Nama Nageswara Rao: కొత్త పార్లమెంట్ కు అంబేద్కర్ పేరు పెట్టాలని నామా నాగేశ్వరరావు డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొత్త పార్లమెంట్ భవనానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు ఎంపి నామ నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేడు (సోమవారం) పార్లమెంట్ లో ఎంపీ నామ మాట్లాడూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ మెరుగైన సుపరిపాలన వల్ల రాష్ట్రం అభివృద్ధిలో నెంబర్ వన్ గా ఉందని ఆయన పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడమే కాకుండా హైదరాబాద్ లో 125 అడుగుల అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెలంగాణలో దళితులు ఆర్థికంగా బలపడేందుకు దళిత బంధు పథకం ప్రవేశ పెట్టినట్లు ఎంపీ నామా నాగేశ్వరరావు తెలిపారు.
Read Also: Srinivasa Setu Flyover: తీరిని ట్రాఫిక్ కష్టాలు.. శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ ప్రారంభించిన సీఎం జగన్
Also Read
- Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
- Virat Kohli: కోహ్లీ ‘స్టంప్ మైక్’ సీక్రెట్ లీక్.. పంజాబ్ను దెబ్బకొట్టిన ఆర్సీబీ వ్యూహం.. ప్లేఆఫ్స్ వేళ సరికొత్త చర్చ..
- Greater Noida: కోటి రూపాయలతో పెళ్లి.. 14 నెలలకే విషాదాంతం! కట్నం వేధింపులకు వివాహిత బలి
ఇంకా రైతు బంధు, రైతు బీమా, రైతులకు 24 గంటల ఫ్రీ కరెంట్ ఇస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణే అని ఆయన అన్నారు. ఈ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ, మహిళా రిజర్వేషన్ల బిల్లులను ప్రవేశపెట్టి, అమోదించాలని నామ పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయమై తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రధాన మంత్రి మోడీకి లేఖ కూడా రాసిన సంగతిని నామ గుర్తు చేశారు. 75 ఏళ్ల ప్రయాణంలో ఈ పార్లమెంట్ లో ఎన్నో బిల్లులు ఆమోదం పొందాయని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. వాటిలో కొన్ని బిల్లుల వలన అభివృద్ధి జరిగింది.. అలాగే కొన్నిటి వలన ఇబ్బందులు కూడా వచ్చాయన్నారు.
Read Also: Union Cabinet: ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల వేళ.. కేంద్ర కేబినెట్ కీలక భేటీ
రాబోయే రోజుల్లో అందరం కల్సి కట్టుగా ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవటానికి పని చేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు అనే విషయాన్ని ఎంపీ నామా నాగేశ్వరరావు గుర్తు చేశారు. బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే నెహ్రు, పటేల్ లాంటి వారు.. మొదటి లోక్ సభ స్పీకర్ గణేష్ వాసుదేవ్ మావ్లాంకర్ నుంచి నేటి స్పీకర్ ఓం బిర్లా వరకు 17 మంది లోక్ సభ స్పీకర్లు ఉన్నారు.. అందులో తెలుగు వారికి మూడు సార్లు ఛాన్స్ ఇచ్చారు.. నీలం సంజీవ రెడ్డికి రెండు సార్లు, బాలయోగి ఒక్కసారి స్పీకర్ గా ఉన్నారని నామా పేర్కొన్నారు.
Read Also: Klin Kaara Konidela: మూడు నెలల తర్వాత తండ్రి ఇంటికి క్లిన్ కార… వేద మంత్రాలతో ఆహ్వానం!
ఒకప్పుడు బీజేపీకి ఇద్దరు ఎంపీలు ఉండేవారు.. ఇప్పుడు 300 మందికి పైగా ఉన్నారు అని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. గత 10 ఏళ్లుగా దేశాన్ని పాలిస్తున్నారు.. అలాగే ఇద్దరు ఎంపీలు ఉన్నా నాటి టీఆర్ఎస్ కోట్లాడి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షను రాష్ట్రాన్ని సాధించామని ఆయన తెలిపారు. 2014 లో ఏపీ విభజన చట్టం పాస్ కావడంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాంది.. దీనిపై ప్రధాని మోడీ తెలంగాణ ఏర్పాటు చేదు జ్ఞాపకాలను మిగిల్చింది అన్నారు.. ఇలాంటి వ్యాఖ్యలు సరికాదు అంటూ ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ దేశంలోని అన్ని రంగాల్లో నెంబర్-1 స్థానంలో ఉందని పార్లమెంట్ వేదికగా ఆయన అన్నారు.
తాజావార్తలు
-
IPL 2026: ఐపీఎల్ ప్లేఆఫ్స్ షెడ్యూల్ మారుతుందా? బీసీసీఐ, కేంద్రం ఆదేశాలపై ఉత్కంఠ!
-
Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
-
SEYON : శివకార్తికేయన్ & కమల్ హాసన్ ‘సెయాన్’ షూటింగ్ స్టార్ట్
-
Salman Khan: స్కూల్ పిల్లల కోసం..సల్మాన్ రూ.15 కోట్ల విరాళం..
-
Health Awareness Wedding: ఆలోచింపజేస్తున్న ఈ వధూవరుల నిర్ణయం.. ఆ టెస్ట్ తర్వాతే వివాహబంధంలోకి అడుగుపెట్టిన జంట
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..