Covid Vaccines: కోవిడ్ వ్యాక్సిన్ల కోసం రూ. 36 వేల కోట్లు.. ప్రజలు ఎన్ని డోస్లు తీసుకున్నారంటే..?
- 2024 జూలై 29 వరకు దేశవ్యాప్తంగా 220 కోట్లకు పైగా కోవిడ్ -19 వ్యాక్సిన్ అందించాం
- -కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్
- వ్యాక్సిన్ మైత్రి కార్యక్రమం కింద భారతదేశం 3012 లక్షల డోస్లు
- 99 దేశాలకు.. రెండు UN సంస్థలకు పంపించాం- ప్రతాప్రావు జాదవ్
- కోవిడ్ వ్యాక్సిన్ల కొనుగోలు కోసం సుమారు రూ. 36 వేల 398 కోట్లు ఖర్చు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2024 జూలై 29 వరకు దేశవ్యాప్తంగా 220 కోట్లకు పైగా కోవిడ్ -19 వ్యాక్సిన్ను అందించినట్లు కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ లోక్సభలో తెలిపారు. వ్యాక్సిన్ మైత్రి కార్యక్రమం కింద భారతదేశం 3,012 లక్షల డోస్ల కోవిడ్-19 వ్యాక్సిన్లను 99 దేశాలకు, రెండు UN సంస్థలకు పంపించామని ఆయన చెప్పారు. అలాగే.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచిత సరఫరా కింద కోవిడ్ వ్యాక్సిన్ల కొనుగోలు కోసం సుమారు రూ. 36 వేల 398 కోట్లు ఖర్చు చేశామన్నారు.
Read Also: Double iSmart: డబల్ ఇస్మార్ట్ ట్రైలర్ వచ్చేది అప్పుడే
Also Read
- Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
- Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Team India: టీం ఇండియాలో భగ్గుమన్న విభేదాలు.. కోచ్ గంభీర్ను పక్కనబెట్టి నేరుగా బీసీసీఐ పెద్దల వద్దకు సీనియర్లు!
రాష్ట్ర మంత్రి ప్రతాప్రావు జాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వ్యాక్సిన్ల కేటాయింపు దామాషా లక్ష్యం.. జనాభా, అక్కడ వ్యాక్సిన్ల పురోగతి, వ్యాక్సిన్ల వృధా ప్రాతిపదికన జరుగుతుందన్నారు. రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సిన్ల పంపిణీ కార్యక్రమం అవసరాన్ని బట్టి.. రాష్ట్ర పరిపాలన ద్వారా నిర్వహించబడుతుందని ఆయన పేర్కొన్నారు. ‘వ్యాక్సిన్ మైత్రి’ కార్యక్రమం కింద భారతదేశం మొత్తం 3012.465 లక్షల డోసుల కోవిడ్-19 వ్యాక్సిన్లను.. 99 దేశాలు, రెండు UN సంస్థలకు పంపినట్లు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి తెలిపారు.
Read Also: Bombay High Court: “పాకిస్తాన్ లేదా గల్ఫ్ కంట్రీకి వెళ్లండి”.. శరణార్థిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం..
బయోటెక్నాలజీ విభాగం (DBT), బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (BIRAC).. దాని ప్రభుత్వ రంగ సంస్థ, COVID-19 వ్యాక్సిన్ల పరిశోధన మరియు అభివృద్ధి కోసం విద్యాసంస్థలు.. పరిశ్రమలకు మద్దతునిచ్చాయని మంత్రి ప్రతాపరావు జాదవ్ తెలిపారు. డీబీటీ, బీఐఆర్ఏసీ ద్వారా రూ.533.3 కోట్ల పెట్టుబడులు విడుదల చేసినట్లు అమలు చేసే ఏజెన్సీలకు తెలిపారు. మిషన్ కోవిడ్ సురక్ష కింద.. వ్యాక్సిన్ తయారీదారులకు వారి సౌకర్యాల వద్ద వ్యాక్సిన్ తయారీని పెంచడానికి రూ. 158.4 కోట్ల సహాయం అందించారు. కోవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సుమారు రూ. 60 కోట్లు ఖర్చు చేసిందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాపరావు జాదవ్ తెలిపారు.
తాజావార్తలు
-
June 2026 Movie Releases: ‘పెద్ది’ తర్వాత థియేటర్లలోకి వచ్చే సినిమాలు ఇవే..
-
Elon Musk: ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎలాన్ మస్క్కు అడుగు దూరంలో అరుదైన ఘనత!
-
Pawan Kalyan : యాక్టింగ్’కు దూరంగా పవన్?
-
Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
-
Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!