Aaditya Thackeray: మరో 2 నెలల్లో ద్రోహుల ప్రభుత్వం కూలిపోతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aaditya Thackeray: ఒకప్పుడు దూకుడుగా ఉండే మట్టిపుత్రులు గల తమ పార్టీలో సమూలమైన మార్పు వచ్చిందని శివసేన(ఉద్ధవ్ బాల్థాక్రే) నాయకుడు ఆదిత్య థాక్రే అన్నారు. థానేలో తన తండ్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గం నిర్వహించిన జాబ్ మేళాలో మహారాష్ట్ర మాజీ మంత్రి మాట్లాడారు. నేల పుత్రుల హక్కుల కోసం ఉద్యమాలు చేసే శివసేనలో సమూల మార్పు వచ్చింది.. ఇప్పుడు నేలపుత్రుల సమస్యలు, ముఖ్యంగా యువత సమస్యల పరిష్కారానికి జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని వర్లీలో ఎమ్మెల్యే ఆదిత్య థాక్రే అన్నారు.
యువకులు పార్టీలో భాగమవుతున్నందున బలమైన శివసేన తయారవుతోందని ఆదిత్య థాక్రే పేర్కొన్నారు. బీజేపీ, ఏక్నాథ్ షిండేల నేతృత్వంలోని బాలాసాహెబ్ శివసేన సంకీర్ణ ప్రభుత్వం ప్రజలను విభజించడం తప్ప మహారాష్ట్రకు చేసిందేమీ లేదని ఆదిత్య థాకరే విమర్శించారు. ఈ ద్రోహుల ప్రభుత్వం మరో రెండు నెలల్లో కూలిపోతుందని ఆయన పేర్కొన్నారు. 2022 జూన్లో ఏక్నాథ్ షిండే తిరుగుబాటు.. ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం పతనానికి దారితీసింది. తర్వాత ఏక్నాథ్ షిండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీతో జతకట్టారు. 55 మంది శివసేన ఎమ్మెల్యేలలో 40 మంది షిండే శిబిరంలో ఉండగా.. పార్టీకి చెందిన 18 మంది ఎంపీలలో 12 మంది ఉద్ధవ్ ఠాక్రే వర్గాన్ని విడిచిపెట్టారు. ఈ నేపథ్యంలో తమను విడిచిపెట్టిన వారు ద్రోహులని.. తమతో మిగిలిపోయిన వారు నిజమైన శివసైనికులు అని ఆదిత్య థాక్రే అన్నారు.
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
Nitin Gadkari: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయానికి బెదిరింపు కాల్స్
నిరుద్యోగం, పరిశ్రమలు రాష్ట్రం నుంచి బయటకు వెళ్లడంపై దృష్టి సారించే బదులు.. మహారాష్ట్రలో పౌరసంఘాల ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం సాహసం చేసి రాజకీయంగా తేల్చే పనిలో నిమగ్నమై ఉందన్నారు. వేదాంత-ఫాక్స్కాన్, టాటా-ఎయిర్బస్ అనే రెండు మెగా పారిశ్రామిక ప్రాజెక్టులను మహారాష్ట్ర కోల్పోయిందని ప్రతిపక్షం షిండే ప్రభుత్వాన్ని నిందించింది. రెండు శాసనసభ సమావేశాలు ముగిసినా షిండే కేబినెట్లో ఒక్క మహిళను కూడా చేర్చుకోలేదని ఆదిత్య ఠాక్రే అన్నారు. 2024లో జరిగే లోక్సభ ఎన్నికల్లో శివసేన(ఉద్ధవ్ బాల్థాక్రే)కు చెందిన స్థానిక ఎంపీ రాజన్ విచారే మళ్లీ గెలుస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!