Niranjan Reddy: రైతుబంధు ఎప్పుడు ఇస్తారని మమ్మల్ని జనం అడుగుతున్నారు..
- కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్ర విమర్శలు
- ఎన్నికల ముందు కూతలు.. అధికారంలోకి వచ్చాక కోతలు- నిరంజన్ రెడ్డి
- రైతుబంధు ఎప్పుడు ఇస్తారని జనం మమ్మల్ని అడుగుతున్నారు- నిరంజన్ రెడ్డి
- ఎన్నికల ప్రచారంలో రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ చెప్పింది- నిరంజన్ రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈరోజు ఆయన తెలంగాణ భవన్లో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కూతలు… ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కోతలు అని విమర్శించారు. మరోవైపు.. రైతుబంధు ఎప్పుడు ఇస్తారని జనం తమను అడుగుతున్నారని నిరంజన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో రుణమాఫీ అంతా చేస్తామని కాంగ్రెస్ చెప్పిందని.. 2018 కంటే ముందు మిగిలిన వ్యవసాయ రుణమాఫీ ఏం చేస్తరని కాంగ్రెస్ ప్రభుత్వంను అడుగుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఇస్తారా ? ఇవ్వరా ? చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అంతా మాఫీ చేస్తాం అని కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదని తెలిపారు. రైతుల రుణాల వివరాలు చెప్పాలి.. ఎందుకు దాచి పెడుతున్నారు? అని ఆయన ప్రశ్నించారు.
Asaduddin Owaisi: ఓవైసీ ప్రమాణస్వీకారం.. లోక్సభలో దుమారం..
Also Read
రాష్ట్రంలోని అన్నదాతలకు ఈ వర్షాకాలం నుంచే రైతు భరోపా పథకం అమలు చేయాలని కోరారు. రైతులకు వెంటనే ఎకరానికి రూ. 7500 సాయం అందించాలన్నారు. కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తారా..? లేదా..? రైతు కూలీలకు 12 వేలు ఇస్తారా ? కౌలు రైతులకు 15 వేలు ఇస్తరా.. లేదా? కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలన్నారు. మహాలక్ష్మి పథకం ఏమైంది ?.. రేషన్ కార్డులు లేనివారికి కొత్తవి ఇస్తామని చెప్పారు. ఇప్పుడేమో అన్ని కొత్త రేషన్ కార్డులు ఇస్తామంటున్నారని నిరంజన్ రెడ్డి పేర్కన్నారు. ఏం చేయకుండానే రేవంత్ ప్రభుత్వం ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తుందని ఆరోపించారు. రుణమాఫీ చేసినట్టే సంబురాలు చేసుకోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు.
Thaman – Sree Leela: తిరుమల గుడిలో శ్రీ లీల బుగ్గ గిల్లిన తమన్
మరోవైపు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడంపై స్పందిస్తూ, ఆ ఇంటి కాకి.. ఈ ఇంటి మీద వాలితే కల్చేస్తా అని రేవంత్ రెడ్డి అన్నారని.. మరి ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి రేవంత్ ఎందుకు కండువా కప్పుతున్నారు.. కౌగిలించుకుంటున్నారని ప్రశ్నించారు. కొంత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకుంటే.. తెలంగాణ సోయి ఎక్కడ పోదని పేర్కొన్నారు. తమ దగ్గర నుంచి ఎమ్మెల్యేలు పోతే నష్టం ఏమి లేదని తెలిపారు. నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నా.. పోయినా బీఆర్ఎస్ తన పాత్ర పోషిస్తుందని నిరంజన్ రెడ్డి చెప్పారు.
తాజావార్తలు
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
-
Shreyas Iyer: “నీ వల్ల కాదు అంటే తట్టుకోలేను”.. విమర్శకులకు శ్రేయస్ అయ్యర్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
-
Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!