Etala Rajender: కాళేశ్వరం అన్ని పిల్లర్ లను చెక్ చేస్తే.. ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అనేది తేలుతుంది…
Etala Rajender: కాళేశ్వరం అన్ని పిల్లర్ లను చెక్ చేస్తే తప్ప ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అనేది తేలుతుందని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఇంతకు ముందు కట్టిన ప్రాజెక్ట్ లు ఏవి దెబ్బ తినలేదని గుర్తు చేశారు. కానీ కేసీఆర్ సర్కార్ నిర్మించిన కాళేశ్వరం మూడు ప్రాజెక్ట్ లు దెబ్బతిన్నాయని మండిపడ్డారు. సెలక్ట్ చేసిన సైట్ కూడా కరెక్ట్ కాదు.. సాయిల్ టెస్ట్ కూడా సరిగా చేయలేదన్నారు. రికార్డ్ కోసం నిర్మించారు… గొప్పలు చెప్పుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష్మి బ్యారేజ్ ను ఇసుక మీద కట్టారని మండిపడ్డారు.
అన్ని పిల్లర్ లను చెక్ చేస్తే తప్ప ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అనేది తేలుతుందన్నారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నీళ్ళు వదలడంతో మోటర్ లు, గోర్లు, బర్లు కొట్టుకు పోయాయని మండిపడ్డారు. మనషులు ఉంటే పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. ప్రజలకు సమాచారం ఇవ్వకుండా.. తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన మోడల్ ప్రకారం నిర్మంచామని మాకు సంబంధం లేదని కాంట్రాక్టర్ లు అంటున్నారని తెలిపారు. కేసీఆర్ లక్ష కోట్లు గంగ పాలు చేశారని నిప్పులు చెరిగారు. దీనికి ప్రధాన కారకుడు కేసీఆర్ అన్నారు. పూర్తి బాధ్యత వహించి కేసీఆర్ రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై శ్వేత పత్రం విడుదల చేయాలని అన్నారు.
Also Read
- Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
- IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
- Renault Bridger: పెట్రోల్ నుంచి CNG, EV వరకు.. భారీ ప్లాన్తో వస్తున్న రెనాల్ట్ బ్రిడ్జర్
- Hero Splendor: సేల్స్ లో గర్జిస్తున్న స్ల్పెండర్ ప్లస్.. FY26 బెస్ట్ సెల్లింగ్ బైక్స్ టాప్ 5 లిస్ట్ ఇదే
లక్ష్మి బ్యారేజ్ కుంగి పోవడానికి కారణం డిజైన్ లోపమే అని బీజేపీ నేత కొండ విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. సైన్స్ కి వ్యతిరేకంగా కాళేశ్వరం ప్రాజెక్టు లను డిజైన్ చేశారని మండిపడ్డారు. అన్ని విధాలుగా ఆప్రాజెక్ట్ ను కేంద్ర ప్రభుత్వం చెక్ చేస్తుందన్నారు. కేంద్రానికి లేఖ రాస్తున్నామన్నారు. ఇంజనీరింగ్ తప్పుపై.. దీని మీద చర్యలు తప్పకుండా ఉంటాయని తెలిపారు.
కాలేశ్వరం డ్యాం సేఫ్టీ పై కేంద్రం ఆరా తీస్తుంది. మెడిగడ్డ బ్యారేజ్ లో 15వ నెంబర్ పిల్లర్ నుంచి 20 వ నెంబర్ పిల్లర్ కుంగిన నేపథ్యంలో కేంద్రం తనిఖీ చేపట్టింది.
డ్యామ్ సేఫ్టీని పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. కేంద్ర జలవనరుల సంఘం సభ్యుడు అనిల్ జైన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీ పర్యవేక్షించనున్నారు. నేడు తెలంగాణ ఇరిగేషన్ అధికారులతో కేంద్ర అధికారుల బృందం సమావేశం కానున్నారు. రేపు కాలేశ్వరం డ్యామ్ ను కేంద్ర బృందం సందర్శించనున్నారు. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి అధికారుల బృందం నివేదిక సమర్పించనున్నారు.
Chandrababu: చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్
తాజావార్తలు
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
-
Seshachalam Forest : శేషాచలం అడవుల్లో కార్చిచ్చు.. జీవకోన ప్రాంతంలో ఎగిసిపడుతున్న మంటలు.!
-
GWMC : ఓరుగల్లు బల్దియాకు బాస్ ఎక్కడ.?
-
Salim Dola: టర్కీలో దొరికిన దావూద్ రైట్ హ్యాండ్.. భారత్ మాస్టర్ ప్లాన్ హిట్!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!