INDIA Bloc: సాయంత్రం ఖర్గే ఇంట్లో ఇండియా కూటమి నేతల భేటీ.. స్పీకర్ ఎన్నికపై చర్చ
- సాయంత్రం ఖర్గే ఇంట్లో ఇండియా కూటమి నేతల భేటీ
- స్పీకర్ ఎన్నికపై చర్చ... కాంగ్రెస్ నుంచి సురేష్ నామినేషన్
- డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తే పోటీ నుంచి తప్పుకుంటామన్న కాంగ్రెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో రాత్రి 8 గంటలకు ఇండియా కూటమి ఫ్లోర్ లీడర్లు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ఇదిలా ఉంటే సోమవారం నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన ఎంపీలంతా ప్రమాణస్వీకారం చేశారు. ఇక బుధవారం లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఇందుకోసం నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఈసారి ఎన్నడూ లేని విధంగా స్పీకర్ పదవికి పోటీ నెలకొంది. ఎన్డీఏ కూటమి నుంచి ఓం బిర్లా నామినేషన్ వేయగా.. ఇండియా కూటమి నుంచి కె.సురేష్ నామినేషన్ దాఖలు చేశారు. దీంతో స్పీకర్ ఎన్నికకు పోటీ నెలకొంది.

Also Read
- TMC crisis: మళ్లీ కాంగ్రెస్ గూటికి మమతా బెనర్జీ? ఢిల్లీ వేదికగా టీఎంసీ విలీనానికి తెరవెనుక స్కెచ్!
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ఎందుకు విఫలమయ్యాడు? ఒక షాట్.. ఒక తప్పిదం.. వైభవ్కు విలువైన పాఠం..!
- Pakistan: పీవోకేలో కూలిన పాక్ హెలికాప్టర్.. 21 మంది సైనికులు మృతి
- TMC Crisis: మూడు దశాబ్దాల దీదీ సామ్రాజ్యం నిలువునా కొల్లాప్స్.. టీఎంసీ కూలడానికి ప్రధాన కారణాలు ఇవే..
సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి పోటాపోటీగా సీట్లు గెలుచుకున్నాయి. ఎన్డీఏ కూటమి 293 సీట్లు గెలుచుకోగా.. ఇండియా కూటమి 233 సీట్లు గెలుచుకుంది. ఇక కాంగ్రెస్ సొంతంగా 99 సీట్లు గెలుచుకుని ప్రతిపక్ష హోదాను సంపాదించింది. అయితే ఇండియా కూటమి డిప్యూటీ స్పీకర్ పదవిని ఆశిస్తోంది. ఈ పదవి ఇస్తే.. ఎన్డీఏ కూటమి బలపరిచిన స్పీకర్ అభ్యర్థికి సపోర్టు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఒకవేళ అంగీకరించకపోతే స్పీకర్ పోస్టుకు పోటీ చేస్తామని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Prize Money: కోట్లు గెలిచాడు.. సంతోషంలో గుండెపోటుతో పోయాడు..
కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. డిప్యూటీ స్పీకర్ పోస్టుపై ఎన్డీఏ నిర్ణయానికి ఎదురుచూస్తున్నామన్నారు. డిప్యూటీ స్పీకర్ పదవిని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే.. తాము ఎన్డీఏ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రధాని మోడీ విజ్ఞప్తి చేసినట్లుగా ఉభయ సభల్లో సభ సజావుగా సాగేందుకు సహకరిస్తామని వెల్లడించారు. అలాగే కేంద్రం కూడా ప్రతిపక్షాలను గౌరవించవలసి ఉంటుందన్నారు. కాంగ్రెస్ హయాంలో 10 ఏళ్లు డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలకు ఇచ్చినట్లు గుర్తుచేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఇచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. అలాగే లోక్సభలో కూడా ఇవ్వాలని వేణుగోపాల్ డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Kalki 2898 AD: “నన్ను చంపొద్దు ప్లీజ్” ప్రభాస్ అభిమానులకు క్షమాపణలు చెప్పిన అమితాబ్.. ఎందుకో తెలుసా?
తాజావార్తలు
-
TMC crisis: మళ్లీ కాంగ్రెస్ గూటికి మమతా బెనర్జీ? ఢిల్లీ వేదికగా టీఎంసీ విలీనానికి తెరవెనుక స్కెచ్!
-
Sai Pallavi: సాయి పల్లవికి ‘రామాయణ’ శాపంగా మారిందా?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ఎందుకు విఫలమయ్యాడు? ఒక షాట్.. ఒక తప్పిదం.. వైభవ్కు విలువైన పాఠం..!
-
Pakistan: పీవోకేలో కూలిన పాక్ హెలికాప్టర్.. 21 మంది సైనికులు మృతి
-
TMC Crisis: మూడు దశాబ్దాల దీదీ సామ్రాజ్యం నిలువునా కొల్లాప్స్.. టీఎంసీ కూలడానికి ప్రధాన కారణాలు ఇవే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!