Adipurush: ‘ఆదిపురుష్’ టికెట్ రేట్లు పెంచండి ప్లీజ్.. ఏపీ సీఎంను కోరనున్న నిర్మాతలు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adipurush ticket price hike in Andhra Pradesh: ప్రభాస్ రాముడిగా కృతి సనన్ సీతగా నటిస్తున్న ఆదిపురుష్ సినిమా మరో నాలుగు రోజుల్లో అంటే జూన్ 16న రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతోంది. అయితే ఇంకా రోజుల వ్యవధి ఉన్నా సోషల్ మీడియాలో , మీడియాలో ఈ ఆదిపురుష్ మేనియా పెద్ద ఎత్తున కనిపిస్తుంది. ఈ సినిమాను ముందు తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ సన్నిహితులకు చెందిన యూవీ క్రియేషన్స్ సంస్థ రిలీజ్ చేయాలని అనుకున్నా ఎందుకో చివరి నిముషంలో అయితే వెనక్కి తగ్గింది. ఇక యూవీ క్రియేషన్స్ నుంచి సుమారు 185 కోట్ల రూపాయలు వెచ్చించి మరీ దక్కించుకున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో గట్టిగా ప్రమోట్ చేస్తోంది. ముఖ్యంగా డైరెక్టర్ ఓం రౌత్ ప్రకటించక ముందే థియేటర్ లో ఒక సీటు హనుమంతుడి కోసం కేటాయిస్తున్నాం అంటూ ప్రకటించి కొత్త చర్చకు దారి తీసింది.
Also Read: Rajamouli: హీరోగా మారిన రాజమౌళి.. స్టైలిష్ లుక్ లో అదిరిపోయాడుగా
Also Read
- Rishab Shetty: రామాయణ ట్రైలర్కి ఫిదా అయిన రిషబ్ శెట్టి.. ఏం అన్నారంటే!
- LuckyBaskhar 2: దుల్కర్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘లక్కీ భాస్కర్ 2’ పక్కా, కానీ ఓ ట్విస్ట్ ఉంది!
- SIIMA 2026 Nominations: సైమా 2026 నామినేషన్స్ వచ్చేశాయ్.. తెలుగు నుంచి ఈ సినిమాదే హవా!
- Kajal Aggarwal: "అతను నా పర్మిషన్ లేకుండానే కారవాన్లోకి వచ్చాడు".. తర్వాత ఏం జరిగిందో చెప్పిన కాజల్ అగర్వాల్!
ఇక ఎప్పుడైతే ఈ ప్రకటన వచ్చిందో ఆ ప్రకటనకు అనుకూలంగా కొందరు వ్యతిరేకంగా కొందరు కామెంట్ చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు సిద్ధమయ్యారు. అయితే నిజానికి ఏపీలో సినిమా టికెట్ రేట్లు అక్కడి ప్రభుత్వం నియంత్రిస్తున్న సంగతి తెలిసిందే. డిఫాల్ట్ గా తక్కువ రేట్లకే సినిమాలు అందిస్తామని కొంత తక్కువకే సినిమా టికెట్ల అమ్మకాలు జరిపేలా చూస్తోంది అక్కడి ప్రభుత్వం. సినిమా భారీ బడ్జెట్ అయితే ప్రభుత్వానికి తమ బడ్జెట్ వివరాలు అందిస్తే కొంత పెంచి అమ్ముకునే అవకాశాలు కల్పిస్తోంది. ఆదిపురుష్ భారీ బడ్జెట్ సినిమా కావడంతో సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మతలు ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలిసి టికెట్ రేట్ పెంచమని కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: Adipurush: ఆ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు.. ఆదిపురుష్ టీమ్ క్లారిటీ
ఈ మేరకు యూవీ క్రియేషన్స్ వంశీ కృష్ణా రెడ్డి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వివేక్ కూచిభొట్ల ఈరోజు తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసులో వైఎస్ జగన్ ను కలవనున్నారని తెలుస్తోంది. అందుకోసం ఆయన అపాయింట్మెంట్ కోరగా అది ఖరారు అయినట్టు తెలుస్తోంది. మొత్తంగా టికెట్ రేట్ 50 రూపాయల వరకు పెంచి అమ్ముకునేలా అవకాశం కల్పించామని కోరనున్నట్టు చెబుతున్నారు. మరి చూడాలి వైఎస్ జగన్ ఈ ప్రతిపాదనను ఎలా అందించబోతున్నారు అనేది.
తాజావార్తలు
-
Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక లేరు.. చికిత్స పొందుతూ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
-
PM Modi: పార్లమెంట్ ఉభయ సభల్లో యాంటీ-పేపర్ లీక్ బిల్ పాస్.. మరో వీడియో విడుదల చేసిన ప్రధాని మోడీ
-
Vaibhav Sooryavanshi: ఆల్ రౌండర్గా వైభవ్ సూర్యవంశీ.. అందుకే వైస్ కెప్టెన్సీ బాధ్యతలు..
-
ICC World Cup: 2027 వరల్డ్ కప్ వేదిక నగరాల ప్రకటన.. మూడు దశల కొత్త ఫార్మాట్లో ఇలా..
-
Dehradun: ‘అత్తింటివారి మనస్తత్వం మారదు’.. వీడియో రికార్డ్ చేసి టీచర్ ఆత్మహత్య
ట్రెండింగ్
-
Alien Temple: ఏలియన్కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
Google Pixel 11 సిరీస్లో కొత్త ట్విస్ట్.. లాంచ్కు కీలక ఫీచర్స్ లీక్..!
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!