Colombia : ‘అమ్మ చనిపోయింది..ఆకలిగా ఉంది’ అడవిలో తప్పిపోయిన చిన్నారి తొలిమాటలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Colombia Plane Crash:’నాకు ఆకలిగా ఉంది, మా అమ్మ చనిపోయింది’. కొలంబియాలోని దట్టమైన అమెజాన్ అడవిలో 40 రోజుల తర్వాత రక్షించబడిన నలుగురు చిన్నారుల్లో ఒకరి మాటలివి. నలుగురు పిల్లలలో ఆమె తన తల్లిదండ్రులకు పెద్ద కుమార్తె. చిన్నారి వయసు కేవలం 13 సంవత్సరాలు. ఈ చిన్నారులు తమ తల్లితో కలిసి మే 1న చిన్న విమానంలో ప్రయాణిస్తుండగా అది అమెజాన్ అడవిలో కూలిపోయింది. విమానం కూలిన తర్వాత వారు అడవిలో కనిపించకుండా పోయాడు. ఆ ప్రమాదంలోనే వారి తల్లి మరణించింది. నెల రోజులకు పైగా దట్టమైన అడవిలో ఒంటరిగా తిరుగుతున్న ఈ నలుగురు చిన్నారులు శుక్రవారం దొరికారు. అడవి నుంచి బయటకు తీసుకొచ్చిన ఈ చిన్నారులను నేరుగా ఆర్మీ ఆస్పత్రిలో చేర్పించారు.
Read Also:Adipurush: ‘ఆదిపురుష్’ టికెట్ రేట్లు పెంచండి ప్లీజ్.. ఏపీ సీఎంను కోరనున్న నిర్మాతలు?
Also Read
- YS Jagan: ఆక్వా రైతుల కష్టాలు నాకు తెలుసు.. సిండికేట్ను కూకటివేళ్లతో పెకలిస్తా!
- 12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
కాగా, రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న నికోలస్ ఆర్డోనెజ్ గోమెస్ (Nicolas Ordonez Gomes).. పబ్లిక్ ప్రసార ఛానెల్ ఆర్టీవీసీతో మాట్లాడుతూ.. పిల్లల్ని కలిసిన తర్వాత మొదటి క్షణాలను వివరించారు. నలుగురు పిల్లల్లో పెద్దమ్మాయి లెస్లీ వయసు 13 ఏళ్లు. ఆమె ఒక ఏడాది వయసుగల చిన్నారిని ఎత్తుకుని పరుగులు తీస్తూ తన వద్దకు వచ్చిందని చెప్పారు. లెస్లీ తన వద్దకు వచ్చి మొట్టమెదటగా ‘నాకు ఆకలి వేస్తోంది’ అని చెప్పిందన్నారు. ఇద్దరు అబ్బాయిల్లో ఒకరు పడుకొని ఉన్నారని.. అందులో ఒకరు లేచి ‘మా అమ్మ చనిపోయింది’ అని చెప్పాడు’అని నికోలస్ వివరించారు. వారి మాటలు విన్న తాము వెంటనే పిల్లల్ని సముదాయించే ప్రయత్నం చేసినట్లు చెప్పారు. ‘మేం మీ స్నేహితులం. మమ్మల్ని మీ కుటుంబ సభ్యులే పంపించారు. మీ నాన్న, మీ అంకుల్ పంపించారు’ అని పిల్లల్తో చెప్పినట్లు నికోలస్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో ఈ చిన్నారుల తండ్రి విమానంలో లేకపోవడం యాదృచ్ఛికం. ఇప్పుడు వారి పోషణ బాధ్యత అంతా తండ్రి భుజస్కందాలపైకి వచ్చింది. విమానంలో వారి తల్లితో పాటు మరో ఇద్దరు మరణించారు. ప్రమాదం తర్వాత ఆర్మీ సిబ్బంది అందరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ పిల్లలు అక్కడ నుండి కనిపించకుండా ముందుకు వెళ్లిపోయారు. కాబట్టి వారిని ఆ సమయంలో రక్షించలేకపోయారు.
తాజావార్తలు
-
Pawan Kalyan: ముంబై హాస్పిటల్ నుంచి పవన్ కళ్యాణ్ డిశ్చార్జ్
-
Casting Couch: ‘బట్టలు విప్పమన్నారు’.. కాస్టింగ్ కౌచ్పై నటి శ్వేతా క్వాత్రా షాకింగ్ వ్యాఖ్యలు
-
YS Jagan: ఆక్వా రైతుల కష్టాలు నాకు తెలుసు.. సిండికేట్ను కూకటివేళ్లతో పెకలిస్తా!
-
Toxic Effect: యశ్ ‘టాక్సిక్’ ఎఫెక్ట్.. శ్రద్ధా కపూర్ సినిమాకూ రిలీజ్ డేట్ మార్పు తప్పదా?
-
Akshay Kumar: నవ్వులు కాదు.. ఈసారి భయపెట్టేందుకు వస్తున్న అక్షయ్ కుమార్… ఈరోజే ‘హైవానియత్’ టీజర్
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!