Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్పై అనర్హత వేటు.. పార్లమెంటుకు ఐదేళ్లు దూరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Imran Khan: పాక్ మాజీ ప్రధాని, ప్రతిపక్ష పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ఖాన్కు రాజకీయగా చుక్కెదురైంది. తోషాఖానా కేసులో ఆయనపై పాకిస్తాన్ ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. కానుకల అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయ వివరాలను దాచిపెట్టిన కేసులో ఈ మేరకు చర్యలు చేపట్టింది. ఫలితంగా ఇమ్రాన్ఖాన్ ఐదేళ్లపాటు ఆయన పార్లమెంట్ సభ్యుడు అయ్యేందుకు వీలు లేకుండా పోయింది.
ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రధానిగా ఉండగా.. ఇతర దేశాల అధినేతలు, ప్రతినిధులు ఇచ్చిన కానుకలను ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ‘తోషాఖానా’ నుంచి తక్కువ ధరకు ఇమ్రాన్ కొనుగోలు చేశారు. వాటిని విక్రయించడం ద్వారా ఎంత వచ్చిందనే వివరాల్ని ఆయన బయటపెట్టలేదని ఆరోపిస్తూ కొందరు పాకిస్తాన్ చట్టసభ్యులు ఆ దేశ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇమ్రాన్ను అనర్హునిగా ప్రకటించాలని కోరారు. ఈ నేపథ్యంలో దీనిపై ఐదుగురు సభ్యుల కమిటీ విచారణ చేపట్టింది. వాటిలో లగ్జరీ వాచీలు, ఆభరణాలు, డిజైనర్ హ్యాండ్బ్యాగ్లు, పెర్ఫ్యూమ్లు ఉన్నాయని.. కొన్ని బహుమతులు లేదా వాటిని విక్రయించడం ద్వారా వచ్చిన లాభాన్ని ప్రకటించడంలో ఖాన్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నుల్లో చూపలేదు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఇమ్రాన్పై అనర్హత వేటు వేసింది.
Also Read
- Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
- Monsoon 2026: ఆ రాష్ట్రాలకు భారీ ముప్పు.. శని, ఆదివారాల్లో అత్యంత భారీ వర్షాలు.. ఐఎమ్డీ హై అలర్ట్!
- Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
- Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
పలు కానుకల్ని రూ.2కోట్ల 15 లక్షల 60వేలకు తోషాఖానా నుంచి కొనుగోలు చేసినట్లు పాక్ ఎన్నికల సంఘానికి విచారణ సమయంలో ఇమ్రాన్ఖాన్ తెలిపారు. వాటిని విక్రయిస్తే రూ.5కోట్ల 80లక్షలు వచ్చినట్లు సమాచారం. అవినీతి నిరోధక చట్టం కింద ఆయనపై చర్యలు తీసుకుంటామని ఈసీ వెల్లడించింది. ఎన్నికల సంఘం నిర్ణయం వల్ల ఇమ్రాన్ పార్లమెంట్ నుంచి ఐదేళ్ల పాటు అనర్హత వేటుకు గురయ్యారుయ ఐదేళ్ల వరకు పార్లమెంట్ ఎన్నికకు ఆయన అనర్హుడు. అయిదేళ్ల నిషేధం పూర్తి అయ్యే వరకు పాక్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 63 (1) (p) ప్రకారం పార్లమెంట్కు కానీ, అసెంబ్లీకి కానీ ఇమ్రాన్ పోటీ చేయరాదు. ఒకవేళ ఎన్నికైనా, లేదా ఎంపికైనా .. దానికి అర్హత ఉండదు.
Iqbal Mehmood: ఏఐఎంఐఎం బీజేపీకి బీ టీమ్.. నిజమైన ముస్లిం ఆ పార్టీకి ఓటు వేయరు..
ఎన్నికల సంఘం ఇచ్చిన తీర్పును ఇమ్రాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ ఖండించింది. ఇమ్రాన్ను ఎవరూ అనర్హుడిగా ప్రకటించలేరని, కేవలం ప్రజలు మాత్రమే ఆ తీర్పు ఇవ్వగలరని పీటీఐ నేతలు తెలిపారు. తోషాఖానా శాఖను 1974లో ఏర్పాటు చేశారు. విదేశీ నేతలు ఇచ్చే ఖరీదైన బహుమతుల్ని ఆ శాఖ తమ ఆధీనంలో ఉంచుకుంటుంది. ఎవరికి బహుమతులు వచ్చినా ఆ విషయాన్ని కేబినెట్కు చెప్పాల్సి ఉంటుంది. కానీ పీటీఐ ప్రభుత్వం హయాంలో ఇమ్రాన్కు వచ్చిన బహుమతుల లెక్క తేలలేదు. ప్రధానిగా ఉన్న సమయంలో నాలుగు బహుమతుల్ని అమ్ముకున్నట్లు ఇమ్రాన్ కేసు విచారణ సందర్భంగా ఒప్పుకున్నారు.
తాజావార్తలు
-
Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
-
Tecno Pova 8: టెక్నో పోవా 8 రిలీజ్ కు రెడీ.. 8000mAh బ్యాటరీ.. గేమింగ్, మల్టీమీడియా యూజర్లకు బెస్ట్!
-
Monsoon 2026: ఆ రాష్ట్రాలకు భారీ ముప్పు.. శని, ఆదివారాల్లో అత్యంత భారీ వర్షాలు.. ఐఎమ్డీ హై అలర్ట్!
-
Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
-
Bi-Monthly Salary: నెలలో రెండుసార్లు జీతాలు? ఇండియాలో శాలరీలు ఇచ్చే విధానం మారనుందా?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!