Somireddy: ముఖ్యమంత్రి పాదాల క్రింద గనుల శాఖ నలిగిపోతోంది..
నెల్లూరు జిల్లాలో అక్రమాలు, దోపిడీలే కాకుండా ఎన్నికలలోపు వేల కోట్ల రూపాయలు దోపిడీకి వైసీపీ నేతలు తెర తీశారు అంటూ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. క్వార్ట్జ్ ఖనిజానికి ఇతర దేశాల్లో డిమాండ్ ఉండటంతో వైసిపీ నేతలు అక్రమ మైనింగ్ చేస్తున్నారు.. ముఖ్యమంత్రి పాదాల క్రింద గనుల శాఖ నలిగిపోతోంది అని ఆయన మండిపడ్డారు. వేమిరెడ్డి, ఆదాల, మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ లు కలిసి జిల్లాను దోచేస్తున్నారు అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Pakistan vs Afghanistan: పాకిస్థాన్ను 250 పరుగులు కూడా చేయనివ్వం: అఫ్గాన్ కెప్టెన్
Also Read
- Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
- Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
- GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
- Riyan parag: బీసీసీఐ జరిమానా విధించిన మరుసటి రోజే.. విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్..
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ప్రస్తుత మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి బృందం మైనింగ్ వ్యాపారం చేస్తోంది వాస్తవం కాదా అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. వైసిపీ వాళ్లు చేస్తూ టీడీపీ నేతలపై బురద చల్లుతున్నారు అంటూ ఆయన ధ్వజమెత్తారు. వైసిపీ పాలనలో టీడీపీ నేతలు కనీసం కుల ధ్రువీకరణ పత్రం కూడా తీసుకోలేకుంటే.. మైన్స్ దోపిడీ సాధ్యమా అని ఆయన అడిగారు. సైదాపురంలో 150 హిటాచీలు, వందల టిపర్లు పని చేస్తున్నాయి.. ఒక్క మైన్ కి కూడా లీజు లేకుండా దోచి స్టాక్ పాయింట్స్ ఏర్పాటు చేస్తున్నారు అంటూ టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు.
Read Also: Etala Rajender: కాళేశ్వరం అన్ని పిల్లర్ లను చెక్ చేస్తే.. ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అనేది తేలుతుంది…
మైన్స్ దోపిడీ చేసి వచ్చే డబ్బుతో రాబోయే ఎన్నికలు చేయాలని వైసీపీ పార్టీ చూస్తోందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెల్లడించారు. అనిల్ కుమార్ యాదవ్ పిట్టకథలు చెపుతున్నారు.. ఎవరు దోపిడీదారులో అనిల్ కుమార్ రుజువు చేయాలి.. రుజువు చేయలేక పోతే తెలుగు దేశం పార్టీ నేతలపై చేసిన ఆరోపణలకు అనిల్ కుమార్ యాదవ్ క్షమాపణ చెప్పాలి అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!