Ganja Milk Shake: రూటుమార్చిన స్మగ్లర్లు.. కొత్తగా గంజాయి మిల్క్ షేక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాలలో రోజు రోజుకి మతపదార్థాలు రవాణా సంబంధించి అనేక కేసులు నమోదవుతున్న విషయం తరచూ వింటూనే ఉన్నాం. మత్తు పదార్థాల్లో ఎక్కువగా తీసుకునే వాటిలో ఒకటైన గంజాయి రోజురోజుకి మరింతగా విస్తరిస్తుంది. ఈ క్రమంలోనే గంజాయి మహమ్మారి తన రూపాన్ని నిత్యం మార్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కనపడుతుంది. ఇప్పటివరకు మనం గంజాయిని కేవలం ఆకుల రూపంలోనే చూసే వాళ్ళం. కాకపోతే ఇప్పుడు చాక్లెట్లు, పౌడర్ లోకి వచ్చేసాయి. ఇదే క్రమంలోనే గంజాయితో చేసిన మిల్క్ షేక్ లు బయట మార్కెట్లో అమ్మేస్తున్నారు. అంతకాకుండా కొందరైతే ఏకంగా పిల్లలు తాగే పాలలో ఇది కలుపుకొని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు అంటూ చెప్పి అమ్ముతుండడం దారుణంగా ఉంది.
Also read: Deccan Chargers Song: నాకు ఇప్పటికీ గుర్తుంది.. బెస్ట్ ఐపీఎల్ థీమ్ సాంగ్ అదే: రోహిత్
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
అయితే ఇలా చేసింది ఎవరో కాదు ఓ కిరాణా షాపు యజమాని. హైదరాబాదు జగద్గిరిగుట్టలోని ఓ కిరణం షాపులో ఈ సంఘటన చోటు చేసుకుంది. గంజాయికిని అక్రమ రవాణాకు ఎలాగైనా చేయాలని ఉద్దేశంతో రకరకాల మార్గాలు అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు పోలీసులకు పట్టుబడడంతో స్మగ్లర్లు కొత్తగా రూటు మారుస్తున్నారు. ఇప్పటివరకు కేవలం చాక్లెట్లు, బిస్కెట్లు, స్వీట్ల రూపంలో వీటిని అమ్ముతుండగా ఇప్పుడు గంజాయిని పౌడర్ రూపంలోకి మార్చేశారు. వీటిని పాలలో కలుపుకొని మిల్క్ షేక్ రూపంలో తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలని యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు.
Also read:Teja sajja : ‘మిరాయ్’ గా వస్తున్న తేజ సజ్జా.. మైండ్ బ్లాకయ్యేలా గ్లింప్స్..
ఈ విషయంలో కిరాణా షాప్ యజమాని మాటలు విని మిల్క్ షేక్ తాగిన వారు ఏకంగా ఏడు గంటల పాటు మత్తులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం కిరాణా దుకాణంపై దాడి చేసి యజమాని మనోజ్ కుమార్ అగర్వాల్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో భాగంగా మనోజ్ కుమార్ నుండి నాలుగు కేజీల గంజాయి, అలాగే 160 ప్యాకెట్లు గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక వీటిని సప్లై చేసిన మోహన్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ గంజాయి పౌడర్ ను కిలో రూ. 2500 కు విక్రయిస్తున్నట్లు సదరు దుకాణం యజమాని తెలిపారు. అలాగే గంజాయితో కూడిన చాక్లెట్ ను ఒక్కొక్కటి 40 రూపాయలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
-
Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!