Colombia : ‘అమ్మ చనిపోయింది..ఆకలిగా ఉంది’ అడవిలో తప్పిపోయిన చిన్నారి తొలిమాటలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Colombia Plane Crash:’నాకు ఆకలిగా ఉంది, మా అమ్మ చనిపోయింది’. కొలంబియాలోని దట్టమైన అమెజాన్ అడవిలో 40 రోజుల తర్వాత రక్షించబడిన నలుగురు చిన్నారుల్లో ఒకరి మాటలివి. నలుగురు పిల్లలలో ఆమె తన తల్లిదండ్రులకు పెద్ద కుమార్తె. చిన్నారి వయసు కేవలం 13 సంవత్సరాలు. ఈ చిన్నారులు తమ తల్లితో కలిసి మే 1న చిన్న విమానంలో ప్రయాణిస్తుండగా అది అమెజాన్ అడవిలో కూలిపోయింది. విమానం కూలిన తర్వాత వారు అడవిలో కనిపించకుండా పోయాడు. ఆ ప్రమాదంలోనే వారి తల్లి మరణించింది. నెల రోజులకు పైగా దట్టమైన అడవిలో ఒంటరిగా తిరుగుతున్న ఈ నలుగురు చిన్నారులు శుక్రవారం దొరికారు. అడవి నుంచి బయటకు తీసుకొచ్చిన ఈ చిన్నారులను నేరుగా ఆర్మీ ఆస్పత్రిలో చేర్పించారు.
Read Also:Adipurush: ‘ఆదిపురుష్’ టికెట్ రేట్లు పెంచండి ప్లీజ్.. ఏపీ సీఎంను కోరనున్న నిర్మాతలు?
Also Read
- Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
- CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
- Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
కాగా, రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న నికోలస్ ఆర్డోనెజ్ గోమెస్ (Nicolas Ordonez Gomes).. పబ్లిక్ ప్రసార ఛానెల్ ఆర్టీవీసీతో మాట్లాడుతూ.. పిల్లల్ని కలిసిన తర్వాత మొదటి క్షణాలను వివరించారు. నలుగురు పిల్లల్లో పెద్దమ్మాయి లెస్లీ వయసు 13 ఏళ్లు. ఆమె ఒక ఏడాది వయసుగల చిన్నారిని ఎత్తుకుని పరుగులు తీస్తూ తన వద్దకు వచ్చిందని చెప్పారు. లెస్లీ తన వద్దకు వచ్చి మొట్టమెదటగా ‘నాకు ఆకలి వేస్తోంది’ అని చెప్పిందన్నారు. ఇద్దరు అబ్బాయిల్లో ఒకరు పడుకొని ఉన్నారని.. అందులో ఒకరు లేచి ‘మా అమ్మ చనిపోయింది’ అని చెప్పాడు’అని నికోలస్ వివరించారు. వారి మాటలు విన్న తాము వెంటనే పిల్లల్ని సముదాయించే ప్రయత్నం చేసినట్లు చెప్పారు. ‘మేం మీ స్నేహితులం. మమ్మల్ని మీ కుటుంబ సభ్యులే పంపించారు. మీ నాన్న, మీ అంకుల్ పంపించారు’ అని పిల్లల్తో చెప్పినట్లు నికోలస్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో ఈ చిన్నారుల తండ్రి విమానంలో లేకపోవడం యాదృచ్ఛికం. ఇప్పుడు వారి పోషణ బాధ్యత అంతా తండ్రి భుజస్కందాలపైకి వచ్చింది. విమానంలో వారి తల్లితో పాటు మరో ఇద్దరు మరణించారు. ప్రమాదం తర్వాత ఆర్మీ సిబ్బంది అందరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ పిల్లలు అక్కడ నుండి కనిపించకుండా ముందుకు వెళ్లిపోయారు. కాబట్టి వారిని ఆ సమయంలో రక్షించలేకపోయారు.
తాజావార్తలు
-
Peddi : అప్పటి నుంచే జాన్వీ సీన్లు కట్ చేసిన ‘పెద్ది’!
-
Anasuya: నా గొంతు నొక్కేయాలని చూశారు.. భరించలేకే జబర్దస్త్ నుంచి బయటకొచ్చా?
-
Digital Arrest Scam: ముందు కాల్ వస్తుంది.. తర్వాత వీడియో కాల్.. చివరికి ఖాతాలోని డబ్బంతా మాయం!
-
Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
-
CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!