Srinivas Goud: కాలువలు తవ్వమంటే గతాన్ని తవ్వుతున్నారు.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు
- తెలంగాణ భవన్లో మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం.
- కాలువలు తవ్వమంటే గతాన్ని తవ్వుతున్నారని కీలక వ్యాఖ్యలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srinivas Goud: తెలంగాణ భవన్లో మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మీడియాతో నేడు మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు ఆయన. కాంగ్రెస్ నాయకులు రాష్ట్రానికి సాగునీటి రంగంలో చేసిన అన్యాయాలను గుర్తుచేస్తూ, వాటిని తవ్వితే పుట్టల నుంచి పాములు బయటకు వస్తాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు కాలువలు తవ్వమంటే గతాన్ని తవ్వుతున్నారు. తెలంగాణకు సాగునీటి రంగంలో కాంగ్రెస్ చేసిన పాపాలు తవ్వితే అన్ని విపత్తులుగా బయట పడతాయని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఇకపోతే, బ్రిజేష్ ట్రిబ్యునల్ తాజా మధ్యంతర ఉత్తర్వులు ముమ్మాటికి సీఎం కేసీఆర్ విజయమని ఆయన అన్నారు. విభజన చట్టం సెక్షన్ 89 ప్రకారం కృష్ణా జలాల పంపిణీకి కాంగ్రెస్ ప్రభుత్వం కారణమైందని, కానీ కేసీఆర్ అందుకు అంగీకరించలేదని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజులకే సెక్షన్ 3 ప్రకారం నీటి పంపిణీ జరగాలని కేంద్రానికి లేఖ రాశారని శ్రీనివాస్ గౌడ్ గుర్తుచేశారు.
Also Read: Ganja Smuggling: ఓయో రూంలో గంజాయి దుకాణం పెట్టిన కేటుగాళ్లు
Also Read
- Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
- Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. కేసీఆర్ ను విమర్శిస్తూనే ఉంటే ప్రజలు నవ్వుకుంటారని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కర్ణాటకలో ప్రాజెక్టులు శరవేగంగా పూర్తి అవుతున్నప్పటికీ, ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆరోపించారు. కేసీఆర్ అభివృద్ధి చేయలేదని ఆరోపిస్తున్న మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిజంగా ధైర్యం ఉంటే తమ పదవులకు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో గెలవాలని శ్రీనివాస్ గౌడ్ సవాల్ విసిరారు. విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రం సాగునీటి హక్కులపై పెద్దగా దృష్టి పెట్టిందని, కేసీఆర్ నాయకత్వంలో సాగునీటి సమస్యలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. తాజా రాజకీయ పరిణామాల నేపధ్యంలో ఈ వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించనున్నాయి.
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!