Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Kishan Reddy Highlights Modi Government 11 Years Of Achievements During Vijayawada Visit

Minister Kishan Reddy: అవినీతి రహిత పాలనకు నిదర్శన ప్రధాని మోడీ ప్రభుత్వం..!

Published Date :June 10, 2025 , 1:13 pm
By Kothuru Ram Kumar
Minister Kishan Reddy: అవినీతి రహిత పాలనకు నిదర్శన ప్రధాని మోడీ ప్రభుత్వం..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Minister Kishan Reddy: విజయవాడ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దేశంలో బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలను మాట్లాడుతూ.. గత 11 సంవత్సరాల్లో భారతదేశం అనేక రంగాల్లో అసాధారణ పురోగతి సాధించిందని స్పష్టం చేశారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఆయన “మోడీ ప్రభుత్వం 11 ఏళ్ల అభివృద్ధి ” కార్యక్రమాలపై పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఇంకా బీజేపీ నేతలు దేశ అభివృద్ధికి మోడీ పాలన ఎంత కీలకమైందో వివరించారు.

Read Also: Daggubati Purandeswari: ఐదేళ్లు రాక్షస పాలన చూసాం..!

కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. గత 11 ఏళ్లలో మోడీ ప్రభుత్వం మీద ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదని, ఇది దేశ ప్రజల నమ్మకానికి నిదర్శనమన్నారు. పేద, అణగారిన వర్గాలకు పెద్దపీట వేసేలా మోడీ పాలన ఉండిందని అన్నారు. రైతులు, యువత, మహిళలు ఈ నాలుగు ప్రధాన విభాగాల అభివృద్ధి కోసమే ప్రతి కార్యక్రమం రూపకల్పన చేశారని అన్నారు. భారతదేశం నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, ఇటీవలే 4 ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా మారిందని కిషన్ రెడ్డి తెలిపారు. పన్నుల వ్యవస్థలో సమగ్ర మార్పులు చేసి, జీఎస్టీ ద్వారా “వన్ నేషన్ వన్ ట్యాక్స్” లక్ష్యాన్ని సాధించామని తెలిపారు. 2014లో 6.91 కోట్ల పన్నులు కట్టే వారు ఉండగా, ఇప్పుడు 15.66 కోట్లకు పెరిగిందని వివరించారు.

అలాగే మోడీ ప్రభుత్వం రైతుల కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకుందని తెలుపుతూ.. వ్యవసాయ బడ్జెట్ 25,633 కోట్ల నుంచి 1.33 లక్షల కోట్లకు పెరిగిందని, 82% వరకు గిట్టుబాటు ధరలు పెరిగినట్లు వెల్లడించారు. 11 కోట్ల మంది రైతులకు ” కిసాన్ సమ్మాన్ నిధి ” ద్వారా ఏటా నేరుగా రైతు అకౌంట్ లోకి నగదు అందిస్తామని అన్నారు. అలాగే ఉగ్రవాదం విషయంలో జీరో టాలరెన్స్ పాలసీ అనుసరిస్తున్నామని చెప్పారు. పఠాన్ కోట్ సర్జికల్ స్ట్రైక్, పహల్గావ్ దాడి, ఆపరేషన్ సింధూర్ వంటి చర్యలు భారత్ శక్తిని చాటిచెప్పినట్టు పేర్కొన్నారు. బ్రహ్మోస్, బ్రహ్మాస్త్రం వంటి సామర్థ్యాలు దేశ రక్షణను మరింత బలంగా తీర్చిదిద్దాయని అన్నారు.

Read Also: Sonam Raghuwanshi: భర్తతో సన్నిహితంగా ఉండలేకపోతున్నా.. ప్రియుడికి మెసేజ్ పెట్టిన సోనమ్

మరోవైపు దేశంలో అమృత్ భారత్ పథకం కింద 1300 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తుండగా.. 1.46 లక్షల కి.మీ. జాతీయ రహదారులు, 7.7 లక్షల కిమీ గ్రామీణ రహదారులు నిర్మించామని చెప్పారు. రైల్వే బడ్జెట్ 29,056 కోట్ల నుంచి 2.42 లక్షల కోట్లకు పెరిగిందని, 136 వందే భారత్ రైళ్లు ప్రారంభించామని వివరించారు. ఇక ఉడాన్ స్కీం ద్వారా సామాన్యులకూ విమానయానాన్ని అందుబాటులోకి తెచ్చామని, 2014లో 71 విమానాశ్రయాలు ఉండగా.. ఇప్పుడు 159కి పెరిగినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 26 AIIMS ఆసుపత్రులు ఇప్పటికే పనిచేస్తుండగా, మరో 15 నిర్మాణంలో ఉన్నాయని వివరించారు.

బేటీ బచావో – బేటీ పఢావో, దీన్ దయాళ్ ఉపాధ్యాయ విద్యుత్ యోజన, ఆర్టికల్ 370 రద్దు, 140 శాటిలైట్‌ల ప్రయోగం, చంద్రుడి దక్షిణ ధృవాన్ని చేరటం వంటి చర్యలు మోడీ ప్రభుత్వం సామాజికంగా, శాస్త్రీయంగా దేశాన్ని ముందుకు నడిపించిందని అన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుతూ.. 2014లో లాభాల్లో ఉన్న రాష్ట్రం, మోడీ విధానాలను పాటించకపోవడంతో ఇప్పటికి 10 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 11 Years of Modi Rule
  • BJP Andhra Pradesh
  • bjp campaign
  • india economic growth
  • kisan samman nidhi

తాజావార్తలు

  • Off The Record : ఆత్మకూరులో మంత్రి అనుచరుల అడ్డగోలు దోపిడీ..?

  • Lifetime Achievement Award: ‘ది వాల్’ రాహుల్ ద్రావిడ్ కు అరుదైన గౌరవం..

  • Monalisa- Farman Khan: మోనాలిసాను పెళ్లి చేసుకున్న ఫర్మాన్ ఖాన్ బ్యాక్‌ గ్రౌండ్ ఇదే..

  • CM Revanth Reddy: అల్లు అర్జున్ హాలీవుడ్‌లో కూడా రాణించాలి.. సీఎం రేవంత్ రెడ్డి..

  • Off The Record : బుగ్గన అనుచరులు భూ కబ్జా చేశారా..?

ట్రెండింగ్‌

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • Subramaniya Bharathi: రోజూ కూలీ కుమారుడు.. తొలి ప్రయత్నంలోనే UPSC క్లియర్.. ఇన్‌స్పైర్ స్టోరీ..!

  • ప్రైవసీ కోసం కొత్త సేవ.. మహిళలకు BSNL ‘Kavach Number’ ప్రారంభం..!

  • టీ20 ప్రపంచకప్ విజయం ప్రేరణగా ‘Ola Champions Edition’ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు.. ఫీచర్స్ ఇలా.!

  • LIC New Children Money Back Plan: రోజుకు రూ.150 పెట్టుబడి అంతే.. రూ.19 లక్షలు మీసొంతం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions