Eluru: తీవ్ర విషాదం.. రైలు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eluru: ఏలూరు జిల్లా చేబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం రాత్రి దారుణంగా చోటు చేసుకుంది. రైలు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన నలుగురి ప్రాణాలు కోల్పోయారు. రాత్రి సుమారు 9 గంటల సమయంలో ప్లాట్ఫారం సమీపంలో రైల్వే ట్రాక్ దాటుతుండగా, విశాఖపట్నం వైపు వెళ్తున్న ఓ ప్రత్యేక రైలు వీరిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిని తాడేపల్లిగూడెంలో నివసిస్తున్న షేక్ చాంద్ బాషా (50), ఆయన భార్య షేక్ హసీనా (45), వారి కుమార్తెలు షేక్ షర్మిల (23), షేక్ సమీరా (20)గా రైల్వే అధికారులు గుర్తించారు. వీరిలో పెద్ద కుమార్తె షర్మిల ఎంబీఏ చదువుతోంది. చాంద్ బాషా, హసీనా దంపతులు తాడేపల్లిగూడెంలో ఒక ఆప్టికల్ షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
మృతుల నేపథ్యం పరిశీలిస్తే.. వీరి స్వస్థలం గుడివాడ కాగా, సుమారు 25 ఏళ్ల క్రితమే వీరు తాడేపల్లిగూడెం వచ్చి స్థిరపడ్డారు. పట్టణంలోని 6వ వార్డు, మామిడితోట ప్రాంతంలో గత మూడేళ్లుగా ఒక ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. అయితే, ఈ కుటుంబం కొంతకాలంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన జూలై 4వ తేదీ సాయంత్రం కూడా ఈ కుటుంబ సభ్యులంతా కలిసి రెండు మోటార్సైకిళ్లపై ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు పొరుగువారు గుర్తుచేసుకున్నారు. ఇది ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనా లేక దీని వెనుక మరేదైనా కారణం ఉందా అనే విషయాలు ఇంకా స్పష్టం కాలేదు. సమాచారం అందుకున్న వెంటనే జీఆర్పీ సీఐ, ఎస్ఐలు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు. రైల్వే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు ముమ్మరం చేశారు.
Also Read
- Heavy Rain Alert: తెలంగాణకు వాన ముప్పు.. ఈ 4 రోజులు జాగ్రత్త..
- Shreyas Iyer: కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు.. భారత క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి..
- TG Police Recruitment: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. 7,437 పోలీస్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ రెడీ!
- Vaibhav Sooryavanshi: బౌలర్ ఎవరైతే నాకేంటి?.. ఫస్ట్ బాల్ సిక్స్ వెళ్లాల్సిందే.. దిగ్గజ బౌలర్లను వణికిస్తున్న వైభవ్..
తాజావార్తలు
-
Eluru: తీవ్ర విషాదం.. రైలు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
-
Amazon Prime Day Sale: రూ.30,000 లోపు బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఏ ఫోన్పై ఎంత ఆఫర్?
-
Kalyan Ram: సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్తో భారీ అప్డేట్!
-
Ali Khamenei Funeral: అగ్రరాజ్యానికి కాలం మూడిందా? ఖమేనీ మరణానికి ఇరాన్ ‘ఇంతకామ్’ తీర్చుకోబోతుందా!
-
Aamir Khan Third Marriage: ఆమిర్ ఖాన్ 3వ భార్య ఈమెనే! ఆమె ఏం చేస్తుందో తెలుసా? బ్యాక్గ్రౌండ్ తెలిస్తే షాకవుతారు..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!