Titanic Ship: టైటానిక్ షిప్ శిథిలాలు.. చూపించేందుకు తీసుకెళ్లే పర్యాటక జలాంతర్గామి మిస్సింగ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టైటానిక్ షిప్ శిథిలాలను చూపించేందుకు తీసుకెళ్లే పర్యాటక జలాంతర్గామి మిస్సైంది. అయితే, ప్రమాద సమయంలో ఆ జలాంతర్గమిలో ఐదుగురు టూరిస్టులు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా అంట్లాంటిక్ మహాసముద్రంలోని ఏ ప్రాంతంలో ఈ జలాంతర్గామి మిస్సింగ్ అయింది అనేది మాత్రం తెలియలేదు. మరోవైపు, దీన్ని గుర్తించేందుకు బోస్టన్ కోస్ట్ గార్డు అధికారులు స్పెషల్ టీమ్స్ ను సముద్రంలోకి పంపించాయి.
Read Also: Vizag Affair Crime: త్రిల్లర్ సినిమాని తలపించే మిస్టరీ కేసు.. ఆ నాలుగు నంబర్లే హంతకుడ్ని పట్టించాయి
Also Read
- Nadendla Manohar: జనసేన లక్ష్యం 25 లక్షల సభ్యత్వాలు.. కార్యకర్తలకు భరోసా.. రూ. 46 కోట్ల భీమా సాయం
- Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
- ICC: పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఐసీసీ డబుల్ షాక్.. ఆటగాళ్లపై 40 శాతం జరిమానా.. కారణం ఇదే..
- Maharashtra: ఇండిగోలో సాధారణ ప్రయాణికులతో కలిసి బెంగళూరు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
ఈ జలాంతర్గమి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. విలాసవంతమైన టైటానిక్ షిప్ 1912 ఏప్రిల్ 14న అట్లాంటిక్ మహా సముద్రంలో ఓ మంచుకొండను ఢీ కొట్టి మునిపోయింది. ఈ ఘటనలో 15వందల మంది జలసమాధి అయ్యారు. ఈ భారీ ఓడ శిథిలాలను సముద్ర గర్భంలో 1985లో గుర్తించారు. ఆ తర్వాత నుంచి కొంతమంది ఔత్సాహికులు, పరిశోధకులు ఈ జలాంతర్గాములతో అక్కడికి వెళ్లి శిథిలాలను చూసొస్తున్నారు. అయితే, తాజాగా అలా చూసేందుకు వెళ్తున్నప్పడే ఈ జలాంతర్గామి అదృశ్యమైనట్లు సమాచారం.
Read Also: Fatigue: నిద్ర లేమితో .. రోజంతా అలసటగా కనిపిస్తారు
ఈక్రమంలోనే ఆదివారం ఉదయం ఉపరితల నౌక MV పోలార్ ప్రిన్స్ తో దాని సంబంధాలు తెగిపోయాయి. గల్లంతైన ఆ సబ్మెర్సిబుల్ వెసెల్ లో ఐదుగురు ఉన్నారని అమెరికా, కెనడా దేశాల కోస్ట్గార్డ్ విభాగాలు తెలిపాయి. వెంటనే ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నామని వారు తెలిపారు. టైటానిక్ శిథిలాలు ఉన్న ప్రదేశానికి డైవ్ చేస్తున్న సమయంలో.. సబ్మెర్సిబుల్ అదృశ్యమైందని వెల్లడించారు. సముద్రంలోని సుమారు 13,000 అడుగుల లోతులో సబ్మెర్సిబుల్ అదృశ్యమైందని చెప్పుకొచ్చారు. 70 నుంచి 96 గంటలకు సరిపడా ఆక్సిజన్ సబ్మెర్సిబుల్ లో ఉందని.. అది సోమవారం మధ్యాహ్నమే పూర్తయిపోయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
Chiranjeevi : సీఎం విజయ్’కి చిరు ఫోన్
-
Nadendla Manohar: జనసేన లక్ష్యం 25 లక్షల సభ్యత్వాలు.. కార్యకర్తలకు భరోసా.. రూ. 46 కోట్ల భీమా సాయం
-
Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
-
ICC: పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఐసీసీ డబుల్ షాక్.. ఆటగాళ్లపై 40 శాతం జరిమానా.. కారణం ఇదే..
-
Tollywood : పర్సంటేజ్’ స్పెషల్ కమిటీ.. దిల్ రాజు, అల్లు అరవింద్ సహా నిర్మాతలు ఎవరంటే?
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!