Adipurush: ‘ఆదిపురుష్’ టికెట్ రేట్లు పెంచండి ప్లీజ్.. ఏపీ సీఎంను కోరనున్న నిర్మాతలు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adipurush ticket price hike in Andhra Pradesh: ప్రభాస్ రాముడిగా కృతి సనన్ సీతగా నటిస్తున్న ఆదిపురుష్ సినిమా మరో నాలుగు రోజుల్లో అంటే జూన్ 16న రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతోంది. అయితే ఇంకా రోజుల వ్యవధి ఉన్నా సోషల్ మీడియాలో , మీడియాలో ఈ ఆదిపురుష్ మేనియా పెద్ద ఎత్తున కనిపిస్తుంది. ఈ సినిమాను ముందు తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ సన్నిహితులకు చెందిన యూవీ క్రియేషన్స్ సంస్థ రిలీజ్ చేయాలని అనుకున్నా ఎందుకో చివరి నిముషంలో అయితే వెనక్కి తగ్గింది. ఇక యూవీ క్రియేషన్స్ నుంచి సుమారు 185 కోట్ల రూపాయలు వెచ్చించి మరీ దక్కించుకున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో గట్టిగా ప్రమోట్ చేస్తోంది. ముఖ్యంగా డైరెక్టర్ ఓం రౌత్ ప్రకటించక ముందే థియేటర్ లో ఒక సీటు హనుమంతుడి కోసం కేటాయిస్తున్నాం అంటూ ప్రకటించి కొత్త చర్చకు దారి తీసింది.
Also Read: Rajamouli: హీరోగా మారిన రాజమౌళి.. స్టైలిష్ లుక్ లో అదిరిపోయాడుగా
Also Read
- Tollywood: షాక్ ఫ్యాక్టర్లు లీక్ ఫ్యాక్టర్లవుతుంటే ఎలా?
- Gudluri Ashok Babu: హీరోగా అవకాశం ఇస్తానంటూ రూ.3.5 కోట్ల మోసం.. 'భాగమతి' డైరెక్టర్పై కేసు నమోదు!
- Lenin : అఖిల్కు మాజీ వదిన కంగ్రాట్స్.. సోషల్ మీడియాలో సామ్ పోస్ట్ వైరల్
- Prabhas : 'ఫౌజీ' బిజినెస్ వేట షురూ.. భారీ రేటుకు నార్త్ ఇండియా, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్!
ఇక ఎప్పుడైతే ఈ ప్రకటన వచ్చిందో ఆ ప్రకటనకు అనుకూలంగా కొందరు వ్యతిరేకంగా కొందరు కామెంట్ చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు సిద్ధమయ్యారు. అయితే నిజానికి ఏపీలో సినిమా టికెట్ రేట్లు అక్కడి ప్రభుత్వం నియంత్రిస్తున్న సంగతి తెలిసిందే. డిఫాల్ట్ గా తక్కువ రేట్లకే సినిమాలు అందిస్తామని కొంత తక్కువకే సినిమా టికెట్ల అమ్మకాలు జరిపేలా చూస్తోంది అక్కడి ప్రభుత్వం. సినిమా భారీ బడ్జెట్ అయితే ప్రభుత్వానికి తమ బడ్జెట్ వివరాలు అందిస్తే కొంత పెంచి అమ్ముకునే అవకాశాలు కల్పిస్తోంది. ఆదిపురుష్ భారీ బడ్జెట్ సినిమా కావడంతో సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మతలు ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలిసి టికెట్ రేట్ పెంచమని కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: Adipurush: ఆ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు.. ఆదిపురుష్ టీమ్ క్లారిటీ
ఈ మేరకు యూవీ క్రియేషన్స్ వంశీ కృష్ణా రెడ్డి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వివేక్ కూచిభొట్ల ఈరోజు తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసులో వైఎస్ జగన్ ను కలవనున్నారని తెలుస్తోంది. అందుకోసం ఆయన అపాయింట్మెంట్ కోరగా అది ఖరారు అయినట్టు తెలుస్తోంది. మొత్తంగా టికెట్ రేట్ 50 రూపాయల వరకు పెంచి అమ్ముకునేలా అవకాశం కల్పించామని కోరనున్నట్టు చెబుతున్నారు. మరి చూడాలి వైఎస్ జగన్ ఈ ప్రతిపాదనను ఎలా అందించబోతున్నారు అనేది.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!