Narayana Swamy: భారతదేశంలో ఉన్నామా.. లేక పాకిస్తాన్లో ఉన్నామా..? మాజీ డిప్యూటీ సీఎం ఫైర్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Narayana Swamy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు, చిన్న పిల్లలపై అఘాయిత్యాలను కూటమి ప్రభుత్వం అరికట్టలేకపోతున్నదంటూ చిత్తూరులో వైస్సార్సీపీ మహిళా విభాగం నేతలు అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత కూటమి ప్రభుత్వ తీరు చూస్తుంటే మనం భారతదేశంలో ఉన్నామా..? లేక పాకిస్తాన్లో ఉన్నామా..? అన్న అనుమానం కలుగుతోంది. ఏపీలో ప్రజలు నార్త్ కొరియా తరహా పాలనను అనుభవిస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు.
Read Also: Devineni Avinash: రాష్ట్రంలో పరిస్థితులు భయానకంగా మారుతున్నాయి.. దేవినేని అవినాష్ ఘాటు వ్యాఖ్యలు..!
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
గత సంవత్సరం కాలంలో రాష్ట్రంలో మహిళలపై, చిన్నారులపై జరిగిన దాడుల సంఖ్య విపరీతంగా పెరిగిందని నారాయణస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ మోహన్ రెడ్డి పాలనలో మహిళలకు గౌరవంగా, భద్రతగా ఉన్న కాలం సాగింది. కానీ ఇప్పుడు మహిళలు ఆత్మవిశ్వాసం కోల్పోయారని అన్నారు. అలాగే ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్ను నారాయణస్వామి ఖండించారు. ఐదు దశాబ్దాలుగా జర్నలిజంలో ఉన్న వ్యక్తిని చేయని తప్పుకు అరెస్ట్ చేయడం పూర్తిగా రాజకీయ కక్షసాధింపు చర్య అని అభిప్రాయపడ్డారు. ఒక డిబెట్లో గెస్ట్ అమరావతి మహిళలపై మాట్లాడిన మాటలకు జర్నలిస్టును ఎలా బాధ్యుణ్ణి చేయడం ఏంటని ప్రశ్నించారు. అంతేకాకుండా.. అదే డిబెట్లో గెస్ట్, జర్నలిస్ట్ ఇద్దరూ క్షమాపణలు చెప్పినట్లు తెలిపారు. ఆ ఛానెల్ యాజమాన్యం కూడా వ్యాఖ్యలను ఖండించినా, ఈ అరెస్ట్ చేయడం అర్థరహితం అన్నారు.
Read Also: Minister Kishan Reddy: అవినీతి రహిత పాలనకు నిదర్శన ప్రధాని మోడీ ప్రభుత్వం..!
ఎల్లో మీడియాల్లో వైఎస్ భారతి, విజయమ్మలపై అనేకమంది టీడీపీ నేతలు మాట్లాడారు. వారి మాటలకు యాంకర్లను, నేతలను అరెస్ట్ చేయలేదేం? అని ప్రశ్నించారు. వైస్సార్సీపీ చేపట్టిన వెన్నుపోటు దినోత్సవం ప్రజల్లో మంచి స్పందన పొందింది.. దాన్ని తప్పుదోవ పట్టించేలా డైవర్షన్ రాజకీయాల కోసం కొమ్మినేని వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారని అన్నారు. ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!