Aaditya Thackeray: మరో 2 నెలల్లో ద్రోహుల ప్రభుత్వం కూలిపోతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aaditya Thackeray: ఒకప్పుడు దూకుడుగా ఉండే మట్టిపుత్రులు గల తమ పార్టీలో సమూలమైన మార్పు వచ్చిందని శివసేన(ఉద్ధవ్ బాల్థాక్రే) నాయకుడు ఆదిత్య థాక్రే అన్నారు. థానేలో తన తండ్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గం నిర్వహించిన జాబ్ మేళాలో మహారాష్ట్ర మాజీ మంత్రి మాట్లాడారు. నేల పుత్రుల హక్కుల కోసం ఉద్యమాలు చేసే శివసేనలో సమూల మార్పు వచ్చింది.. ఇప్పుడు నేలపుత్రుల సమస్యలు, ముఖ్యంగా యువత సమస్యల పరిష్కారానికి జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని వర్లీలో ఎమ్మెల్యే ఆదిత్య థాక్రే అన్నారు.
యువకులు పార్టీలో భాగమవుతున్నందున బలమైన శివసేన తయారవుతోందని ఆదిత్య థాక్రే పేర్కొన్నారు. బీజేపీ, ఏక్నాథ్ షిండేల నేతృత్వంలోని బాలాసాహెబ్ శివసేన సంకీర్ణ ప్రభుత్వం ప్రజలను విభజించడం తప్ప మహారాష్ట్రకు చేసిందేమీ లేదని ఆదిత్య థాకరే విమర్శించారు. ఈ ద్రోహుల ప్రభుత్వం మరో రెండు నెలల్లో కూలిపోతుందని ఆయన పేర్కొన్నారు. 2022 జూన్లో ఏక్నాథ్ షిండే తిరుగుబాటు.. ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం పతనానికి దారితీసింది. తర్వాత ఏక్నాథ్ షిండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీతో జతకట్టారు. 55 మంది శివసేన ఎమ్మెల్యేలలో 40 మంది షిండే శిబిరంలో ఉండగా.. పార్టీకి చెందిన 18 మంది ఎంపీలలో 12 మంది ఉద్ధవ్ ఠాక్రే వర్గాన్ని విడిచిపెట్టారు. ఈ నేపథ్యంలో తమను విడిచిపెట్టిన వారు ద్రోహులని.. తమతో మిగిలిపోయిన వారు నిజమైన శివసైనికులు అని ఆదిత్య థాక్రే అన్నారు.
Also Read
- Joe Root Record: ఒక్క పరుగుతో చేజారిన హిస్టరీ.. విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును మిస్సయిన జో రూట్..
- 16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
- YS Jagan: వైఎస్ జగన్కు హైదరాబాద్లో ఘన స్వాగతం.. బేగంపేటను ముంచెత్తిన ఫ్లెక్సీల హంగామా..
- SRH Player: 51 బంతుల్లో 111 పరుగులు.. ఓ రేంజ్లో రెచ్చిపోయిన సన్ రైజర్స్ మాజీ ఆటగాడు..
Nitin Gadkari: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయానికి బెదిరింపు కాల్స్
నిరుద్యోగం, పరిశ్రమలు రాష్ట్రం నుంచి బయటకు వెళ్లడంపై దృష్టి సారించే బదులు.. మహారాష్ట్రలో పౌరసంఘాల ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం సాహసం చేసి రాజకీయంగా తేల్చే పనిలో నిమగ్నమై ఉందన్నారు. వేదాంత-ఫాక్స్కాన్, టాటా-ఎయిర్బస్ అనే రెండు మెగా పారిశ్రామిక ప్రాజెక్టులను మహారాష్ట్ర కోల్పోయిందని ప్రతిపక్షం షిండే ప్రభుత్వాన్ని నిందించింది. రెండు శాసనసభ సమావేశాలు ముగిసినా షిండే కేబినెట్లో ఒక్క మహిళను కూడా చేర్చుకోలేదని ఆదిత్య ఠాక్రే అన్నారు. 2024లో జరిగే లోక్సభ ఎన్నికల్లో శివసేన(ఉద్ధవ్ బాల్థాక్రే)కు చెందిన స్థానిక ఎంపీ రాజన్ విచారే మళ్లీ గెలుస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Mahakali Release Date: ‘మహాకాళి’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతి బరిలోకి ప్రశాంత్ వర్మ ఫీమేల్ సూపర్ హీరో మూవీ!
-
Joe Root Record: ఒక్క పరుగుతో చేజారిన హిస్టరీ.. విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును మిస్సయిన జో రూట్..
-
Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్లో కొత్త ట్రెండ్
-
Jaipur Tension Over School Row: జైపూర్లో ఉద్రిక్తత.. కాక్రోచ్ పార్టీ కార్యకర్తలపై గ్రామస్థుల దాడి
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
ట్రెండింగ్
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!