Fire Accident : గోవా సమీపంలో గుజరాత్ నుంచి శ్రీలంక వెళ్తున్న కార్గో షిప్ లో భారీ అగ్ని ప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire Accident : గోవా సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం ఓ కార్గో షిప్లో పెను ప్రమాదం సంభవించింది. కార్గో షిప్లో భారీ మంటలు చెలరేగాయి. ఈ నౌక గుజరాత్లోని ముంద్రా నుంచి శ్రీలంక రాజధాని కొలంబోకు వెళుతోంది. సమాచారం అందిన వెంటనే భారత తీర రక్షక దళం వెంటనే నౌకను మళ్లించింది. ఈ భారీ అగ్ని ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు షిప్పింగ్ మంత్రిత్వ శాఖ తెలిపింది. మృతుడిని గుర్తించగా, అతడు ఫిలిప్పీన్స్ పౌరుడని తేలింది. ఓడలో మొత్తం 21 మంది ఉన్నారు. ఇందులో ఫిలిపినో, మాంటెనెగ్రిన్, ఉక్రేనియన్ పౌరులు ఉన్నారు.
Read Also:Bangladesh Protests: బంగ్లాదేశ్ అల్లర్లలో 105 మంది మృతి.. గాయపడిన 2500మంది..!
Also Read
- Best FD Interest Rates August 2026: FDపై 8.50 శాతం వరకు వడ్డీ.. ఆగస్టు 2026లో టాప్ రేట్లు అందిస్తున్న బ్యాంకుల పూర్తి జాబితా
- Tirupati Crime: వారంలో ప్రియుడు వివాహం..! ప్రియురాలు ఆత్మహత్య
- Bhadradri Kothagudem: తీవ్ర విషాదం.. వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ ఆఫీసర్ బలి!
- Pawan Kalyan: ప్రపంచ ఏనుగుల దినోత్సవం.. ఏనుగుల సంరక్షణపై పవన్ కల్యాణ్ కీలక సందేశం
@IndiaCoastGuard MRCC #Mumbai received distress call on 19 Jul 24 from container carrier MV Maersk Frankfurt 50 NM off #Karwar regarding major #fire onboard. #ICG #Dornier & Ships Sachet, Sujeet and Samrat pressed into action. #ALH and additional aircraft being mobilized to… pic.twitter.com/b6JKlY2f75
— Indian Coast Guard (@IndiaCoastGuard) July 19, 2024
అగ్నిప్రమాదానికి గల కారణాలను కోస్ట్ గార్డ్ వివరిస్తూ.. ఓడలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని, మంటలు మొత్తం వ్యాపించడంతో ఓడలో ఉన్న వారికి విషయం తెలిసిందని చెప్పారు. ఈ నౌక 2024లో మాత్రమే ప్రారంభించబడింది. ఇంటర్నేషనల్ మారిటైమ్ డేంజరస్ గూడ్స్ (IMDG)గా సరుకు రవాణా చేయబడుతోంది. ఓడలో మంటలు చెలరేగాయని తెలిసిన వెంటనే ఓడలో ఉన్న సిబ్బంది స్వయంగా మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా మంటలను అదుపు చేయలేకపోయారు. మంటలు త్వరగా డెక్కు వ్యాపించడంతో కంటైనర్లు పేలిపోయాయి. ఓడలో ఉన్న 160 కంటైనర్లలో 20 మంటల్లో చిక్కుకున్నాయి. భారత తీరానికి 80 నాటికల్ మైళ్ల దూరంలో కార్గో షిప్ ఉందని షిప్పింగ్ మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు.
Read Also:Simhachalam Giri Pradakshina 2024: నేడు సింహాచలం గిరి ప్రదక్షిణ.. భక్తులకు కీలక సూచనలు
ఓడలో మంటలు చెలరేగడంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. మంటలను ఆర్పేందుకు మూడు నౌకలను ఘటనా స్థలానికి పంపినట్లు కోస్ట్ గార్డ్ మనోజ్ భాటియా తెలిపారు. ఓడలో ఉన్న వ్యక్తులను తరలించడానికి కోచి బేస్ నుండి హెలికాప్టర్ను పంపాలని ఆదేశించినట్లు కోస్ట్ గార్డ్ తెలిపింది. భారత నావికాదళం పశ్చిమ నౌకాదళ కమాండ్ మారిటైమ్ ఆపరేషన్స్ సెంటర్ (MOC), ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ – ఇండియన్ ఓషన్ రీజియన్ (IFC-IOR)కి కూడా పరిస్థితి గురించి సమాచారం అందించింది.
- Tags
- Goa
- goa ship fire
- Gujarat
- Srilanka
తాజావార్తలు
-
IND vs AFG Schedule: భారత్, అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్ ఖరారు.. పూర్తి షెడ్యూల్ ఇదే.. బంగ్లాదేశ్కు భారీ షాక్?
-
Best FD Interest Rates August 2026: FDపై 8.50 శాతం వరకు వడ్డీ.. ఆగస్టు 2026లో టాప్ రేట్లు అందిస్తున్న బ్యాంకుల పూర్తి జాబితా
-
Srinu Vaitla : జార్జ్క్రిష్తో కంబ్యాక్ ఇచ్చేందుకు శ్రీనువైట్ల భారీ స్కెచ్
-
Mallika Sherawat: ‘టామ్ క్రూజ్కు నాపై క్రష్’.. వీడియో కూడా ఉంది.. 49 ఏళ్ల మల్లికా కామెంట్స్ వైరల్
-
Tirupati Crime: వారంలో ప్రియుడు వివాహం..! ప్రియురాలు ఆత్మహత్య
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!