Boy Fell Into Pit Dug: పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం.. నాలుగున్నరేళ్ల బాలుడు మృతి
- దివాన్ చెరువు గ్రామంలో పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం..
- మంచినీటి కుళాయి కోసం తవ్విన గోతిలో పడి బాలుడు మృతి..
- తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Boy Fell Into Pit Dug: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్ చెరువు గ్రామంలో పంచాయతీ అధికారుల నిర్లక్ష్యానికి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మంచినీటి కుళాయి కోసం తవ్విన గోతిలో పడి నాలుగున్నర ఏళ్లు బాలుడు శ్రీను మృతి చెందాడు. ఆడుకోవడానికి వెళ్లిన బాలుడు అనంతలోకల్లా కలిసిపోవడంతో దివాన్ చెరువు గ్రామంలో విషాదం అలుముకుంది. విషయం తెలిసిన వెంటనే అర్ధరాత్రి. జిల్లా కలెక్టర్ ఘటన స్థలానికి చేరుకుని మృతిని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వపరంగా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అయినప్పటికీ మృతుని కుటుంబానికి న్యాయం చేసే వరకు దహన కార్యక్రమాలు నిర్వహించడానికి గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.
Read Also: Leopards in Balapur: హైదరాబాద్లో చిరుతల కలకలం.. బాలాపూర్లో రెండు చిరుతలు..
Also Read
ఇక, కుటుంబ సభ్యులను పరామర్శించి ఎమ్మెల్యే బత్తుల బలరామ కృష్ణ… లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.. నిర్లక్ష్యం వహించిన స్థానిక పంచాయతీ అధికారులపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.. అర్థరాత్రి 12 గంటల ప్రాంతంలో శ్రీరాంపురం వెళ్లి మృతుని కుటుంబాన్ని పరామర్శించారు జిల్లా కలెక్టర్ ప్రశాంతి.. కుటుంబానికి ప్రభుత్వ పరంగా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా జిల్లాలో ఎక్కడ గుంటలు లేకుండా పూడ్చివేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు జిల్లా కలెక్టర్ ప్రశాంతి..
తాజావార్తలు
-
Bangladesh: ‘‘గంగా నది’’పైనే భారత సంబంధాలు ఆధారపడుతాయి..
-
VD Satheesan Oath Ceremony: రేపే కేరళంలో కొలువుదీరనున్న కొత్త సర్కార్.. ఛీప్ గెస్ట్లు వీరే!
-
IBomma Piracy: ఐబొమ్మ కథ ముగిసిందనుకుంటే.. మళ్లీ మొదలైందా? బాంబ్ పేల్చిన రవి!
-
Gold Theft: లవర్ సంతోషం కోసం అమ్మ నగలు అమ్మేశాడు.. అసలేం జరిగిందంటే!
-
West Bengal: టీఎంసీ ఆఫీస్లో వందలాది ఆధార్ కార్డులు.. బెంగాల్లో సంచలనం!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..