Srinivas Goud: కాలువలు తవ్వమంటే గతాన్ని తవ్వుతున్నారు.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు
- తెలంగాణ భవన్లో మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం.
- కాలువలు తవ్వమంటే గతాన్ని తవ్వుతున్నారని కీలక వ్యాఖ్యలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srinivas Goud: తెలంగాణ భవన్లో మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మీడియాతో నేడు మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు ఆయన. కాంగ్రెస్ నాయకులు రాష్ట్రానికి సాగునీటి రంగంలో చేసిన అన్యాయాలను గుర్తుచేస్తూ, వాటిని తవ్వితే పుట్టల నుంచి పాములు బయటకు వస్తాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు కాలువలు తవ్వమంటే గతాన్ని తవ్వుతున్నారు. తెలంగాణకు సాగునీటి రంగంలో కాంగ్రెస్ చేసిన పాపాలు తవ్వితే అన్ని విపత్తులుగా బయట పడతాయని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఇకపోతే, బ్రిజేష్ ట్రిబ్యునల్ తాజా మధ్యంతర ఉత్తర్వులు ముమ్మాటికి సీఎం కేసీఆర్ విజయమని ఆయన అన్నారు. విభజన చట్టం సెక్షన్ 89 ప్రకారం కృష్ణా జలాల పంపిణీకి కాంగ్రెస్ ప్రభుత్వం కారణమైందని, కానీ కేసీఆర్ అందుకు అంగీకరించలేదని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజులకే సెక్షన్ 3 ప్రకారం నీటి పంపిణీ జరగాలని కేంద్రానికి లేఖ రాశారని శ్రీనివాస్ గౌడ్ గుర్తుచేశారు.
Also Read: Ganja Smuggling: ఓయో రూంలో గంజాయి దుకాణం పెట్టిన కేటుగాళ్లు
Also Read
- INDIA alliance: INDIA కూటమికి వరుస షాకులు.. డీఎంకే తర్వాత ఉద్ధవ్ సేన కూడా దూరం?
- Defence Powers: సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు.. ఎంత వరకు ఖర్చు చేయొచ్చంటే..!
- AP Govt: ఏటా రూ.28,000 కోట్ల ఎగుమతులు.. ఆక్వా రంగంలో ఏపీ నయా రికార్డ్..
- Su-57 fighter jet: భారత్కు పుతిన్ బిగ్ ఆఫర్.. Su-57 స్టెల్త్ ఫైటర్పై కీలక ప్రతిపాదన..
ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. కేసీఆర్ ను విమర్శిస్తూనే ఉంటే ప్రజలు నవ్వుకుంటారని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కర్ణాటకలో ప్రాజెక్టులు శరవేగంగా పూర్తి అవుతున్నప్పటికీ, ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆరోపించారు. కేసీఆర్ అభివృద్ధి చేయలేదని ఆరోపిస్తున్న మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిజంగా ధైర్యం ఉంటే తమ పదవులకు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో గెలవాలని శ్రీనివాస్ గౌడ్ సవాల్ విసిరారు. విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రం సాగునీటి హక్కులపై పెద్దగా దృష్టి పెట్టిందని, కేసీఆర్ నాయకత్వంలో సాగునీటి సమస్యలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. తాజా రాజకీయ పరిణామాల నేపధ్యంలో ఈ వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించనున్నాయి.
తాజావార్తలు
-
INDIA alliance: INDIA కూటమికి వరుస షాకులు.. డీఎంకే తర్వాత ఉద్ధవ్ సేన కూడా దూరం?
-
Bolla Brahmanayudu : గండిపేట భూముల స్కామ్లో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్!
-
Defence Powers: సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు.. ఎంత వరకు ఖర్చు చేయొచ్చంటే..!
-
AP Govt: ఏటా రూ.28,000 కోట్ల ఎగుమతులు.. ఆక్వా రంగంలో ఏపీ నయా రికార్డ్..
-
Su-57 fighter jet: భారత్కు పుతిన్ బిగ్ ఆఫర్.. Su-57 స్టెల్త్ ఫైటర్పై కీలక ప్రతిపాదన..
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!