ICC WC2023: ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ క్రేజ్.. కొండెక్కిన హోటల్ రూమ్ రేట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా- పాకిస్థాన్ దేశాల మధ్య మ్యాచ్ అంటే ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది వీక్షకులు టీవీల ముందు అతుక్కుపోతారు. ఇక, ఈ మ్యాచ్ జరిగే స్టేడియంలో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే, వన్డే ప్రపంచకప్ 2023లో తొలి మ్యాచ్ ఈ రెండు దాయాది దేశాల మధ్య జరుగుతుండటం మరింత ఆసక్తి రేపుతుంది. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో నరేంద్ర మోడీ స్టేడియంలో అక్టోబర్ 5న ఈ మ్యాచ్ జరుగనుంది. అహ్మదాబాద్ వేదికను మార్చాలంటూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ఐసీసీపై తీవ్ర ఒత్తిడి కూడా తెచ్చింది. అయినా పాక్ మాటను ఐసీసీ పట్టించుకోలేదు. దీంతో చివరికి అహ్మదాబాద్ స్టేడియంలోనే రెండు జట్లు తలపడనున్నాయి.
Read Also: Chiranjeevi: ఢిల్లీలో చిరంజీవి మోకాలి నొప్పికి ట్రీట్మెంట్
Also Read
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
- Monsoon Shock: 125 ఏళ్ల తర్వాత ముఖం చాటేసిన వరుణుడు.. ఐదో అత్యంత పొడి జూన్గా రికార్డ్
- Shreyas Iyer: వైభవ్ను తీసుకోకపోవడం తప్పే.. ఎట్టకేలకు దారిలోకి వచ్చేసిన శ్రేయాస్ అయ్యర్..
- Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
ఇక, ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ నుంచి ఫుల్ డిమాండ్ నెలకొంది. అయితే, ఈ డిమాండ్ ను సొమ్ము చేసుకునేందుకు అహ్మదాబాద్ లోని ప్రముఖ హోటళ్లు గదుల అద్దెలను ఒక్కసారిగా పెంచేశాయి. ఒక రోజుకు రూమ్ రెంట్ రూ.లక్షకు చేరింది. హోటల్ బుకింగ్ ల సైట్లు పరిశీలిస్తే.. ఈ విషయం తెలుస్తుంది. సాధారణంగా హోటల్ రూమ్ ల ధరలు డైనమిక్ ప్రైసింగ్ విధానంతో ఉంటాయి. ఎక్కువ మంది హోటల్ రూమ్ చార్జీలను తెలుసుకుంటున్నారు.. బుక్ చేసుకోవడానికి ట్రై చేసినా వాటి ధరలు ఆటోమేటిగ్గా పెరిగిపోతాయి.
Read Also: Thalapathy68: విజయ్ కు విలన్ గా ధోనీ.. ఇదెక్కడి మాస్ రా మావా.. ?
క్రికెట్ అభిమానుల నుంచి డిమాండ్ పెరగడంతో హోటళ్ల యాజమాన్యాలు లాభాల దక్కించుకునేందుకు రూమ్ రెంట్ లు ఒకేసారి పది రెట్లు పెంచేశారు. ఒక్కో రూమ్ రూ.లక్షకు చేరింది. ఇప్పటికే కొన్ని హోటళ్లలోని గదులన్నీ బుక్ అయ్యాయి. సాధారణ హోటళ్లలోనూ ఒక రోజుకు రూమ్ రెంట్ రూ.5,000-8,000 నుంచి రూ.40,000 వరకు పెరిగింది. ఐటీసీ హోటల్స్ కు చెందిన వెల్ కమ్ హోటల్ లో సాధారణ రోజు అద్దె రూ.5,699గా ఉంటే, మ్యాచ్ జరిగే రోజున రూ.71,999కు పెరిగింది. రినైసెన్స్ అహ్మదాబాద్ హోటల్ లోనూ గది రెంట్ రూ.8,000 నుంచి రూ.90,679కు పెరిగింది. దీంతో రూమ్ అద్దెలను చూసిన క్రికెట్ అభిమానులు షాక్ అవుతున్నారు.
తాజావార్తలు
-
Alpha Movie Remunerations: హీరోల రేంజ్లో ఆలియా రెమ్యూనరేషన్.. అక్షరాల ఎన్ని కోట్లో తెలుసా?
-
TG Cabinet Meeting : జూలై 2న తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం.!
-
Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
రూ.6,650 కోట్లతో రాబోతున్న OYO ఐపీఓ.. కానీ ఆ డబ్బంతా దేనికి వాడుతున్నారో తెలిస్తే షాకవుతారు!
ట్రెండింగ్
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!