India On Nepal: నేపాల్ ప్రధానికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్.. ఎందుకంటే..
- సరిహద్దు వివాదంలో మూడో పక్షం జోక్యాన్ని తిరస్కరించిన భారత్.
- నేపాల్ ప్రధాని బాలెన్ షా వ్యాఖ్యలకు భారత్ కౌంటర్.
- భారత్-నేపాల్ సరిహద్దులో 98 శాతం గుర్తింపు పూర్తయిందని విదేశాంగ శాఖ.
- లిపులేఖ్, లింపియాధురా, కాలాపానీ ప్రాంతాలపై కొనసాగుతున్న వివాదం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India On Nepal: భారత్తో సరిహద్దు వివాదంపై నేపాల్ ప్రధాని బాలెన్ షా ప్రగల్భాలు పలకడంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నేపాల్తో ఉన్న సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకోవడానికి మూడో పక్షం మధ్యవర్తిత్వాన్ని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించింది. లిపులేఖ్, లింపియాధురా, కాలాపానీ ప్రాంతాలపై రెండు దేశాల మద్య వివాదం ఉంది. అయితే, ఇటీవల ఈ మార్గాల ద్వారా చైనాతో వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించడంపై నేపాల్ తీవ్ర అభ్యంతరం తెలుపుతోంది.
ఇటీవల నేపాల్ పార్లమెంట్లో ఆ దేశ ప్రధాని బాలెన్ షా మాట్లాడుతూ.. సమస్య పరిష్కారానికి బ్రిటన్, చైనాలతో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. ఈ వివాదంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. సరిహద్దు సమస్యకు సంబంధించిన అన్ని అంశాలను పరిష్కరించుకోవడానికి ఇరుపక్షాలు ద్వైపాక్షిక యంత్రాంగాలను ఏర్పాటు చేసుకున్నాయని, భారత్-నేపాల్ సరిహద్దులో సుమారు 98 శాతం సరిహద్దును గుర్తించామని చెప్పారు.
Also Read
- NEET UG 2026 Re-Exam: నాగపూర్ విద్యార్థికి అబుదాబిలో నీట్ రీ-ఎగ్జామ్ సెంటర్.. హాల్ టికెట్ చూసి మైండ్ బ్లాక్!
- Monsoon 2026: అన్నదాతలకు శుభవార్త.. ఎట్టకేలకు పుంజుకున్న రుతుపవనాలు.. ఈ తేదీల్లో వర్షాలు!
- KCC New Rules 2026: కిసాన్ క్రెడిట్ కార్డ్ కొత్త నిబంధనలు.. రైతులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- Vivek Agarwal: FATF ఉపాధ్యక్షుడిగా వివేక్ అగర్వాల్.. ప్రపంచ వేదికపై పెరిగిన భారత ప్రతిష్ఠ
లిపులేఖ్, లింపియాధుర, కాలాపానీ ప్రాంతాలు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భాగమని భారత్ చెబుతుంది. అయితే, ఈ ప్రాంతాలు తమవే అని నేపాల్ వాదిస్తోంది. కేపీ శర్మ ఓలీ నేపాల్ ప్రధానిగా ఉన్న సమయంలో ఈ వివాదం చెలరేగింది. బాలెన్ షా ఇటీవల మాట్లాడుతూ.. నేపాల్ కూడా భారత భూభాగాన్ని ఆక్రమించిందని చెప్పడం వివాదాస్పదమైంది. ఆయన ప్రకటనపై సొంతదేశంలోని నెటిజన్లే విమర్శలు చేస్తున్నారు.
తాజావార్తలు
-
IPL 2027: రిషభ్ పంత్ రాక.. కేఎల్ రాహుల్ భవిష్యత్తుపై చర్చ!
-
Viral News: రబ్బర్ను మింగేసిన 4ఏళ్ల బాలుడు.. తర్వాత ఏం జరిగిందో తెలిస్తే..
-
NEET UG 2026 Re-Exam: నాగపూర్ విద్యార్థికి అబుదాబిలో నీట్ రీ-ఎగ్జామ్ సెంటర్.. హాల్ టికెట్ చూసి మైండ్ బ్లాక్!
-
SBI Mutual Fund IPO: ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ IPOకు సెబీ గ్రీన్ సిగ్నల్.. రూ.13,000 కోట్లతో మార్కెట్లోకి
-
Bandla Ganesh: ‘పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోనే’.. నిరంజన్ కుటుంబానికి బండ్ల గణేష్ ఆర్థిక చేయూత
ట్రెండింగ్
-
Titanoboa: డైనోసార్ల తర్వాత భూమిని ఏలిన ‘టైటానోబోవా’.. ఈ అతిపెద్ద సర్పం గురించి షాకింగ్ విషయలు..
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!