Children Died: నీటి గుంతలో పడి నలుగురు చిన్నారులు మృతి.. యూపీలోని హర్దోయ్ జిల్లాలో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గంగా ఎక్స్ప్రెస్వే కోసం తవ్విన గుంతల్లో పడి నలుగురు చిన్నారులు మృతిచెందారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని నలుగురి మృతదేహాలను నీటిలో నుంచి బయటకు తీశారు. మృతి చెందిన పిల్లలను చూసి చిన్నారుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అయితే ఈ చిన్నారులు మేకల మేత కోసం వెళ్లినట్లు బంధువులు తెలిపారు. చనిపోయిన పిల్లలందరూ దాదాపు 10 ఏళ్లలోపు వారే ఉన్నారు. మృతిచెందిన చిన్నారుల్లో.. అజ్మత్, సద్దాం, ఖుష్నుమా, ముస్తాకీమ్ ఉన్నారు. సమాచారం తెలుసుకున్న స్థానికులు.. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని గుంతలో నుంచి చిన్నారుల మృతదేహాలను బయటకు తీశారు.
Rains Effect: జీహెచ్ఎంసీ పరిధిలోని కార్యాలయాలు, విద్యాసంస్థలకు 2 రోజులు సెలవు
Also Read
ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ట్వీట్ ద్వారా విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం కూడా ప్రకటించారు. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా మెజిస్ట్రేట్, పోలీసు సూపరింటెండెంట్, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలన్నింటిని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టంకు తరలించినట్లు పోలీసు సూపరింటెండెంట్ తెలిపారు. మరోవైపు హర్దోయ్ జిల్లా మేజిస్ట్రేట్ మంగళ ప్రసాద్ సింగ్ మాట్లాడుతూ.. ఎక్స్ప్రెస్వే నిర్మాణం కోసం యుపిడిఎ మైనింగ్ చేసిందని తెలిపారు. వర్షపు నీరు చేరడంతో అందులో లోతైన నీరు నిలిచిందని.. గొయ్యి నీటిలో మునిగి చిన్నారులు మృతి చెందిన ఘటన విషాదకరమన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ సూచనల మేరకు ఆర్థిక సాయం చేస్తామని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!