Aaditya Thackeray: మరో 2 నెలల్లో ద్రోహుల ప్రభుత్వం కూలిపోతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aaditya Thackeray: ఒకప్పుడు దూకుడుగా ఉండే మట్టిపుత్రులు గల తమ పార్టీలో సమూలమైన మార్పు వచ్చిందని శివసేన(ఉద్ధవ్ బాల్థాక్రే) నాయకుడు ఆదిత్య థాక్రే అన్నారు. థానేలో తన తండ్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గం నిర్వహించిన జాబ్ మేళాలో మహారాష్ట్ర మాజీ మంత్రి మాట్లాడారు. నేల పుత్రుల హక్కుల కోసం ఉద్యమాలు చేసే శివసేనలో సమూల మార్పు వచ్చింది.. ఇప్పుడు నేలపుత్రుల సమస్యలు, ముఖ్యంగా యువత సమస్యల పరిష్కారానికి జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని వర్లీలో ఎమ్మెల్యే ఆదిత్య థాక్రే అన్నారు.
యువకులు పార్టీలో భాగమవుతున్నందున బలమైన శివసేన తయారవుతోందని ఆదిత్య థాక్రే పేర్కొన్నారు. బీజేపీ, ఏక్నాథ్ షిండేల నేతృత్వంలోని బాలాసాహెబ్ శివసేన సంకీర్ణ ప్రభుత్వం ప్రజలను విభజించడం తప్ప మహారాష్ట్రకు చేసిందేమీ లేదని ఆదిత్య థాకరే విమర్శించారు. ఈ ద్రోహుల ప్రభుత్వం మరో రెండు నెలల్లో కూలిపోతుందని ఆయన పేర్కొన్నారు. 2022 జూన్లో ఏక్నాథ్ షిండే తిరుగుబాటు.. ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం పతనానికి దారితీసింది. తర్వాత ఏక్నాథ్ షిండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీతో జతకట్టారు. 55 మంది శివసేన ఎమ్మెల్యేలలో 40 మంది షిండే శిబిరంలో ఉండగా.. పార్టీకి చెందిన 18 మంది ఎంపీలలో 12 మంది ఉద్ధవ్ ఠాక్రే వర్గాన్ని విడిచిపెట్టారు. ఈ నేపథ్యంలో తమను విడిచిపెట్టిన వారు ద్రోహులని.. తమతో మిగిలిపోయిన వారు నిజమైన శివసైనికులు అని ఆదిత్య థాక్రే అన్నారు.
Also Read
- Story Board : అయోధ్య ఆలయంలో అసలేం జరిగింది..? రాముడి సాక్షిగా నిధులు దారిమళ్లాయా..?
- IPL Player: బిగ్షాక్.. మహిళతో శారీరక సంబంధం.. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్పై పోలీస్ కేసు..
- Modi-Mammoott: మోడీని కలిసిన మమ్ముట్టి ఫ్యామిలీ.. ఫొటోలు వైరల్
- Hardik And Yashasvi: KKR కెప్టెన్గా హార్దిక్ పాండ్యా..? ముంబయ్ ఇండియన్స్లోకి యశస్వి జైస్వాల్..?
Nitin Gadkari: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయానికి బెదిరింపు కాల్స్
నిరుద్యోగం, పరిశ్రమలు రాష్ట్రం నుంచి బయటకు వెళ్లడంపై దృష్టి సారించే బదులు.. మహారాష్ట్రలో పౌరసంఘాల ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం సాహసం చేసి రాజకీయంగా తేల్చే పనిలో నిమగ్నమై ఉందన్నారు. వేదాంత-ఫాక్స్కాన్, టాటా-ఎయిర్బస్ అనే రెండు మెగా పారిశ్రామిక ప్రాజెక్టులను మహారాష్ట్ర కోల్పోయిందని ప్రతిపక్షం షిండే ప్రభుత్వాన్ని నిందించింది. రెండు శాసనసభ సమావేశాలు ముగిసినా షిండే కేబినెట్లో ఒక్క మహిళను కూడా చేర్చుకోలేదని ఆదిత్య ఠాక్రే అన్నారు. 2024లో జరిగే లోక్సభ ఎన్నికల్లో శివసేన(ఉద్ధవ్ బాల్థాక్రే)కు చెందిన స్థానిక ఎంపీ రాజన్ విచారే మళ్లీ గెలుస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
OTR : దేశ రాజధానిలో తెలంగాణకు కేర్ ఆఫ్ లేకుండా పోతుందా?
-
Chiranjeevi : కనుగుడ్డు పోవాల్సింది అన్నారు.. మా నాన్న మాటలే గుర్తొచ్చాయి!
-
Chiranjeevi :’పెద్ది’ విజయోత్సవం.. మెగాస్టార్ ఎమోషనల్
-
Story Board : అయోధ్య ఆలయంలో అసలేం జరిగింది..? రాముడి సాక్షిగా నిధులు దారిమళ్లాయా..?
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
ట్రెండింగ్
-
Cockroach Control : ఫ్రిజ్లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్తో చెక్ పెట్టండి..!
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్గా ఎంఎస్ ధోనీ చరిత్ర!