Fire Accident : గోవా సమీపంలో గుజరాత్ నుంచి శ్రీలంక వెళ్తున్న కార్గో షిప్ లో భారీ అగ్ని ప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire Accident : గోవా సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం ఓ కార్గో షిప్లో పెను ప్రమాదం సంభవించింది. కార్గో షిప్లో భారీ మంటలు చెలరేగాయి. ఈ నౌక గుజరాత్లోని ముంద్రా నుంచి శ్రీలంక రాజధాని కొలంబోకు వెళుతోంది. సమాచారం అందిన వెంటనే భారత తీర రక్షక దళం వెంటనే నౌకను మళ్లించింది. ఈ భారీ అగ్ని ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు షిప్పింగ్ మంత్రిత్వ శాఖ తెలిపింది. మృతుడిని గుర్తించగా, అతడు ఫిలిప్పీన్స్ పౌరుడని తేలింది. ఓడలో మొత్తం 21 మంది ఉన్నారు. ఇందులో ఫిలిపినో, మాంటెనెగ్రిన్, ఉక్రేనియన్ పౌరులు ఉన్నారు.
Read Also:Bangladesh Protests: బంగ్లాదేశ్ అల్లర్లలో 105 మంది మృతి.. గాయపడిన 2500మంది..!
Also Read
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
@IndiaCoastGuard MRCC #Mumbai received distress call on 19 Jul 24 from container carrier MV Maersk Frankfurt 50 NM off #Karwar regarding major #fire onboard. #ICG #Dornier & Ships Sachet, Sujeet and Samrat pressed into action. #ALH and additional aircraft being mobilized to… pic.twitter.com/b6JKlY2f75
— Indian Coast Guard (@IndiaCoastGuard) July 19, 2024
అగ్నిప్రమాదానికి గల కారణాలను కోస్ట్ గార్డ్ వివరిస్తూ.. ఓడలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని, మంటలు మొత్తం వ్యాపించడంతో ఓడలో ఉన్న వారికి విషయం తెలిసిందని చెప్పారు. ఈ నౌక 2024లో మాత్రమే ప్రారంభించబడింది. ఇంటర్నేషనల్ మారిటైమ్ డేంజరస్ గూడ్స్ (IMDG)గా సరుకు రవాణా చేయబడుతోంది. ఓడలో మంటలు చెలరేగాయని తెలిసిన వెంటనే ఓడలో ఉన్న సిబ్బంది స్వయంగా మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా మంటలను అదుపు చేయలేకపోయారు. మంటలు త్వరగా డెక్కు వ్యాపించడంతో కంటైనర్లు పేలిపోయాయి. ఓడలో ఉన్న 160 కంటైనర్లలో 20 మంటల్లో చిక్కుకున్నాయి. భారత తీరానికి 80 నాటికల్ మైళ్ల దూరంలో కార్గో షిప్ ఉందని షిప్పింగ్ మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు.
Read Also:Simhachalam Giri Pradakshina 2024: నేడు సింహాచలం గిరి ప్రదక్షిణ.. భక్తులకు కీలక సూచనలు
ఓడలో మంటలు చెలరేగడంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. మంటలను ఆర్పేందుకు మూడు నౌకలను ఘటనా స్థలానికి పంపినట్లు కోస్ట్ గార్డ్ మనోజ్ భాటియా తెలిపారు. ఓడలో ఉన్న వ్యక్తులను తరలించడానికి కోచి బేస్ నుండి హెలికాప్టర్ను పంపాలని ఆదేశించినట్లు కోస్ట్ గార్డ్ తెలిపింది. భారత నావికాదళం పశ్చిమ నౌకాదళ కమాండ్ మారిటైమ్ ఆపరేషన్స్ సెంటర్ (MOC), ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ – ఇండియన్ ఓషన్ రీజియన్ (IFC-IOR)కి కూడా పరిస్థితి గురించి సమాచారం అందించింది.
- Tags
- Goa
- goa ship fire
- Gujarat
- Srilanka
తాజావార్తలు
-
Rahul Gandhi: ‘ప్రభుత్వాన్ని తొలగించండి’ అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
-
Story Board : దేశ ప్రజల స్వరం మారుతోంది..కేంద్రంపై అసంతృప్తి ,ఆవేశం మరింత రాజుకుంటే…
-
Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
-
TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!