Gautam Gambhir: “రోడ్షోలు అవసరమా..?” బెంగుళూరు ఘటనపై టీమిండియా కోచ్ రియాక్షన్ ఇదే..!
- రోడ్షోలు అవసరమా..?
- విజయం ఎంత ముఖ్యమో, మనిషి జీవితం అంతకంటే ముఖ్యమైంది.
- మీడియా సమావేశంలో స్పందించిన టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gautam Gambhir: బెంగళూరులో జరిగిన ఆర్సీబీ విజయోత్సవాల్లో జరిగిన తొక్కిసలాటపై భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ, విజయోత్సవాల కోసం రోడ్లపై జరిపే ర్యాలీల అవసరం లేదని తన అభిప్రాయాన్ని పునరుద్ఘాటించారు. నాకు ఎప్పుడూ వీధి ర్యాలీలపై నమ్మకం లేదని.. ఇలా జరగడం దురదృష్టకరం అని అన్నారు. 11 ప్రాణాలు పోవడం అంటే ఊహించలేనిది. విజయం ఎంత ముఖ్యమో, మనిషి జీవితం అంతకంటే ముఖ్యమైందని నేను ఎప్పుడూ చెబుతుంటానని గంభీర్ ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు.
Read Also: Kailash Vijayvargiya: “చిన్న దుస్తులు వేసుకున్న అమ్మాయిలు నచ్చరు” మళ్లీ వివాదాల్లో బీజేపీ మంత్రి..!
Also Read
- Mamidikaya Pappucharu: 'మామిడికాయ పప్పుచారు' ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
- KTR: పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల తెలంగాణగా మారిపోయింది.!
- Pawan Kalyan: ప్రెస్మీట్కు అయినా అనుమతి ఇస్తారా?.. పవన్ కల్యాణ్ సెటైర్లు!
- CM Revanth: తెలంగాణ రైజింగ్-2047తో ప్రపంచానికి గేట్వేగా తెలంగాణ.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం విజన్..!
ఇలాంటి వేడుకలు అవసరమైన భద్రతా ఏర్పాట్లు లేకుండా జరిపితే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడినట్లే.. ఒక మనిషి ప్రాణం కూడా పోతే అది చాలా పెద్ద నష్టమే. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని గంభీర్ మాట్లాడారు. ఇలాంటి విజయాలు జరుపుకోవడం తప్పేమీ కాదని, కానీ ప్రజల ప్రాణాలకంటే ఏదీ ముఖ్యమైనదికాదని స్పష్టం చేశారు. ఫ్యాన్స్ ఉత్సాహపడటం సహజం. కానీ, ఆ ఉత్సాహం నియంత్రణ కోల్పోతే విపత్తులకు దారితీస్తుంది. భద్రతకు సంబంధించిన సన్నద్ధత లేకపోతే ర్యాలీలు నిర్వహించకూడదని గంభీర్ అన్నారు.
Read Also: Physical Harassment : వికారాబాద్లో దారుణం.. మైనర్ బాలికపై లైంగిక దాడి..!
ఆర్సీబీ విజయాన్ని పురస్కరించుకుని కర్ణాటక క్రికెట్ సంఘం (KSCA) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఈవెంట్కు అనూహ్యంగా లక్షలమంది అభిమానులు తరలివచ్చారు. దీనివల్ల ఏర్పడ్డ అపసవ్య పరిస్థితుల్లో తొక్కిసలాట జరిగింది. ఈ విషాద ఘటన భారత దేశంలో జరిపే భారీ వేడుకల నిర్వహణపై అనేక ప్రశ్నలు రేపింది.
తాజావార్తలు
-
Bihar: 1992 నాటి కేసు.. 34 ఏళ్ల తర్వాత తీర్పు.. 84 ఏళ్ల వృద్ధుడిని దోషిగా తేల్చిన కోర్టు
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
Psychology Facts: ప్రతి పనికీ 10నిమిషాలు ముందుగా వచ్చే వ్యక్తులు గురించి షాకింగ్ ఫ్యాక్ట్.. తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!
-
Nikhil : స్వయంభు కోసం 45 రోజుల కఠినమైన శిక్షణ తీసుకున్న హీరో నిఖిల్
-
Samsung: సామ్ సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8, ఫోల్డ్ 8 అల్ట్రా డిజైన్ లీక్.. 200MP కెమెరాతో రానున్నాయా?
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!