IND vs BAN: బంగ్లాదేశ్తో తొలి టెస్టు ఆడేందుకు చెన్నై చేరుకున్న భారత ఆటగాళ్లు..
- సెప్టెంబర్ 19 నుంచి 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ ప్రారంభం.
- తొలి టెస్టు చెన్నై వేదికగా చిదంబరం స్టేడియంలో.
- సిరీస్ కోసం భారత జట్టు ఆటగాళ్లు చెన్నై చేరుకున్నారు.
IND vs BAN Test Series: సెప్టెంబర్ 19 నుంచి భారత క్రికెట్ జట్టు, బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మధ్య 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టు ఆటగాళ్లు చెన్నై చేరుకున్నారు. తొలి టెస్టు చెన్నై వేదికగా చిదంబరం స్టేడియంలో జరగనుంది. చెన్నై చేరుకోగానే ఆటగాళ్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా వీడియోలో కనిపిస్తున్నారు. చాలా కాలం తర్వాత రోహిత్, విరాట్లు టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్నారు. ఇకపోతే., రోహిత్ సారథ్యంలోని 16 మంది సభ్యుల జట్టులోకి కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ తిరిగి వచ్చారు. కొత్తగా యశ్ దయాళ్కు కూడా టీమ్లో అవకాశం దక్కింది. ఒకసారి మొదటి టెస్ట్ కు భారత జట్టు గమనించినట్లైతే ఇలా ఉంది.
CAPTAIN IN CHENNAI…..!!!! 🇮🇳
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
Rohit Sharma has arrived in Chennai for the Test series. [PTI] pic.twitter.com/N99aCp1tHh
— Johns. (@CricCrazyJohns) September 13, 2024
తొలి టెస్టుకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్ , శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ . యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా మరియు యశ్ దయాల్.
VIRAT KOHLI HAS REACHED CHENNAI. 👑
– It's time for the 🐐 to rule Test cricket. pic.twitter.com/hFVsjEx93y
— Johns. (@CricCrazyJohns) September 13, 2024
2000 సంవత్సరంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరిగింది. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 13 మ్యాచ్లు జరిగాయి. ఈ సమయంలో భారత జట్టు 11 మ్యాచ్ల్లో విజయం సాధించింది. 2 మ్యాచ్లు డ్రా అయ్యాయి. బంగ్లాదేశ్ జట్టు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. ఇరు జట్ల మధ్య జరిగిన చివరి 5 టెస్టు మ్యాచ్ల్లో భారత జట్టు అన్ని మ్యాచ్ల్లోనూ విజయం సాధించింది. ఒక్క మ్యాచ్ కూడా డ్రా కాలేదు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో