Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
- మమతా బెనర్జీకి మరో భారీ షాక్..
- రెబల్ క్యాంపులోకి సయోనీ ఘోష్..
- మమత వీర విధేయురాలిగా పేరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నిన్నమొన్నటి వరకు మమతా బెనర్జీ అంటే ఎంతో విధేయత చూపించిన వారు కూడా ఇప్పుడు ఆమెకు దూరంగా వెళ్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), మమతకు వీరవిధేయురాలుగా గుర్తింపు పొందిన సాయోని ఘోష్ కూడా రెబల్ వర్గంలోకి వెళ్తోంది. జాదవ్ పూర్ ఎంపీ సయోనీ ఒకానొక సమయంలో మమతా బెనర్జీ ప్రధాని కావడం ఖాయం అంటూ కామెంట్స్ చేసింది. ఇప్పుడు, ఆమె కాకొలి ఘోష్ దస్తిదార్ నేతృత్వంలోని టీఎంసీ రెబల్ వర్గంలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తిరుగుబాటు టీఎంసీ వర్గానికి మద్దతు తెలిపుతూ సాయోనీ సంతకం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె కోల్కతాలో కాకుండా ఢిల్లీలో ఉన్నారని సమాచారం. తిరుగుబాటు ఎంపీలంతా అక్కడే సమావేశమవుతున్నారు.
సాయోని ఘోష్ తన వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. బీజేపీపై తీవ్ర విమర్శలు చేసిన ఈమె, మమతా బెనర్జీకి నమ్మినబంటుగా వ్యవహరించేవారు. మమత ప్రధాని అవుతారంటూ ఎన్నో సార్లు పొగడ్తలు కురిపించిన ఆమె, బెంగాల్లో తృణమూల్ ఘోర పరాజయం చవిచూసిన తర్వాత ప్లేట్ ఫిరాయించారు. తాను ఎన్నటికి మమతను విడిచిపెట్టేది లేదని ఒక ఇంటర్వ్యూలో చెప్పిన సాయోని ఘోష్, ఇప్పుడు మమతకు పెద్ద దెబ్బేసింది.
Also Read
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘోర ఓటమి తర్వాత కూడా, సాయోనీ బీజేపీని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ ఓట్ల దొపిడీకి పాల్పడిందని ఆరోపించారు. మేము ఓడిపోలేదు, ఓట్ల దొంగతనం జరిగిందని అన్నారు. 2029లో దేశ ప్రజలు, 2031లో బెంగాల్ ప్రజలు బీజేపీకి తగిన సమాధానం చెబుతారని విమర్శించింది. ఇలా కామెంట్స్ చేసిన నెల రోజులకే మమతా బెనర్జీకి బిగ్ షాక్ ఇచ్చింది.
తాజావార్తలు
-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
-
Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
-
Telangana Police : మాజీ డీజీపీలకు షాక్.. బుల్లెట్ప్రూఫ్ కార్లు వెనక్కి.!
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!