Indrakeeladri : భక్తులకు గుడ్న్యూస్.. ఇంద్రకీలాద్రిపై ఉచిత బస్సు సర్వీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భక్తులకు విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం శుభవార్త చెప్పింది. ఇంద్రకీలాద్రిపై భక్తులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని నిర్ణయించుకున్నారు. ఈ విధంగా ఆలయ ట్రాన్స్పోర్ట్ డీఈని ఈవో ఆదేశించారు. భక్తులకు ఉచిత సేవలు అందించాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఈవో చెబుతున్నారు. అయితే నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై ఉచిత బస్సు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.45 గంటలకు దుర్గ ఘాట్ నుంచి బస్సులు ప్రారంభం కానున్నాయి. అయితే ఈవో నిర్ణయం కక్ష సాధింపు అని టెంపుల్ ట్రాన్స్పోర్ట్ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. జీతాలు పెంచాలని ఉద్యోగులు కోరడం, ఆపై కోర్టుకు వెళ్లడంతోనే ఈవో ఈ నిర్ణయం తీసుకున్నారని డ్రైవర్లు చెబుతున్నారు. దుర్గగుడి ఈవో నిర్ణయంపై దేవాదాయశాఖ మంత్రి, కమిషనర్కు ఫిర్యాదు చేసే యోచనలో టెంపుల్ ట్రాన్స్పోర్ట్ ఉద్యోగులు ఉన్నారు.
Also Read : Khakistan Protests: కెనడాలో ఖలిస్తానీల ఆందోళనలు.. ధీటుగా స్పందించిన భారతీయులు
Also Read
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
- Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
- IPL Team: కొత్త ఐపీఎల్ జట్టులో దిగ్గజాలు.. CSK, MI, RCB తట్టుకునేనా..?
ఇదిలా ఉంటే.. నిన్న ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మకు ఆషాఢ మాసం సందర్భంగా శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవస్థానం తరఫున శనివారం సారె సమర్పించారు. ఆలయ ట్రస్ట్బోర్డు చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఈవో ఎస్.ల వన్న, ట్రస్ట్బోర్డు సభ్యులు సారెను సమర్పించారు. ఆలయంలో వారికి ఈవో భ్రమ రాంబ సాదర స్వాగతం పలికారు. మహామండపం ఆరో అంతస్తులో అమ్మవారి ఉత్పవమూర్తి ఎదుట పూజలు నిర్వహించారు. దుర్గగుడి ఇంజనీరింగ్ విభాగం దుర్గ మ్మకు సారె సమర్పించింది. ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బందితో కలిసి ఈవో భ్రమరాంబ తొలుత జమ్మిడొడ్డిలో దేవతల విగ్రహాల వద్ద పూజలు చేశారు. కుటుంబ సభ్యులతో వచ్చిన ఇంజనీరింగ్ సిబ్బంది జమ్మిదొడ్డి నుంచి సారె తీసుకుని కొండపైకి చేరుకుని అమ్మవారికి సారె సమర్పించారు. డిప్యూటీ ఈవో గురుప్రసాద్, ఈఈలు కోటేశ్వరరావు, రమాదేవి, డీఈలు, ఏఈలు, స్థానాచార్యుడు విష్ణుభట్ల శివప్రసాదశర్మ, ట్రస్ట్బోర్డు సభ్యులు పాల్గొన్నారు.
Also Read : Urad Dal: ఉవ్వెత్తిన ఎగిసిన టమాటా ధర.. అదే దారిలో కందిపప్పు
తాజావార్తలు
-
Bhatti Vikramarka : 3 ట్రిలియన్ల ఆర్థిక వ్వవస్థే లక్ష్యం
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
-
Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
-
Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
-
IPL Team: కొత్త ఐపీఎల్ జట్టులో దిగ్గజాలు.. CSK, MI, RCB తట్టుకునేనా..?
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!