Fire Accident : గోవా సమీపంలో గుజరాత్ నుంచి శ్రీలంక వెళ్తున్న కార్గో షిప్ లో భారీ అగ్ని ప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire Accident : గోవా సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం ఓ కార్గో షిప్లో పెను ప్రమాదం సంభవించింది. కార్గో షిప్లో భారీ మంటలు చెలరేగాయి. ఈ నౌక గుజరాత్లోని ముంద్రా నుంచి శ్రీలంక రాజధాని కొలంబోకు వెళుతోంది. సమాచారం అందిన వెంటనే భారత తీర రక్షక దళం వెంటనే నౌకను మళ్లించింది. ఈ భారీ అగ్ని ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు షిప్పింగ్ మంత్రిత్వ శాఖ తెలిపింది. మృతుడిని గుర్తించగా, అతడు ఫిలిప్పీన్స్ పౌరుడని తేలింది. ఓడలో మొత్తం 21 మంది ఉన్నారు. ఇందులో ఫిలిపినో, మాంటెనెగ్రిన్, ఉక్రేనియన్ పౌరులు ఉన్నారు.
Read Also:Bangladesh Protests: బంగ్లాదేశ్ అల్లర్లలో 105 మంది మృతి.. గాయపడిన 2500మంది..!
Also Read
- Ketan Agarwal Case: తొలిసారి మీడియా ముందు నోరు విప్పిన సియా సోదరుడు.. ఏం చెప్పాడంటే..!
- TG Bharath: రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 10 లక్షల ఉద్యోగాలే లక్ష్యం.!
- Rajasthan: పదవీ విరమణకు ఒకరోజు ముందు షాక్.. ఉద్యోగాన్ని కోల్పోయిన టీచర్.. కారణం తెలిస్తే..!
- ICC T20 Rankings: వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించినా తగ్గేదేలే.. అగ్రస్థానంలో తెలుగు బిడ్డ..
@IndiaCoastGuard MRCC #Mumbai received distress call on 19 Jul 24 from container carrier MV Maersk Frankfurt 50 NM off #Karwar regarding major #fire onboard. #ICG #Dornier & Ships Sachet, Sujeet and Samrat pressed into action. #ALH and additional aircraft being mobilized to… pic.twitter.com/b6JKlY2f75
— Indian Coast Guard (@IndiaCoastGuard) July 19, 2024
అగ్నిప్రమాదానికి గల కారణాలను కోస్ట్ గార్డ్ వివరిస్తూ.. ఓడలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని, మంటలు మొత్తం వ్యాపించడంతో ఓడలో ఉన్న వారికి విషయం తెలిసిందని చెప్పారు. ఈ నౌక 2024లో మాత్రమే ప్రారంభించబడింది. ఇంటర్నేషనల్ మారిటైమ్ డేంజరస్ గూడ్స్ (IMDG)గా సరుకు రవాణా చేయబడుతోంది. ఓడలో మంటలు చెలరేగాయని తెలిసిన వెంటనే ఓడలో ఉన్న సిబ్బంది స్వయంగా మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా మంటలను అదుపు చేయలేకపోయారు. మంటలు త్వరగా డెక్కు వ్యాపించడంతో కంటైనర్లు పేలిపోయాయి. ఓడలో ఉన్న 160 కంటైనర్లలో 20 మంటల్లో చిక్కుకున్నాయి. భారత తీరానికి 80 నాటికల్ మైళ్ల దూరంలో కార్గో షిప్ ఉందని షిప్పింగ్ మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు.
Read Also:Simhachalam Giri Pradakshina 2024: నేడు సింహాచలం గిరి ప్రదక్షిణ.. భక్తులకు కీలక సూచనలు
ఓడలో మంటలు చెలరేగడంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. మంటలను ఆర్పేందుకు మూడు నౌకలను ఘటనా స్థలానికి పంపినట్లు కోస్ట్ గార్డ్ మనోజ్ భాటియా తెలిపారు. ఓడలో ఉన్న వ్యక్తులను తరలించడానికి కోచి బేస్ నుండి హెలికాప్టర్ను పంపాలని ఆదేశించినట్లు కోస్ట్ గార్డ్ తెలిపింది. భారత నావికాదళం పశ్చిమ నౌకాదళ కమాండ్ మారిటైమ్ ఆపరేషన్స్ సెంటర్ (MOC), ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ – ఇండియన్ ఓషన్ రీజియన్ (IFC-IOR)కి కూడా పరిస్థితి గురించి సమాచారం అందించింది.
- Tags
- Goa
- goa ship fire
- Gujarat
- Srilanka
తాజావార్తలు
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Ketan Agarwal Case: తొలిసారి మీడియా ముందు నోరు విప్పిన సియా సోదరుడు.. ఏం చెప్పాడంటే..!
-
Pakistan: పాకిస్థాన్లో హై అలర్ట్.. ఇమ్రాన్ ఖాన్ ఉన్న జైలు నుంచి 14 మంది ఖైదీలు పరార్! అసలేం జరిగిందంటే?
-
TG Bharath: రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 10 లక్షల ఉద్యోగాలే లక్ష్యం.!
-
Rajasthan: పదవీ విరమణకు ఒకరోజు ముందు షాక్.. ఉద్యోగాన్ని కోల్పోయిన టీచర్.. కారణం తెలిస్తే..!
ట్రెండింగ్
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!