Serilingampalle: బిగ్ బాస్కెట్ స్టోర్ లైసెన్స్ సస్పెండ్ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు
హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీ పై అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. బిగ్ బాస్కెట్ స్టోర్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించి.. పలు లోపాలను గుర్తించారు. స్టోరేజ్ లో సరైన ప్రమాణాలను పాటించకపోవడంతో పాటు ఎక్స్పైరీ అయిపోయిన వస్తువులను గుర్తించారు. 5 కు పైగా పదార్థాలను ఎక్స్పైరీ అయినట్లు తేల్చారు. పాడైన అరటి పళ్ళు, సపోటా పళ్ళను గుర్తించి వాటిని పారవేశారు. టాస్క్ ఫోర్స్ సిబ్బంది హలో పదార్థాల శాంపిల్స్ సైతం సేకరించారు. అధికారుల నివేదిక ప్రకారం.. శేర్లింగంపల్లి జోన్ పరిధిలోని మజీద్ బండలో ఉన్న బిగ్ బాస్కెట్ స్టోర్ లో కూల్ డ్రింక్స్, ఫ్లేవర్డ్ మిల్క్ బాటిల్స్ ని రికమండేషన్ ప్రకారం సూచించిన పద్ధతిలో స్టోర్ చేయలేదు. సానిటరీ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ ని పక్కపక్కనే స్టోర్ చేశారు. ఫుడ్ హ్యాండిలర్స్, వెజిటబుల్ హ్యాండిలర్స్ కి గ్లౌజులు, ఆప్రాన్స్ లేవు. పాల సీసాలు (10), చిక్కటి షేక్ సీసాలు (5), స్టింగ్ టిన్ బాటిళ్లు (50) తయారీదారు నిల్వ పరిస్థితుల ప్రకారం ఉంచలేదు. గడువు ముగిసిన చికెన్ మసాలా, పిజ్జా చీజ్, పనీర్, ఐస్క్రీమ్లు, ఆల్మండ్ ఫడ్జ్ లు ఉన్నాయి.
READ MORE: Israel-Gaza: అంతర్జాతీయ కోర్టు సంచలన తీర్పు.. రఫాపై తక్షణమే దాడులు ఆపాలని ఆదేశం
Also Read
- Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
- BJP: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
- Bank Robbery: పట్టపగలు SBI బ్యాంక్లో ఘరానా దోపిడీ.. వీడియో వైరల్
- Airlines Crisis: ఇలాగైతే విమానాలు నిలిచిపోతాయి.. కేంద్రానికి ఎయిల్లైన్స్ హెచ్చరిక..
ఈ అంశాలను గుర్తించిన టాస్క్ ఫోర్స్ అధికారులు శేర్లింగంపల్లి జోన్ పరిధిలోని మజీద్ బండలో ఉన్న బిగ్ బాస్కెట్ స్టోర్ లైసెన్స్ సస్పెండ్ చేశారు. ప్రజా ఆరోగ్య దృష్ట్యా మరికొన్నాళ్లపాటు ఇలాగే దాడులు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ఇదే కాకుండా నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రముఖ హోటల్స్, రెస్టారెంట్లను నిశితంగా తనిఖీ చేస్తున్నారు. ఇప్పటి వరకు వందకు పైగా హోటల్లో రెస్టారెంట్లు ఫుడ్ సరఫరా సంస్థలను తనిఖీ చేశారు ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు. 55 హోటల్స్, రెస్టారెంట్లు ఫుడ్ సరఫరా సంస్థల్లో లోపాలను గుర్తించారు. జీహెచ్ఎంసీ, రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ వాటిపై చర్యలకు ఉపక్రమించింది. వీటి నివేదికలను త్వరలో ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్లకు పంపనున్నట్లు అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..
-
Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
-
BJP: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
-
Bank Robbery: పట్టపగలు SBI బ్యాంక్లో ఘరానా దోపిడీ.. వీడియో వైరల్
-
Stock Market Crash: రెండు గంటల్లోనే రూ.3.7 లక్షల కోట్లు లాస్.. ఇన్వెస్టర్లను ముంచేసిన మంగళవారం!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో