World Cup 2023: టీమిండియా ప్రపంచకప్ గెలవడం ఖాయమన్న మాజీ కెప్టెన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ కప్ 2023 భారత గడ్డపై నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 5 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుండగా.. నవంబర్ 19న అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో టైటిల్ మ్యాచ్ జరగనుంది. అయితే 12 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ ట్రోఫీని గెలుచుకోవాలని.. టీమిండియా కచ్చితంగా విజయం సాధిస్తుందని భారత అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ప్రపంచకప్లో టీమిండియా అంచనాలపై మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ తన అభిప్రాయాన్ని తెలిపాడు.
Nama Nageswara Rao: కొత్త పార్లమెంట్ కు అంబేద్కర్ పేరు పెట్టాలని నామా నాగేశ్వరరావు డిమాండ్
Also Read
- Iran-US Ceasefire: గుడ్న్యూస్.. కాల్పుల విరమణకు అమెరికా-ఇరాన్ అంగీకారం?
- Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
- WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. ఇక మీ అకౌంట్కు డబుల్ ప్రొటెక్షన్!
- Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
ముందుగా టాప్-4లో స్థానం సంపాదించడమే మన ప్రాధాన్యత అని కపిల్ దేవ్ అన్నారు. ప్రపంచకప్ లాంటి పెద్ద టోర్నీలో ఆడటం అంటే అదృష్టం ఉండాలని తెలిపారు. మరోవైపు తాజాగా జరిగిన ఆసియా 2023 ఫైనల్ లో ఎలాంటి ప్రదర్శన చూపించిందో మనందరికీ తెలుసు. భారత్ టీమ్ అద్భుతం.. ఇందులో ఎలాంటి సందేహం లేదని కపిల్ దేవ్ పేర్కొన్నారు. ఈసారి టీమిండియా ప్రపంచకప్ గెలవడం ఖాయమని అన్నారు. ఇదిలా ఉంటే ప్రపంచ కప్ కోసం టీమిండియా చాలా కష్టపడాలని తన మనసు చెబుతోందన్నారు.
Srinivasa Setu Flyover: తీరిని ట్రాఫిక్ కష్టాలు.. శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ ప్రారంభించిన సీఎం జగన్
ఆసియా కప్ 2023లో శ్రీలంకపై చెలరేగిన మహ్మద్ సిరాజ్ గురించి కపిల్ దేవ్ ప్రస్తావించారు. ఆసియా కప్ ఫైనల్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్పై కూడా కపిల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. మహ్మద్ సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని అన్నాడు. ఈ రోజుల్లో మన ఫాస్ట్ బౌలర్లు ప్రత్యర్థి జట్లలోని మొత్తం 10 మంది బ్యాట్స్మెన్లను ఔట్ చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ప్రపంచకప్ టైటిల్ను గెలుచుకునేందుకు టీమిండియా సిద్ధంగా ఉందని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు.
Union Cabinet: ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల వేళ.. కేంద్ర కేబినెట్ కీలక భేటీ
ఒకప్పుడు స్పిన్నర్లపైనే జట్టు ఆధారపడేదని.. కానీ ఇప్పుడు అలా కాదన్నారు. ఇప్పుడు ఫాస్ట్ బౌలింగ్ తో జట్టు బలంగా ఉందని తెలిపారు. ఆసియా కప్లో టీమిండియా అద్భుతమైన క్రికెట్ను ప్రదర్శించిందని చెప్పారు. మరోవైపు ప్రపంచకప్కు ముందు టీమిండియాను కపిల్ దేవ్ హెచ్చరించాడు. భారత జట్టులోని చాలా మంది ఆటగాళ్లు ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఈ ఆటగాళ్లలో శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్ ఉన్నారని.. అయితే ఈ ఆటగాళ్లు ప్రపంచకప్కు ముందు పూర్తిగా ఫిట్గా ఉండకపోవడం మంచి సంకేతం కాదని కపిల్ దేవ్ తెలిపారు.
తాజావార్తలు
-
Lurk OTT Release: ఆ అడవిలో అసలు భయం మనుషులే.. ఓటీటీలోకి మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. 8.8 ఐఎండీబీ రేటింగ్
-
Iran-US Ceasefire: గుడ్న్యూస్.. కాల్పుల విరమణకు అమెరికా-ఇరాన్ అంగీకారం?
-
Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
-
US Visa Interview Pause: అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్నవారికి షాక్.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్వ్యూలు వాయిదా, కారణం ఇదే!
-
Ravi Teja-Irumudi: బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న ‘ఇరుముడి’.. రవితేజ @ 100 కోట్ల సినిమాల లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!