Gangula Kamalakar: కేసీఆర్ అధినేతగా ఉండాలని తెలంగాణ ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారు
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కరీంనగర్ నుంచి శంఖారావం పూరించారు అని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. సింహ గర్జన సభతో ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానం నుంచే ప్రారంభించారు.. కేసీఆర్ కు సెంటిమెంట్ కరీంనగర్ జిల్లా అని ఆయన చెప్పుకొచ్చారు. కేసీఆర్ కు కరీంనగర్ ప్రజలతో ఎంతో అనుబంధం ఉంది అని వెల్లడించారు.
Read Also: Himanta Biswa Sarma: రాహుల్ గాంధీ ప్రేమ నాకొద్దు.. లాలూ హిందూ నిర్వచనాన్ని మరిచిపోయాడు..
Also Read
రైతుబంధు, దళిత బంధు పథకాలను కరీంనగర్ నుంచి మాజీ సీఎం కేసీఆర్ ప్రారంభించారు అని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే తెలంగాణ ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు అంటూ విమర్శలు గుప్పించారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో గెలిచి పార్లమెంటులో తెలంగాణ గళం వినిపించాలి.. 12వ తేదీన జరిగే ఎన్నికల్లో ఇదే కరీంనగర్ నుంచి మరోసారి కేసీఆర్ శంఖారావం పూరించనున్నారు.. కేసీఆర్ అధినేతగా ఉండాలని తెలంగాణ ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారు అని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
తాజావార్తలు
-
Polavaram Project : పోలవరం ప్రాజెక్ట్పై కేంద్రం మెగా ప్లాన్..
-
RBI Gold Reserves: భారత్కు రాబోతున్న 104 టన్నుల బంగారం.. కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ
-
PBKS Income: 2008 నుంచి ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కొట్టని పంజాబ్కు డబ్బులే డబ్బులు.. ఎలా అంటే..
-
AP Mobile Alert: మొబైల్లో అలర్ట్ షాక్.? రేపు ఎన్నిగంటలకంటే..!
-
Himanta Sarma: హిమంత వ్యాఖ్యలతో బంగ్లాదేశ్లో కలకలం..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!