IPL 2025: బీసీసీఐ శతవిధాలా ప్రయత్నాలు.. ఐపీఎల్లో విదేశీ ఆటగాళ్లు ఆడటం అనుమానమే.!
- జూన్ 3న ఐపీఎల్ ఫైనల్..
- జూన్ 11న WTC ఫైనల్..
- రెండింటి మధ్యలో 7 రోజులే గ్యాప్..
- మే 29న వెస్టిండీస్, ఇంగ్లాండ్ మధ్య వన్డే సిరీస్..
- మెయిన్ ప్లేయర్స్ ను మిస్ అవుతున్న ప్రాంచైజీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్ చివరి దశకు చేరుకుంటున్న సమయంలో విదేశీ ఆటగాళ్ల లభ్యత కీలక సమస్యగా మారింది. మే 9న లీగ్ను తాత్కాలికంగా వాయిదా వేయడంతో అనేక విదేశీ ఆటగాళ్లు తమ సొంత దేశాలకు తిరిగి వెళ్లిపోయారు. దీంతో ప్లేఆఫ్ దశకు చేరిన పలు ఫ్రాంచైజీలకు తమ ముఖ్య ఆటగాళ్లను కోల్పోయే ప్రమాదం ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ విదేశీ ఆటగాళ్లను తిరిగి భారత్కి రప్పించేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. ఐపీఎల్ సీఈఓ హేమాంగ్ స్వయంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డులతో నేరుగా మాట్లాడుతున్నారు. అలాగే, పలు ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లతో వ్యక్తిగతంగా సంప్రదింపులు జరుపుతున్నాయి. అయితే, ఆటగాళ్ల రాకపై నిర్ణయం తామేమీ తీసుకోబోమని, ఇది అటుగాళ్ల వ్యక్తిగత నిర్ణయమే అని ఆసీస్ క్రికెట్ బోర్డు ఇప్పటికే స్పష్టం చేసింది.
Read Also: Meizu Note 16 Series: తక్కువ ధరకే భారీ ఫీచర్లతో వచ్చేసిన మెయిజు నోట్ 16 సిరీస్..!
Also Read
- 115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
- Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
- IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
- కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
ఐపీఎల్ ఫైనల్ జూన్ 3న జరగనుండగా.. వన్డే సిరీస్లు, WTC ఫైనల్ వంటి కీలక అంతర్జాతీయ మ్యాచులు షెడ్యూల్ కావడంతో ఆటగాళ్లు తమ జాతీయ బోర్డుల నుంచి అనుమతులు పొందాల్సిన పరిస్థితి ఉంది. జూన్ 11న జరగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్, మే 29న వెస్టిండీస్-ఇంగ్లాండ్ మధ్య వన్డే సిరీస్లు ఉండడంతో ఆ దేశాల ప్లేయర్ల లభ్యతపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో పలు ఫ్రాంచైజీలు ఇప్పటికే తమ మెయిన్ ప్లేయర్స్ లేకుండా ఆడే ప్రమాదంలో ఉన్నాయి.
పంజాబ్ కింగ్స్ నుండి యాన్సన్, జోష్ ఇంగ్లీష్ ను కోల్పోనుంది. అలాగే బెంగళూరు జట్టు హేజిల్వుడ్, షెఫర్డ్, ఫిల్ సాల్ట్, బేతెల్ లను కోల్పోనుంది. అలాగే ముంబై ఇండియన్స్ రెకల్టన్, విల్ జాక్స్ లు అందుబాటులో ఉండరు. ఇక గుజరాత్ టైటాన్స్ లో జాస్ బట్లర్, రూథర్ఫర్డ్, కగిసో రబాడా లాంటి స్టార్లు అందుబాటులో ఉండరు. ఈ నాలుగు టీమ్స్ ప్లే ఆఫ్ రేసులో ఉన్న తరుణంలో, తమ కీలక ఆటగాళ్ల సేవలు లేకుండా పోవడం వారికి తీవ్ర ఇబ్బందిగా మారనుంది. మరి బీసీసీఐ ప్రయత్నాలు ఫలిస్తాయా? విదేశీ ఆటగాళ్లు మళ్లీ ఐపీఎల్కు తిరిగి వస్తారా? అన్నది మరో రెండు రోజుల్లో తేలనుంది.
తాజావార్తలు
-
Jana Nayagan : బాక్సాఫీస్ డిజాస్టర్గా విజయ్ ‘జన నాయగన్’.. డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
IND vs SL Test: శ్రీలంకలో టీమిండియా ల్యాండ్.. స్టార్ ప్లేయర్ మిస్సింగ్.. మొదటి టెస్ట్ డౌటే!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!