Jagadish Reddy: కృష్ణా, గోదావరి జలాల్లో వాటాపై మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..
- ఉత్తమ్ కుమార్వి చెత్త ఆరోపణలు
- నీటి వాటా కోసం తెలంగాణ ప్రభుత్వం కొట్లాడడం లేదు
- ఇంత నీటి దోపిడీ జరుగుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు
- మాజీ మంత్రి జగదీశ్రెడ్డి వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కృష్ణా గోదావరి జలాల్లో వాటాపై మాజీ మంత్రి జగదీశ్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. “ఉత్తమ్ కుమార్ చెత్త ఆరోపణలతో లాభం లేదు. ఆంధ్రప్రదేశ్ ఏ అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కట్టారు. నాగార్జునసాగర్ , శ్రీశైలం లో నీటి వాటా కోసం తెలంగాణ ప్రభుత్వం కొట్లాడడం లేదు. ఇంత నీటి దోపిడీ జరుగుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు
తెలంగాణలో తాగునీరుకి కష్టాలు వచ్చే పరిస్థితి ఏర్పడింది. తాగునీరు కోసం వాడాల్సిన నీటిని సాగు కోసం తరలించుకు పోతున్నారు. కృష్ణా గోదావరి జలాల్లో వాటా కంటే ఎక్కువ నీటిని ఏపీ తరలించుకు పోతుంది. కృష్ణా, గోదావరి ల నీళ్లు ఏపీ తరలించుకు పోతుంది అని హరీష్ రావు మాట్లాడారు. హరీష్ రావు ను విమర్శలు చేయడం మానేసి.. చంద్రబాబును కేంద్రాన్ని అడగండి. అవినీతి అని కాంగ్రెస్ మాట్లాడితే నవ్వు వస్తుంది. తెలంగాణకి అన్యాయం చేసింది కాంగ్రెస్ బీజేపీలే..” అని జగదీశ్రెడ్డి వాఖ్యానించారు.
READ MORE: Bird Flu: 95 గ్రామాలలో నాటుకోళ్లకు బర్డ్ ఫ్లూ.. లబోదిబోమంటున్న పెంపకం దారులు!
Also Read
ఇదిలా ఉండగా.. కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్లు పఖర్చు పెట్టిన ప్రాజెక్టు వాళ్ల హయాంలోనే కూలిపోయిందన్నారు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నిన్న ఆయన మాట్లాడుతూ.. ప్రాజెక్టు వల్ల నీళ్లు రాలేదు కానీ.. వాళ్ల జేబులు నిండాయన్నారు. కాళేశ్వరం కూలిపోయింది. పాలమూరు కింద ఒక్క ఎకరం ఆయకట్టు రాలేదని, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో పూర్తి వైఫల్యం చెందారని ఆయన మండిపడ్డారు. కృష్ణా వాటర్ లో తెలంగాణకు అన్యాయం జరగొద్దని.. కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ కు వివరించా అని, పదేండ్ల పాటు అధికారం లో ఉండి.. టెలిమెట్రిక్ ఏర్పాటు చేయలేక పోయారన్నారు. ఏపీ జల దోపిడీ కి సహకరించారని, పదేండ్ల పాటు తెలంగాణ కు కృష్ణా జలాల్లో అన్యాయం జరిగేలా నిర్ణయం తీసుకున్నారన్నారు. పాలమూరు రంగా రెడ్డి పూర్తి చేయలేదు. పదేండ్ల కాలంలో నీటి కేటాయింపులు సాధించలేదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. శ్రీశైలం, నాగార్జున సాగర్ రిపేర్ల ను కూడా మేమే ముందుకు తీసుకెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Patna High Court: ‘‘సల్వార్ తీయడం, ఛాతీ నొక్కడం’’.. రేప్ అటెంప్ట్ కేసుపై హైకోర్టు కీలక తీర్పు..
-
Income Tax Notice: ఇదెక్కడి పాపం.. రోజుకు రూ.400 సంపాదించే కూలీకి ఐటీ శాఖ షాక్! అసలు ట్విస్ట్ ఇదే
-
SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
-
IRCTC: రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్.. ఇక వేగంగా తత్కాల్!
-
Mudragada Padmanabham: ముద్రగడ పాడె మోసిన వైఎస్ జగన్.. అంత్యక్రియల్లో ఉద్రిక్తత
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!