Woman Premier League: మహిళల ఐపీఎల్ జట్లకు భారీ ధర.. బీసీసీఐకి కాసుల వర్షం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman Premier League: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ జట్ల వేలం బీసీసీఐకి ఊహించని రీతిలో కాసుల వర్షం కురిపించింది. ఆరంభ లీగ్లోనే ఐదు జట్ల అమ్మకానికిగానూ బోర్డుకు రూ. 4669.99 కోట్ల ఆదాయం సమకూరింది. బీసీసీఐ సెక్రటరీ జే షా బుధవారం ట్విటర్లో మొత్తం బిడ్డింగ్ ధర వివరాలను తెలియజేశారు. ఈ టోర్నీకి బీసీసీఐ మహిళల ప్రీమియర్ లీగ్గా పేరు పెట్టిందని జై షా తెలిపారు. 2008లో ప్రారంభ పురుషుల ఐపీఎల్ కోసం జట్ల బిడ్డింగ్ ద్వారా పొందిన దాని కంటే బిడ్డింగ్ మొత్తం ద్వారా వచ్చిన మొత్తం ఎక్కువ అని ఆయన వెల్లడించారు. బిగ్బాష్ లీగ్, హండ్రెడ్ లీగ్ సహా ఏ దేశవాళీ లీగ్ కూడా డబ్ల్యూపీఎల్కు దరిదాపుల్లో కూడా లేకపోవడం విశేషం. బుధవారం ముంబైలో ఐదు జట్లు అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, ఢిల్లీ, లఖ్నవూలకు సంబంధించిన బిడ్లను బీసీసీఐ ఖరారు చేసింది. మొత్తం 17 బిడ్లు దాఖలైనట్లు బోర్డు వెల్లడించింది.
అహ్మదాబాద్ టీమ్ను అదానీ స్పోర్ట్స్లైన్ ప్రైవేట్ లిమిటెడ్ అత్యధికంగా రూ.1289 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ముంబై ఫ్రాంచైజీని ముంబై ఇండియన్స్ యాజమాన్యంలోని ఇండియావిన్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.912.99 కోట్లకు గెలుచుకుంది. బెంగళూరు ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యంలోని రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 901 కోట్ల రూపాయలకు ఖరీదు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ యజమానులైన జేఎస్డబ్ల్యూ జీఎంఆర్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్, ఢిల్లీ ఫ్రాంచైజీని రూ. 810 కోట్ల బిడ్తో గెలుచుకోగా, లక్నో ఫ్రాంచైజీని రూ. 757 కోట్లకు కాప్రీ గ్లోబల్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలు చేసింది.
Also Read
- Iran: ఖమేనీ అంత్యక్రియలకు ప్రతిపక్ష కాంగ్రెస్కు ఆహ్వానం.. ఎవరు వెళ్లనున్నారంటే..!
- Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
- Stock Market: మార్కెట్లకు పండుగలాంటి వార్త.. కలిసిరానున్న జూలై! కారణాలివే!
- Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
Suresh Raina: సూర్యకుమార్ యాదవ్ లేకుండా మూడు ఫార్మాట్లూ ఉండవు..
ప్రసార హక్కుల ద్వారా సమకూరిన రూ. 951 కోట్లతో కలిపి.. ఒక్క బంతికూడా పడకుండానే మహిళల ప్రీమియర్ లీగ్ ద్వారా బోర్డు రూ. 5,650.99 కోట్ల రెవెన్యూ ఆర్జించినట్టయింది. కోల్కతా రూ. 666 కోట్ల బిడ్ వేసినా.. మిగతా పోటీదారులు అంతకంటే ఎక్కువ కోట్ చేశారు. దాఖలైన టెండర్లలో రాజస్థాన్ రాయల్స్ రూ. 180 కోట్ల బిడ్ అన్నింటికంటే అత్యల్పం. 2008లో ఐపీఎల్ టీమ్ల ద్వారా వచ్చిన దానికంటే ఈ మొత్తం ఎంతో ఎక్కువని బీసీసీఐ కార్యదర్శి జై షా చెప్పాడు.
ఫ్రాంచైజీ-జట్లు-ధర
అదానీ స్పోర్ట్స్లైన్ ప్రైవేట్ లిమిటెడ్- అహ్మదాబాద్- రూ. 1289 కోట్లు
ఇండియావిన్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్-ముంబై- రూ. 912.99కోట్లు
రాయల్ చాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్- బెంగళూరు- రూ. 901 కోట్లు
జేఎస్డబ్ల్యూ జీఎంఆర్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్- ఢిల్లీ- రూ. 810 కోట్లు
కాప్రీ గ్లోబల్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్- లఖ్నవూ- రూ. 757 కోట్లు
తాజావార్తలు
-
Adani Ports: రూ.13,225 కోట్ల మెగా డీల్.. అదానీ షేర్ కొనేందుకు ఎగబడుతున్న ఇన్వెస్టర్లు! ఆ షేర్ ఏదో తెలుసా?
-
Iran: ఖమేనీ అంత్యక్రియలకు ప్రతిపక్ష కాంగ్రెస్కు ఆహ్వానం.. ఎవరు వెళ్లనున్నారంటే..!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
Stock Market: మార్కెట్లకు పండుగలాంటి వార్త.. కలిసిరానున్న జూలై! కారణాలివే!
-
Ameer Log: ‘అమీర్ లోగ్’ను రెండు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతున్న రానా
ట్రెండింగ్
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!