హైదరాబాద్ లోని వనస్థలిపురంలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. ఒకే కుటుంబంలో 8మందికి ఫుడ్ పాయిజన్ అయ్యింది. ఎల్బీనగర్ చింతలకుంటలో ఘటన చోటుచేసుకుంది. ఓ కుటుంబం బోనాల పండుగ రోజు తెచ్చుకున్న మటన్ ను వండి ఫ్రిజ్లో పెట్టుకుంది. ఫ్రిజ్లో లో నిల్వ చేసిన మటన్ ని ఈ రోజు తిరిగి తినడంతో ఫుడ్ పాయిజన్ కు గురైనట్లు సమాచారం. ఫుడ్ పాయిజన్ కావడంతో ఆర్టీసీ ఉద్యోగి శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా ఏడుగురు కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. వారిని చింతలకుంటలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. కాగా వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.