Gas Leak: గ్యాస్ లీక్ ఘటనలో ఇద్దరి పరిస్థితి సీరియస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖపట్నం సమీపంలోని అచ్యుతాపురంలో అమ్మోనియా గ్యాస్ లీక్ ఘటనలో బాధితులకు చికిత్స అందుతోంది. అయితే ఇద్దరి పరిస్థితి సీరియస్ గా వుందని తెలుస్తోంది. అచ్యుతాపురం గ్యాస్ లీక్ ఘటనలో 8మందికి తీవ్ర అస్వస్థత వుంది. కేజీహెచ్ లో ఎమర్జెన్సీ వైద్యసేవలు కోసం తరలించారు. అనకాపల్లి ఏరియా ఆసుపత్రిలో 120మందికి చికిత్స అందిస్తున్నారు. గ్యాస్ లీక్ ప్రమాదంపై విచారణ ప్రారంభమైంది.
బ్రాండిక్స్ లో జరిగిందా లేక పక్కనే ఉన్న మరో కంపెనీ నుంచి లీక్ అయిందా అనేది నివేదికలో రానుంది. డిజిటల్ మీటర్ల ద్వారా గ్యాస్ లీక్ తీవ్రతను పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు. NTV తో అనకాపల్లి కలెక్టర్ రవిసుభాష్ మాట్లాడారు. మరోవైపు గ్యాస్ లీక్ బాధితులతో నిండిపోయింది అనకాపల్లి ఆసుపత్రి.ఆక్సిజన్ సపోర్ట్ తో వైద్య సేవలు అందిస్తున్నారు.
Also Read
- AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- PM Modi 12 Years Governance: డిజిటల్ విప్లవం నుంచి గ్లోబల్ ప్రభావం వరకు.. మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు..
- Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
ఒకేసారి ఎక్కువ సంఖ్యలో బాధితులు రావడంతో బెడ్స్ కోసం ఇబ్బంది తప్పడం లేదు. బెడ్స్ కెపాసిటీ 120 కాగా గ్యాస్ లీక్ బాధితుల సంఖ్యే 130వుంది. ఆసుపత్రి రద్దీ పెరగడంతో ఉషా ప్రైం, సత్యదేవ, అగనంపూడి పీహెచ్ సీలకు బాధితుల్ని తరలిస్తున్నారు. మరోవైపు NTR ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు, పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్. యాజమాన్యం వైఫల్యం కారణంగా ప్రమాదం జరిగిందని తెలితే కఠినంగా వ్యవహారిస్తాం అన్నారు మంత్రులు.
బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు తెలిపారు. విశాఖ కేజీహెచ్ కు చేరుకుంటున్నారు గ్యాస్ లీక్ ఘటన లో తీవ్ర అస్వస్థతకు గురైన బాధితులు. అత్యవసర విభాగం లో చికిత్స పొందుతున్న సత్యవతి, దమయంతి. బాధితుల ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. NTR ఆసుపత్రిలో గ్యాస్ లీక్ బాధితులకు అందుతున్న వైద్యసేవలపై ఉన్నతాధికారులు ఆరా తీశారు. 48గంటల పాటు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీఅయ్యాయి. గ్యాస్ లీక్ తర్వాత ఇళ్లకు వెళ్లిపోయిన కొంత మందికి స్వల్ప సమస్యలు వేధిస్తున్నాయి. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తుంది యంత్రాంగం.
విశాఖ జిల్లా అచ్యుతాపురం సెజ్ లో ప్రమాదం బాధాకరం అన్నారు అచ్చెన్నాయుడు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే అచ్యుతాపురంలో గ్యాస్ లీకేజీ జరిగిందన్నారు టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. బాధితులకు ప్రభుత్వం అండగా నిలవాలన్నారు.
తాజావార్తలు
-
Chhatta Bazaar Arch Collapse : హైదరాబాద్లో భారీ వర్షాల ఎఫెక్ట్.. పాతబస్తీలో కూలిన చారిత్రక కమాన్.!
-
AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
-
Dubai Road Accident: దుబాయిలో ఘోర రోడ్డు ప్రమాదం.. జగిత్యాలకు చెందిన ముగ్గురు దుర్మరణం
-
Kitchen Hacks: వంట పనిని సగం తగ్గించే కిచెన్ టిప్స్ .. బిగినర్స్ కోసం స్పెషల్ గైడ్!
-
CM Revanth Reddy : మహిళల చేతుల్లోనే తెలంగాణ ప్రగతి
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!