Heavy Rain Alert: తెలంగాణకు వాన ముప్పు.. ఈ 4 రోజులు జాగ్రత్త..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Heavy Rain Alert: తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న తేలికపాటి, మోస్తరు వర్షాలు.. రాబోయే రోజుల్లో మరింత ఉధృతం కానున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన బలమైన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రాగల మూడు, నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు దంచికొట్టనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర ఒడిశా – పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో శనివారం ఉదయం ఏర్పడిన బలమైన అల్పపీడనం అదే ప్రాంతంలో స్థిరంగా కొనసాగుతోంది. దీనికి తోడు 9.4 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించిన ఉపరితల ఆవర్తనం నైరుతి దిశగా వంగి ఉంది. ఈ తీవ్ర ప్రభావంతో రాగల మూడు రోజుల్లో ఈ అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా పయనించనుంది. దీని ఫలితంగా తెలంగాణపై వాన ముప్పు గట్టిగా పొంచి ఉంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వాతావరణ శాఖ అత్యంత కీలకమైన హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ మేరకు ఆ నాలుగు జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కేవలం వర్షాలే కాకుండా.. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పిడుగులు పడే ముప్పు ఎక్కువగా ఉన్నందున ప్రజలు, ముఖ్యంగా రైతులు, గొర్రెల కాపరులు పొలాల్లో ఉన్నప్పుడు చెట్ల కింద అస్సలు ఆశ్రయం పొందవద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సైతం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
మరోవైపు, ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాలపై కూడా ఈ అల్పపీడన ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ జిల్లాల పరిధిలోని వాగులు, వంకలు పొంగిపొర్లే అవకాశం ఉండటంతో రవాణా వ్యవస్థకు అంతరాయం కలగవచ్చునని హెచ్చరించింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కాగా, శనివారం నాడు కూడా రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం ఎల్కపల్లిలో 4.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఇదే జిల్లాలోని సిర్పూర్(టి)లో 3.8 సెం.మీ, వాంకిడిలో 3.8 సెం.మీ, ఆదిలాబాద్ జిల్లా బేల మండలం చాప్రాలాలో 3.5 సెం.మీ, అలాగే కామారెడ్డి జిల్లా కేంద్రంలో 3.4 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా సాగునీటి ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉంది. గోదావరి, కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లోని ఉపనదులు ఉధృతంగా ప్రవహించే ఆస్కారం ఉండటంతో నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాల వల్ల విద్యుత్ స్తంభాలు కూలిపోవడం, చెట్లు విరిగిపడటం వంటి సంఘటనలు జరిగే అవకాశం ఉన్నందున.. విద్యుత్ శాఖ సిబ్బందిని ఎమర్జెన్సీ సేవల కోసం సిద్ధంగా ఉంచారు. నగరాలు, పట్టణాల్లోని మునిసిపల్ అధికారులు డ్రైనేజీ వ్యవస్థలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రయాణాలు చేసే వారు వాతావరణ సూచనలను గమనించి, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
Also Read
తాజావార్తలు
-
OTR : కాంగ్రెస్లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
-
Temple Theft : నిర్మల్లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
-
OTR : బీఆర్ఎస్లో కొండా సురేఖకు ‘నో ఎంట్రీ’
-
OTR : కావలిలో క్రెడిట్ వార్.. ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!