ ఎన్నికల్లో శివసేన(ఉద్ధవ్ బాల్థాక్రే)కు చెందిన స్థానిక ఎంపీ రాజన్ విచారే మళ్లీ గెలుస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Ramayana: ‘రామాయణం’ ట్రైలర్లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదు?.. క్లారిటీ ఇచ్చిన రణబీర్ కపూర్!
-
IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
-
Dhsnudh-Sivakarthikeyan : ధనుష్, శివకార్తికేయన్ సీక్వెల్స్ సినిమాలపై కోలీవుడ్లో భారీ హైప్
ట్రెండింగ్
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!