Vande Bharat Train: రైలు ప్రయాణికులకు శుభవార్త.. ఈ మార్గంలో వందే భారత్
- రైలు ప్రయాణికులకు శుభవార్త
- బెంగళూరు-మధురై రూట్లో వందే భారత్ రైలు
- ఈరోజు నుంచి ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైలు ప్రయాణికులకు శుభవార్త అందించింది. ఇప్పటి వరకు దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో వందే భారత్ రైలు పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా.. ఈ రైలును కొత్త రూట్లలో నడపడానికి ఇండియన్ రైల్వే సన్నాహాలు చేస్తుంది. ఈ క్రమంలో.. ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయోజనం పొందుతారు. కాగా.. బెంగళూరు-మధురై రూట్లో వందే భారత్ రైలు ఈరోజు నుంచి ప్రారంభమైంది.
Read Also: Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాజకీయ సలహాదారుడి కిడ్నాప్..
Also Read
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
మధురై రైల్వే స్టేషన్ నుండి ఉదయం 5.15 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1.15 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. ఆ తర్వాత.. తిరుగు ప్రయాణంలో బెంగళూరు రైల్వే స్టేషన్ నుండి మధ్యాహ్నం 1.45 గంటలకు బయలుదేరి సాయంత్రం 5 గంటలకు సేలం రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది. రాత్రి 8.20 గంటలకు తిరుచ్చి చేరుకుని, మధురై రైల్వే స్టేషన్ కు రాత్రి 10.25 గంటలకు చేరుకుంటుంది.
Read Also: Health Tips: ఎక్కువ సేపు మూత్రం ఆపుకుంటే వచ్చే సమస్యలేంటో తెలుసా?
బెంగళూరు-మధురై వందే భారత్ రైలులో.. ఇతర వందే భారత్ రైళ్ల మాదిరిగానే 8 కోచ్లు ఉంటాయి. ఆ కోచ్లలో రెండు రకాల కోచ్లు ఉంటాయి. చైర్కార్, ఎగ్జిక్యూటివ్ చైర్కార్.. ఈ రెండింటికీ వేర్వేరు ఛార్జీలు ఉంటాయి. అయితే.. ప్రయాణికుల డిమాండ్ మరింత పెరిగితే, భవిష్యత్తులో వందే భారత్ రైళ్లలో అదనపు కోచ్ల సంఖ్యను పెంచవచ్చు. ఇదిలా ఉంటే.. మధురై-బెంగళూరు వందే భారత్ రైలు ఛార్జీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఏసీ చైర్కార్ ధర దాదాపు రూ.1300, ఎగ్జిక్యూటివ్ చైర్కార్ ధర రూ. 2300 ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు.. త్వరలో ఎగ్మోర్-నాగర్ కోయిల్ మార్గంలో వందే భారత్ రైలు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!